T20 WC 2024: కొత్త జట్లు దూసుకొస్తున్నాయ్
వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) కొత్త జట్లను చూడబోతున్నాం. క్వాలిఫయర్స్ మ్యాచుల్లో అదరగొట్టిన ఆయా జట్లు అర్హత సాధించాయి.
క్రికెట్ అనగానే ఒకప్పుడు కొన్ని జట్లే గుర్తొచ్చేవి. ఆ పది జట్లే పెద్ద టోర్నీల్లోనూ ఆడేవి. కెన్యా లాంటి జట్లు కొన్ని మెరుపులు మెరిపించినా ఆ తర్వాత అవి కనిపించకుండాపోయాయి. అందుకే క్రికెట్ అంటే కొన్ని జట్లకే పరిమితం అన్నట్లు చాలా ఏళ్లు నడిచింది. కానీ గత కొన్నేళ్లుగా పరిస్థితి పూర్తిగా మారింది. కానీ ప్రపంచవ్యాప్తంగా విస్తరించే క్రమంలో క్రికెట్ వడివడిగా అడుగులు వేస్తున్న తరుణంలో కొత్త జట్లు దూసుకొస్తున్నాయి. పెద్ద టోర్నీలకు అర్హత సాధిస్తూ ఆకట్టుకుంటున్నాయి. 2024 టీ20 ప్రపంచకప్లో (T20 World Cup 2024) అలాంటి జట్లు రానున్నాయి. ఇప్పటికే నేపాల్, పపువా న్యూగినియా, కెనడా, నమీబియా, ఉగాండా లాంటి చిన్న జట్లు మెగా టోర్నీకి అర్హత సాధించి సత్తా చాటాయి.
ఫార్మాట్ వల్లే
2024 టీ20 ప్రపంచకప్ ఫార్మాట్ ఎక్కువ చిన్న జట్లకు అవకాశాన్ని కల్పిస్తోంది. తమ కెరీర్లో పెద్ద స్టార్లతో ఆడతామా అని కలలు కన్న చిన్న జట్ల ఆటగాళ్లకు విరాట్ కోహ్లి, వార్నర్ లాంటి యోధులతో కలిసి మైదానాన్ని పంచుకునే అవకాశం కలుగుతోంది. వెస్టిండీస్-అమెరికా వేదికగా జరుగుతున్న 2024 టీ20 ప్రపంచకప్లో గ్రూప్ దశలో 20 జట్లు ఆడే ఛాన్స్ ఉండడంతో ర్యాంకుల్లో తొలి పది స్థానాల్లో ఉన్న జట్లతో పాటు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతీయ టోర్నీల్లో సత్తా చాటిన జట్లు ముందంజ వేస్తున్నాయి.. దీంతో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లాంటి టాప్ జట్లతో తలపడే అవకాశాన్ని చేజిక్కించుకుంటున్నాయి. పెద్ద జట్లపై ఒక్క మ్యాచ్ గెలిచినా అదో పెద్ద సంచలనమే అవుతుంది. ఇటీవల వన్డే ప్రపంచకప్లో నెదర్లాండ్స్ సాధించిన విజయాలను అభిమానులు మరిచిపోలేరు. ముఖ్యంగా దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుకు షాక్ ఇవ్వడం ఎవరూ ఊహించలేదు. మాల్టా లాంటి చిన్న దేశాలు కూడా క్రికెట్లో తన ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. మిగిలిన ఆటల్లో టాప్ దేశంగా ఉండే అమెరికా కూడా ఇప్పుడు క్రికెట్పై దృష్టి పెట్టింది. మేజర్ క్రికెట్ లీగ్ పేరిట జరిగిన టీ20 లీగ్కు మంచి ఆదరణ లభించింది. టీ20 ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీకి తొలిసారి అమెరికా ఆతిథ్యం ఇస్తోంది. ఈ కప్ రాకతో తమ దేశంలో క్రికెట్ మరింతగా విస్తరిస్తుందని.. అభిమానుల్లో ఆదరణ ఇంకా పెరుగుతుందని యుఎస్ క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
చిన్న జట్లే అనుకుంటే
ప్రపంచకప్కు అర్హత సాధించడమే కాదు కొన్ని టోర్నీల్లో పెద్ద జట్లకు ఝులక్ ఇచ్చి ఉనికిని చాటుకుంటున్నాయి పసికూనలు. తాజాగా జింబాబ్వేపై ఉగాండా విజయం అలాంటిదే. నిజానికి ఉగాండా అనే జట్టు ఒకటుందన్న విషయం కూడా అభిమానులకు తెలియదు. అలాంటిది చిన్న జట్లలో కాస్త పెద్ద జట్టయిన...గతంలో ఓ మోస్తరు జట్టుగా కొనసాగిన జింబాబ్వేపై గెలవడం నిజంగా అభినందించదగ్గ విషయమే. ఇక సదుపాయాలు లేకపోయినా నేపాల్ జట్టు చేస్తున్న సంచలన ప్రదర్శన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ కిడ్స్ ఏకంగా ప్రపంచ రికార్డులనే కొల్లగొట్టేస్తున్నారు. ఆసియాక్రీడల్లో టీ20 ఫార్మాట్లోనే సంచలన ప్రదర్శన చేశారు. ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే కాదు ఐరోపా దేశాల్లో క్రికెట్ వేగంగా విస్తరించి ముందుకెళ్తుండడం ఆహ్వానించదగ్గ పరిణామం. అమెరికాతో పాటు స్విట్జర్లాండ్, పోర్చుగల్, స్పెయిన్ లాంటి దేశాలు కూడా క్రికెట్లో వేగంగా అడుగులు వేస్తున్నాయి. 2026 లాస్ఏంజెలస్ ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చిన నేపథ్యంలో ఈ ఆట విశ్వ క్రీడగా మారడానికి ఎంతో కాలం పట్టదు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా