WTC Final: శ్రీలంక ఓడింది.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లింది
ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్టు (IND vs AUS) ఫలితం రాకముందే రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్కు భారత్ దూసుకెళ్లింది. ఉత్కంఠభరితంగా సాగిన టెస్టులో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక ఓటమి చవిచూసింది.
ఇంటర్నెట్ డెస్క్: కేన్ మామ టీమ్ఇండియాను ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు చేర్చాడు. ఇదేంటి..? న్యూజిలాండ్ క్రికెటర్ కేన్ విలియమ్సన్కు.. భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరడానికి సంబంధం ఏంటని అనుకుంటున్నారా..? శ్రీలంకతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్లో సెంచరీతో న్యూజిలాండ్ను కేన్ విలియమ్సన్ విజయతీరాలకు చేర్చాడు. దీంతో ఆసీస్తో జరుగుతున్న నాలుగో టెస్టు డ్రా అయినా సరే టీమ్ఇండియా మాత్రం డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లిపోయింది.
శ్రీలంకతో తొలి టెస్టులో 285 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి.. 70 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసిన న్యూజిలాండ్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేన్ విలియమ్సన్ (121*) సెంచరీతోపాటు డారిల్ మిచెల్ (81) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. టామ్ లేథమ్ 24, డేవన్ కాన్వే 5, హెన్రీ నికోల్స్ 20, మిచెల్ బ్రాస్వెల్ 10, బ్లండెల్ 3 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 3, జయసూరియ 2.. రజిత, లాహిరు కుమార చెరో వికెట్ తీశారు. అంతకుముందు శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 355 పరుగులు చేయగా.. న్యూజిలాండ్ దీటుగా స్పందించి 373 పరుగులు చేసి 18 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో శ్రీలంక 302 పరుగులకు ఆలౌటైంది.
ఫ్రెండ్స్ ఇద్దరూ..
అండర్ -19 నుంచి టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్ మంచి స్నేహితులు. గత కొంతకాలంగా టెస్టుల్లో సెంచరీ కోసం ఎదురు చూస్తున్న వీరిద్దరూ.. తాజాగా ఆ మార్క్ను సాధించారు. ఆసీస్పై నాలుగో టెస్టులో విరాట్ 186 పరుగులు సాధించగా.. ఇప్పుడు కేన్ చవరి వరకూ క్రీజ్లో నిలిచి 121 పరుగులు చేసి కివీస్ను గెలిపించాడు. విరాట్కది 28వ శతకం కాగా.. కేన్ 27వ సెంచరీని పూర్తి చేశాడు.
పాయింట్ల పట్టికలో ఇలా..
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ప్రస్తుతం 68.52 శాతంతో ఆసీస్ ఉండగా.. భారత్ 60.29 శాతంతో రెండో స్థానంలో కొనసాగుతోంది. అయితే వెస్టిండీస్పై సిరీస్ను గెలిచిన దక్షిణాఫ్రికా 55.56 శాతంతో మూడో స్థానంలోకి వచ్చింది. ఇక కివీస్ చేతిలో తొలి టెస్టులో ఓటమిపాలైన శ్రీలంక 48.48 శాతంతో నాలుగో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు భారత్ - ఆసీస్ నాలుగో టెస్టు డ్రాగా ముగిసినా స్థానాల్లో మార్పు ఉండకపోవచ్చు. కానీ, శాతం మారే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల