Nikhat Zareen : నిఖత్ పసిడి పంచ్.. నాలుగో స్థానానికి భారత్
తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కామన్వెల్త్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్ ఫ్లై) విభాగంలో...
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat zareen) కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్ ఫ్లై) విభాగంలో నార్తన్ ఐర్లాండ్కు చెందిన కార్లే మెక్న్యూయ్పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. దీంతో భారత్ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. క్వార్టర్స్లో వేల్స్ బాక్సర్ హెలెన్ జోన్స్పై 5-0 తేడాతో, సెమీస్లో ఇంగ్లాండ్ బాక్సర్ సావనా అల్ఫియాపై 5-0తో అజేయంగా విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టిన నిఖత్ ఇక్కడా అదే అద్భుత ప్రదర్శన చేసింది. తుదిపోరులోనూ కార్లేపై 5-0తో గెలిచి పసిడి పతకం అందుకుంది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా.. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది.
ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్లోనూ నిఖత్ అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా కామన్వెల్త్ క్రీడా పోటీల్లోనూ తన ప్రత్యర్థి, నార్తన్ ఐర్లాండ్కు చెందిన కార్లే మెక్న్యూయ్పై బౌట్లో ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్.. తన పవర్ పంచ్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
గతంలో నిఖత్ మెరుపులు..
🥊 టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్షిప్లో స్వర్ణం.
🥊 2014 నేషన్స్ కప్లో స్వర్ణం
🥊 2015 జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణం
🥊 2016 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడల్లో కాంస్యం
🥊 2018 సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన టోర్నీలో స్వర్ణం
🥊 2019 థాయ్లాండ్ ఓపెన్లో రజతం
🥊 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్లో పసిడి
🥊 2022 మే నెలలో ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం
తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైంది: కేసీఆర్
కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన జరీన్కు అభినందనలు తెలిపారు. ఆమె గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తోందని కేసీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
వారెవ్వా పంజాబ్ కింగ్స్. శుక్రవారం పరుగుల వరద పారిన మ్యాచ్లో ఆ జట్టు 8 వికెట్ల తేడాతో కోల్కతాపై ఘనవిజయం సాధించింది. బెయిర్స్టో (108 నాటౌట్; 48 బంతుల్లో 8×4, 9×6), శశాంక్ సింగ్ (68 నాటౌట్; 28 బంతుల్లో 2×4, 8×6) పంజాబ్ హీరోలు. ఓపెనర్లు సాల్ట్ (75; 37 బంతుల్లో 6×4, 6×6), సునీల్ నరైన్ (71; 32 బంతుల్లో 9×4, 4×6)ల విధ్వంసంతో మొదట కోల్కతా 6 వికెట్లకు 261 పరుగుల భారీ స్కోరు సాధించింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.