Nikhat Zareen : నిఖత్ పసిడి పంచ్.. నాలుగో స్థానానికి భారత్
తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ కామన్వెల్త్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్ ఫ్లై) విభాగంలో...
ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ అమ్మాయి, ప్రపంచ ఛాంపియన్ నిఖత్ జరీన్ (Nikhat zareen) కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది. 48-50 కేజీల (లైట్ ఫ్లై) విభాగంలో నార్తన్ ఐర్లాండ్కు చెందిన కార్లే మెక్న్యూయ్పై అద్భుత విజయం సాధించి పసిడి పతకం నెగ్గింది. దీంతో భారత్ ఖాతాలో 17వ స్వర్ణం వచ్చి చేరింది. క్వార్టర్స్లో వేల్స్ బాక్సర్ హెలెన్ జోన్స్పై 5-0 తేడాతో, సెమీస్లో ఇంగ్లాండ్ బాక్సర్ సావనా అల్ఫియాపై 5-0తో అజేయంగా విజయం సాధించి ఫైనల్లోకి అడుగు పెట్టిన నిఖత్ ఇక్కడా అదే అద్భుత ప్రదర్శన చేసింది. తుదిపోరులోనూ కార్లేపై 5-0తో గెలిచి పసిడి పతకం అందుకుంది. మొత్తం పతకాల సంఖ్య 48కి చేరగా.. పతకాల పట్టికలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది.
ఈ ఏడాది మే నెలలో ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్లోనూ నిఖత్ అద్భుతమైన ప్రదర్శనతో పసిడి పతకంతో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా కామన్వెల్త్ క్రీడా పోటీల్లోనూ తన ప్రత్యర్థి, నార్తన్ ఐర్లాండ్కు చెందిన కార్లే మెక్న్యూయ్పై బౌట్లో ఆరంభం నుంచే శివంగిలా విరుచుకుపడిన నిఖత్.. తన పవర్ పంచ్లతో ఉక్కిరిబిక్కిరి చేసింది.
గతంలో నిఖత్ మెరుపులు..
🥊 టర్కీలో జరిగిన 2011 ప్రపంచ జూనియర్, యూత్ ఛాంపియన్షిప్లో స్వర్ణం.
🥊 2014 నేషన్స్ కప్లో స్వర్ణం
🥊 2015 జాతీయ సీనియర్ ఛాంపియన్షిప్లో స్వర్ణం
🥊 2016 దక్షిణాసియా ఫెడరేషన్ క్రీడల్లో కాంస్యం
🥊 2018 సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగిన టోర్నీలో స్వర్ణం
🥊 2019 థాయ్లాండ్ ఓపెన్లో రజతం
🥊 2019, 2022ల్లో స్ట్రాంజా మెమోరియల్లో పసిడి
🥊 2022 మే నెలలో ఇస్తాంబుల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లో స్వర్ణం
తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైంది: కేసీఆర్
కామన్వెల్త్ క్రీడల్లో నిఖత్ జరీన్ స్వర్ణం సాధించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తంచేశారు. అద్భుత ప్రదర్శనతో పసిడి పతకం సాధించిన జరీన్కు అభినందనలు తెలిపారు. ఆమె గెలుపుతో తెలంగాణ కీర్తి మరోసారి విశ్వవ్యాపితమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను నిరంతరం ప్రోత్సహిస్తోందని కేసీఆర్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి