T20 World Cup: వరల్డ్కప్ స్క్వాడ్ సభ్యులు లేకుండా.. ఐపీఎల్ టాప్-2 జట్లా?
ఈ సారి ఐపీఎల్ టాప్లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్కు ఓ ప్రత్యేకత ఉంది. రెండు జట్ల నుంచి టీమ్ ఇండియాలో స్థానం దక్కించుకొన్న ఒక్క ఆటగాడు కూడా లేడు.
ఇంటర్నెట్డెస్క్: ప్లే ఆఫ్స్ నాటికి ఐపీఎల్ పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న కేకేఆర్, ఎస్ఆర్హెచ్ జట్లకు ఓ ప్రత్యేకత ఉంది. వీటిల్లో వచ్చేనెల టీమ్ ఇండియా తరఫున టీ20 ప్రపంచకప్ ఆడే 15 మంది ఆటగాళ్లలో ఒక్కరు కూడా లేరు. కేకేఆర్కు చెందిన రింకు సింగ్ మాత్రం రిజర్వు ఆటగాడిగా ఉన్నాడు. ఈ టోర్నీ(ఐపీఎల్)లో అట్టడుగు స్థానంలో ఉన్న ముంబయి ఇండియన్స్లో అత్యధికంగా నలుగురు, దిల్లీ క్యాపిటల్స్లో ముగ్గురు చొప్పున ఉన్నారు. టోర్నిలోని మొత్తం నాలుగు జట్ల నుంచి ఒక్క భారతీయ ఆటగాడు కూడా ప్రపంచకప్ బృందంలో స్థానం దక్కించుకోలేకపోవడం విశేషం.
- కేకేఆర్, ఎస్ఆర్హెచ్తోపాటు జీటీ, ఎల్ఎస్జీ నుంచీ ఎవరూ లేరు. ఆర్ఆర్ జట్టులో జైస్వాల్, సంజూ, చాహల్ ఉన్నారు. ఆర్సీబీ నుంచి కోహ్లీ, సిరాజ్ స్థానం దక్కించుకొన్నారు. సీఎస్కేలో భాగమైన దుబే, జడేజా ప్రపంచకప్ ఆడుతున్నారు. డీసీలో పంత్, పటేల్, కుల్దీప్ ఉండగా.. ముంబయి నుంచి రోహిత్, హార్దిక్, సూర్య, బుమ్రాలు జాతీయ టీ20 జట్టులో ఉన్నారు.
నలుగురు స్పిన్నర్లా.. రింకూలో ఆ సత్తా ఉంది..: హర్భజన్ సింగ్
ప్రపంచకప్నకు ఎంపిక చేసిన జట్టులో సమతూకంపై మాజీ ఆఫ్స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)పెదవి విరిచాడు. స్పిన్నర్లను అధికంగా తీసుకొని సీమర్లను తగ్గించారన్నాడు. నలుగురు స్పిన్నర్లు జట్టుకు భారమవుతారేమోన్న అభిప్రాయం వ్యక్తం చేశాడు. అతడు మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రపంచకప్ జట్టులో బ్యాటింగ్ ఆర్డర్ బాగుంది. కానీ, రింకూ సింగ్కు స్థానం దక్కకపోవడంపై బాధగా ఉంది. అతడు మ్యాచ్ ఫినిషింగ్ వేళ 20 బంతుల్లో 60 పరుగులు చేయగలడు. ఇక జట్టులో మరో సీమర్ అవసరం ఉంది. నలుగరు స్పిన్నర్లు కొంచెం ఎక్కువే. ముగ్గురు సరిపోతారనుకుంటున్నా. భారత్ జట్టు కప్పును తీసుకురావాలని ఆశిస్తున్నా.
ఇక తుది జట్టులో జడ్డూ, చాహల్, కుల్దీప్లు ఉండొచ్చని భావిస్తున్నాను. పిచ్ కండీషన్లను ఆధారంగా ఈ కాంబినేషన్ మారుతుంది. పాక్తో మ్యాచ్ను మనం గెలుస్తామని నమ్ముతున్నాను. వారిపై మంచి రికార్డు, మెరుగైన టీమ్ మన సొంతం. సూపర్ 8లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి జట్లతో తలపడే సమయంలో శ్రమించాల్సి రావచ్చు. ఇక గాయాన్ని అధిగమించి పంత్ తిరిగి జాతీయ జట్టులో చేరాడు. మంచి ఫిట్నెస్తో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే సమయంలో వికెట్ కీపింగ్లో కూడా అదరగొడుతున్నాడు. ఈ సారి టోర్నీలో సంజూకు ఛాన్స్ వస్తుందని అనుకొంటున్నాను. నిలకడగా రాణిస్తూ 60, 70 స్కోర్లు చేస్తున్నాడు’’ అని హర్భజన్ పేర్కొన్నాడు. జూన్ 5 నుంచి టీ20 ప్రపంచకప్లో భారత పోరాటం మొదలుకానుంది. తొలి మ్యాచ్లో ఐర్లాండ్తో టీమ్ఇండియా తలపడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!