MS Dhoni: వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది.
వేదిక ఏదన్నది ముఖ్యం కాదు.. ప్రత్యర్థి ఎవరన్న ఆలోచనే లేదు. మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) దిగుతుంటే అభిమానులు కేరింతలు కొట్టారు. ఆఖరి సీజన్ (IPL) ఆడేస్తున్నాడన్న సందేశం అభిమానుల్లోకి వెళ్లడంతో మైదానాలు పసుపురంగు పులుముకుంటున్నాయి. ధోనీ జపంతో స్టేడియాలు దద్దరిల్లుతున్నాయి. ఇటీవల విశాఖపట్నంలో చెన్నై, దిల్లీ మ్యాచ్ ఇందుకు ఉదాహరణ. దిల్లీ సొంత మైదానంగా ఎంచుకున్న విశాఖలోని ఏసీఏ స్టేడియం చెన్నైలో చెపాక్ స్టేడియాన్ని మరిపించింది. ఆఖర్లో ధోని బాదేస్తుంటే చెన్నై ఓడిందా లేక దిల్లీ గెలిచిందా అనేది అర్థం కాలేదు. అదే ఎంఎస్డీ మ్యాజిక్కు.
ఆ బాధతోనూ...
తాను ఆడుతుందే అభిమానుల కోసం అన్నట్లుగా ఐపీఎల్ 17కి సిద్ధయ్యాడు ధోని. 40 ఏళ్ల పైన వయసులో అతడిలోని వింటేజ్ ధోనీ బయటకు వస్తుంటే ఫ్యాన్స్ హుషారెత్తిపోతున్నారు. మైదానంలో అతడి ఉనికి ఉంటే చాలు అన్నట్టు చెన్నై మ్యాచ్కు అభిమానులు వేలాదిగా తరలివస్తున్నారు. వికెట్ కీపింగ్ మెరుపులకు తోడు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ను వెనకుండి నడిపిస్తూ మహీ చెన్నైకి వెన్నెముకగా నిలుస్తున్నాడు. దిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్లో జట్టు ఓడిపోయే పరిస్థితిలో క్రీజులోకి వచ్చిన ఎంఎస్డీ.. మ్యాచ్ ముగిశాక అభిమానులను ఊగిపోయేలా చేశాడు.
అతడేం మ్యాచ్ను గెలిపించలేదు.. కానీ మునుపటి శైలిలో ఇరగదీశాడు. ఒంటి చేత్తో సిక్స్లు, ఆఫ్ సైడ్ బలమైన షాట్లతో అదరగొట్టాడు. మ్యాచ్ పూర్తయ్యాక ధోని కుంటుతూ పెవిలియన్ చేరడం కనిపించింది. సుదీర్ఘంగా అతడు కాలి గాయంతో బాధపడడమే ఇందుకు కారణం. ఎడమ కాలికి ఐస్ ప్యాక్లను ధరించి దిల్లీ ఆటగాళ్లతో మాట్లాడుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అంతటి బాధలోనూ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావ్ అంటూ అభిమానులు మహీని పొగుడుతున్నారు. బ్యాటింగ్లో కాస్త ముందు వచ్చిఉంటే ధోనీ మరోసారి మ్యాచ్ను ఫినిష్ చేసేవాడని అంటున్నారు.
రికార్డుల్లోనూ ముందుకు
టీ20ల్లో 300 డిస్మిసల్స్ సాధించిన తొలి వికెట్కీపర్గా అతడు ఘనత సాధించాడు. 42 ఏళ్ల వయసులో ధోనీ వికెట్ల వెనక చురుగ్గా ఉంటున్న తీరును మెచ్చుకోవాల్సిందే. మునుపటి సీజన్ కంటే బలంగా తయారైన మహీ.. డైవ్ చేసి మరీ క్యాచ్లు అందుకుంటున్న తీరు అద్భుతం. బ్యాటర్గానూ అతడు ఈ ఐపీఎల్ సీజన్లో ఇప్పటికే కొన్ని ఘనతలు ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో 7000 పరుగులు సాధించిన తొలి ఆసియా వికెట్కీపర్గా నిలిచాడు. ఒక్క ఐపీఎల్ టోర్నీలోనే అతడు 5000 పైన పరుగులు సాధించాడు.
ఐపీఎల్-17 మొదలుకాక ముందు ధోనీ అన్ని మ్యాచ్ల్లో బరిలో దిగడని.. ఇంపాక్ట్ ప్లేయర్గా మాత్రమే బరిలో దిగుతాడని ఏవేవో వార్తలు వచ్చాయి. కానీ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన గత మూడు మ్యాచ్ల్లో ధోనీ ఆట చూసిన అభిమానులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.. ఒకప్పటి మహీలా పొడవాటి జుట్టే కాదు.. అప్పటి ఆట కూడా తిరిగొచ్చిందని సంబరపడుతున్నారు. మహీ ఇదే జోరు కొనసాగిస్తే మున్ముందు ఇంకెంత మురిపిస్తాడో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం