WI vs IND: విండీస్తో వన్డే సిరీస్.. ఆసియా ట్రోఫీకి అంకురార్పణ!
విండీస్తో టెస్టు సిరీస్ను భారత్ దక్కించుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఇదే జోరును భారత్ తర్వాతి సిరీస్ల్లో కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమ్ఇండియా.. గురువారం నుంచి వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు సిద్ధం కానుంది. ఆసియా కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే. ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచ కప్నకు సన్నాహకంగా ఈ సిరీస్ను టీమ్ఇండియా సద్వినియోగం చేసుకోవాలి. టెస్టుల్లో కనీసం పోరాడలేకపోయిన విండీస్ను ఈసారి తక్కువగా అంచనా వేయకూడదు. స్టార్లతో కూడిన జట్టునే ఎంపిక చేయడంతో పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
ఓపెనర్లుగా ఎవరు వస్తారు?
ఇప్పుడు బరిలోకి దిగే కాంబినేషన్లో పెద్దగా మార్పులు లేకుండానే మెగా టోర్నీని టీమ్ఇండియా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఎప్పటిలానే శుభ్మన్ గిల్కే వస్తుందా..? లేకపోతే రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్నార్థకం. మూడో స్థానంలో ఎలాగూ విరాట్ కోహ్లీ ఉండనే ఉంటాడు. సూర్యకుమార్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లో ఇద్దరు మాత్రమే తుది జట్టులోకి వస్తారు. సూర్యకుమార్కు వన్డేల్లో పెద్దగా రికార్డులు లేవు. కానీ, ఇటీవల ఐపీఎల్ సీజన్లో సూపర్ ఇన్నింగ్స్లు ఆడాడు. సంజూ శాంసన్ ఫర్వాలేదు. అదేవిధంగా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ను పక్కన పెట్టడం కష్టమే. వికెట్ కీపర్గా కిషన్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా.
తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు?
బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య నాయకత్వంలో సీమర్లు ముకేశ్ కుమార్, సిరాజ్ తుది జట్టులో ఉంటారు. ఉమ్రాన్ మాలిక్, జయ్దేవ్కు నిరీక్షణ తప్పదు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ల జాబితాలో కుల్దీప్ను తీసుకునేందుకు అవకాశాలు పుష్కలం. అయితే, మణికట్టు మాంత్రికుడు చాహల్ను పక్కన పెట్టడం కష్టమే. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరినీ తీసుకుంటే బ్యాటింగ్కూ ఉపయోగపడతారు. అప్పుడు ప్రత్యేకంగా మరో బ్యాటర్ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నట్లు ఉంటుంది. ఇందులో ముగ్గురు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు కావడం విశేషం.
హెట్మయర్ వచ్చాడు..
హార్డ్ హిట్టర్ హెట్మయర్, పేసర్ ఒషేన్ థామస్ వెస్టిండీస్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్తో మూడు వన్డేల సిరీస్కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వారికి స్థానం లభించింది. నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్ సెలక్షన్కు అందుబాటులో లేరు. హెట్మయర్ దాదాపు ఏడాదిగా ఏ ఫార్మాట్లోనూ విండీస్ జట్టులో లేడు. అతడు చివరిసారి 2021 జులైలో వన్డే మ్యాచ్ ఆడాడు. సెలక్షన్కు అందుబాటులో ఉన్నా.. ప్రపంచకప్ క్వాలిఫయర్స్కు విండీస్ సెలక్టర్లు అతణ్ని ఎంపిక చేయలేదు. విండీస్ వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించని సంగతి తెలిసిందే.
భారత్, విండీస్ల మధ్య తొలి రెండు వన్డేలు ఈ నెల 27, 29వ తేదీల్లో కింగ్స్టన్లో జరుగుతాయి. ఆగస్టు 1న మూడో వన్డేకు ట్రినిడాడ్ ఆతిథ్యమిస్తుంది. వన్డేల తర్వాత రెండు జట్లు అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయ్దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్
విండీస్: షై హోప్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, యనిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రోన్ హెట్మయేర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కేల్ మేయర్స్, మోతీ, జయ్దెన్ సీలెస్, రొమారియో షెఫెర్డ్, కెవిన్ సిన్క్లెయిర్, ఓషానె థామస్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు