WI vs IND: విండీస్తో వన్డే సిరీస్.. ఆసియా ట్రోఫీకి అంకురార్పణ!
విండీస్తో టెస్టు సిరీస్ను భారత్ దక్కించుకుంది. ఇప్పుడు వన్డే సిరీస్కు సిద్ధమైంది. ఇదే జోరును భారత్ తర్వాతి సిరీస్ల్లో కొనసాగించాలని అభిమానులు కోరుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వర్షం కారణంగా రెండు టెస్టుల సిరీస్ను 1-0 ఆధిక్యంతో సొంతం చేసుకున్న టీమ్ఇండియా.. గురువారం నుంచి వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు సిద్ధం కానుంది. ఆసియా కప్ టోర్నీకి ముందు భారత్ ఆడే చివరి వన్డే సిరీస్ ఇదే. ఆ తర్వాత వచ్చే వన్డే ప్రపంచ కప్నకు సన్నాహకంగా ఈ సిరీస్ను టీమ్ఇండియా సద్వినియోగం చేసుకోవాలి. టెస్టుల్లో కనీసం పోరాడలేకపోయిన విండీస్ను ఈసారి తక్కువగా అంచనా వేయకూడదు. స్టార్లతో కూడిన జట్టునే ఎంపిక చేయడంతో పోరు రసవత్తరంగా సాగుతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.
ఓపెనర్లుగా ఎవరు వస్తారు?
ఇప్పుడు బరిలోకి దిగే కాంబినేషన్లో పెద్దగా మార్పులు లేకుండానే మెగా టోర్నీని టీమ్ఇండియా ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి, కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఎప్పటిలానే శుభ్మన్ గిల్కే వస్తుందా..? లేకపోతే రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం ఇస్తారా? అనేది ప్రశ్నార్థకం. మూడో స్థానంలో ఎలాగూ విరాట్ కోహ్లీ ఉండనే ఉంటాడు. సూర్యకుమార్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లో ఇద్దరు మాత్రమే తుది జట్టులోకి వస్తారు. సూర్యకుమార్కు వన్డేల్లో పెద్దగా రికార్డులు లేవు. కానీ, ఇటీవల ఐపీఎల్ సీజన్లో సూపర్ ఇన్నింగ్స్లు ఆడాడు. సంజూ శాంసన్ ఫర్వాలేదు. అదేవిధంగా వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన ఇషాన్ కిషన్ను పక్కన పెట్టడం కష్టమే. వికెట్ కీపర్గా కిషన్కే ఎక్కువ అవకాశాలు ఉంటాయనేది విశ్లేషకుల అంచనా.
తుది జట్టులో ముగ్గురు స్పిన్నర్లు?
బౌలింగ్ విభాగం విషయానికొస్తే.. వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్య నాయకత్వంలో సీమర్లు ముకేశ్ కుమార్, సిరాజ్ తుది జట్టులో ఉంటారు. ఉమ్రాన్ మాలిక్, జయ్దేవ్కు నిరీక్షణ తప్పదు. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్ల జాబితాలో కుల్దీప్ను తీసుకునేందుకు అవకాశాలు పుష్కలం. అయితే, మణికట్టు మాంత్రికుడు చాహల్ను పక్కన పెట్టడం కష్టమే. ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇద్దరినీ తీసుకుంటే బ్యాటింగ్కూ ఉపయోగపడతారు. అప్పుడు ప్రత్యేకంగా మరో బ్యాటర్ను తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు అందుబాటులో ఉన్నట్లు ఉంటుంది. ఇందులో ముగ్గురు బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు కావడం విశేషం.
హెట్మయర్ వచ్చాడు..
హార్డ్ హిట్టర్ హెట్మయర్, పేసర్ ఒషేన్ థామస్ వెస్టిండీస్ వన్డే జట్టులోకి పునరాగమనం చేశారు. భారత్తో మూడు వన్డేల సిరీస్కు ప్రకటించిన 15 మంది సభ్యుల జట్టులో వారికి స్థానం లభించింది. నికోలస్ పూరన్, జేసన్ హోల్డర్ సెలక్షన్కు అందుబాటులో లేరు. హెట్మయర్ దాదాపు ఏడాదిగా ఏ ఫార్మాట్లోనూ విండీస్ జట్టులో లేడు. అతడు చివరిసారి 2021 జులైలో వన్డే మ్యాచ్ ఆడాడు. సెలక్షన్కు అందుబాటులో ఉన్నా.. ప్రపంచకప్ క్వాలిఫయర్స్కు విండీస్ సెలక్టర్లు అతణ్ని ఎంపిక చేయలేదు. విండీస్ వన్డే ప్రపంచకప్నకు అర్హత సాధించని సంగతి తెలిసిందే.
భారత్, విండీస్ల మధ్య తొలి రెండు వన్డేలు ఈ నెల 27, 29వ తేదీల్లో కింగ్స్టన్లో జరుగుతాయి. ఆగస్టు 1న మూడో వన్డేకు ట్రినిడాడ్ ఆతిథ్యమిస్తుంది. వన్డేల తర్వాత రెండు జట్లు అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడతాయి.
జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జయ్దేవ్ ఉనద్కత్, సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, ముకేశ్ కుమార్
విండీస్: షై హోప్ (కెప్టెన్), రోవ్మన్ పావెల్ (వైస్ కెప్టెన్), అలిక్ అథనేజ్, యనిక్ కారియా, కీసీ కార్టీ, డొమినిక్ డ్రేక్స్, షిమ్రోన్ హెట్మయేర్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కేల్ మేయర్స్, మోతీ, జయ్దెన్ సీలెస్, రొమారియో షెఫెర్డ్, కెవిన్ సిన్క్లెయిర్, ఓషానె థామస్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్