Asian Games: జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనాకు ఒడిశా బంపర్ ఆఫర్!
ఆసియా క్రీడల్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జావెలిన్ త్రోయర్ కిశోర్ జెనాకు ఒడిశా ప్రభుత్వం నగదు బహుమతి ప్రకటించింది.
భువనేశ్వర్: ఆసియా క్రీడల్లో (Asian Games) భాగంగా బుధవారం జరిగిన జావెలిన్ త్రో పోటీలో భారత్ రెండు పతకాలు కైవసం చేసుకుంది. భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా (neeraj chopra) 88.88 మీటర్ల దూరం ఈటెను విసిరి స్వర్ణ పతకం గెలుచుకోగా.. మరో క్రీడాకారుడు కిశోర్ జెనా (Kishore Jena) 87.54మీ విసిరి రజతం దక్కించుకున్నాడు. వ్యక్తిగతంగా కిశోర్కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అంతేకాదు.. పారిస్లో జరిగే ఒలింపిక్స్ 2024కి కూడా అర్హత సాధించాడు. దీంతో ఒడిశా (Odisha)కు చెందిన కిషోర్ జెనాకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతడికి ప్రభుత్వం తరపున రూ. 1.50 కోట్లు నగదు బహుమతి ఇస్తున్నట్లు సీఎం నవీన్ పట్నాయక్ వెల్లడించారు.
‘‘ఆటలో కిశోర్ జెనా అద్భుతమైన ప్రదర్శనకు, అంకితభావానికి గుర్తింపుగా ఈ నగదు బహుమతి ఇస్తున్నాం. ఆసియా క్రీడల్లో పతకం సాధించినందుకు, పారిస్ ఒలింపిక్స్కు అర్హత పొందినందుకు కిశోర్కు శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఈ విజయం.. కిశోర్ వ్యక్తిగత ప్రతిభను చాటడమే కాదు, దేశవ్యాప్తంగా ఎంతోమంది క్రీడాకారుల్లో స్ఫూర్తి నింపుతుంది’’అని సీఎం నవీన్ పట్నాయక్ అన్నారు. వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్ కోసం కిశోర్ తీసుకునే శిక్షణకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
గత ఆగస్టులో జరిగిన వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీల్లోనూ కిశోర్ జెనా పాల్గొన్నాడు. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. కిశోర్ ఐదో స్థానంలో నిలిచినా.. తన ప్రతిభ చాటుకున్నాడు. అప్పుడు కూడా నవీన్ పట్నాయక్.. కిశోర్కు ప్రోత్సాహకంగా రూ. 50 లక్షలు నగదు బహుమతి అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ