Gill - Prithvi Shaw: వన్డేలకు శుభ్మన్ గిల్.. టీ20లకు పృథ్వీ షా సరిపోతారు: గంభీర్
వన్డేల్లో రాణించిన శుభ్మన్ గిల్ (Shubman Gill) టీ20ల్లో మాత్రం ఆడలేకపోతున్నాడు. స్పిన్ బౌలింగ్లో మరింత మెరుగు కావాల్సిన అవసరం ఉందని టీమ్ఇండియా (Team India) మాజీ ఆటగాడు గంభీర్ సూచించాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు.. సెంచరీలు బాదేశాడు. భవిష్యత్తులో భారత స్టార్ బ్యాటర్ అవుతాడని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. అయితే వన్డేల్లో రాణించిన విధంగా టీ20ల్లో మాత్రం శుభ్మన్ గిల్ ప్రతిభ కనబరచలేకపోయాడు. తాజాగా కివీస్తో టీ20 సిరీసుల్లోనూ పెద్దగా రాణించలేకపోతున్నాడు. ఈ క్రమంలో భారత మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా గిల్ ప్రదర్శనపై కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 ఫార్మాట్లో అనుకొన్న విధంగా రాణించలేకపోతున్నాడని.. అదే సమయంలో మరో యువ బ్యాటర్ పృథ్వీ షా టీ20లకు సరిగ్గా సరిపోతాడని గంభీర్ తెలిపాడు. స్పిన్ బౌలింగ్లో శుభ్మన్ ఇబ్బంది పడుతున్నాడని, టర్నింగ్ పిచ్లపై మరింత మెరుగ్గా ఆడాలని సూచించాడు.
‘‘స్పిన్ బౌలింగ్లో శుభ్మన్ గిల్ ఇంకా బాగా ఆడాల్సిన అవసరం ఉందని నా విశ్లేషణ. మరీ ముఖ్యంగా స్పిన్ పిచ్పైన ఇబ్బంది పడుతున్నాడు. బంగ్లాదేశ్లోనూ ఇలానే ఇబ్బందికి గురయ్యాడు. అయితే 50 ఓవర్ల క్రికెట్లో అద్భుతంగా ఆడుతున్నాడు. బంతి తిరగడం, బౌన్స్ అయినప్పుడు ఆడటం బ్యాటర్కు అసలైన పరీక్షగా మారుతుంది. ఇలాంటి విషయంలో శుభ్మన్ ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉంది. పేస్ బౌలింగ్ను బాగానే ఆడుతున్న గిల్.. స్పిన్ బౌలింగ్లో ఇబ్బంది పడుతున్నాడు’’
గిల్ ఆడే విధానం టీ20ల కంటే వన్డే క్రికెట్కు బాగా నప్పుతుందని.. అలాగే పృథ్వీ షా అయితే పొట్టి ఫార్మాట్కు సరిగ్గా సరిపోతాడని గంభీర్ తెలిపాడు. ‘‘గిల్ ఇంకా టీ20 ఫార్మాట్లో సరిగ్గా ఆడలేకపోతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అయితే ఆడే విధానం ఇంకాస్త దూకుడు ఉండాలి. అయితే గిల్ 50 ఓవర్ల ఫార్మాట్కు సరిపోతాడు. కానీ, పృథ్వీ షా వంటి కుర్రాడు మాత్రం టీ20 ఫార్మాట్కు రాణించగలడు. అందుకే, ఎంత త్వరగా గిల్ టీ20ల్లో మెరుగైతేనే తన స్థానం సుస్థిరమవుతుంది. అప్పుడే మూడు ఫార్మాట్లు ఆడేందుకు అవకాశం ఉంటుంది’’ అని గంభీర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్, కవిత జ్యుడీషియల్ కస్టడీ మళ్లీ పొడిగింపు
-
ఫొటోకు పోజులిస్తూ... అగ్నిపర్వతంలో జారిపడిన పర్యటకురాలు
-
విమానాల్లో 12 ఏళ్లలోపు వారికి తల్లిదండ్రుల పక్కనే సీటివ్వాలి: డీజీసీఏ
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీ పిటిషన్పై తీర్పు వాయిదా
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా