Virat: విరాట్ కొట్టిన ఆ ‘స్ట్రెయిట్ సిక్స్’.. షహీన్ బౌలింగ్లో అనుకున్నా: పాక్ మాజీ పేసర్
భారత్ X పాకిస్థాన్ (IND vs PAK) మ్యాచ్ కోసం అభిమానులు కళ్లుకాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. గత టీ20 ప్రపంచకప్లో (T20 World Cup) పాక్పై విజయం సాధించడంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్.. ప్రపంచకప్ ఏదైనాసరే పాకిస్థాన్పై గెలిస్తే టైటిల్ను కొట్టినంత సంబరం.. దాయాదుల పోరంటే అభిమానుల్లో తీవ్రస్థాయిలో ఉత్కంఠ ఉంటుంది. ఇరు జట్లూ గెలుపు కోసం చివరి బంతి వరకూ పోరాడటం ప్రేక్షకులకు భలే మజా కలిగిస్తుంది. ఇదే క్రమంలో టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గత టీ20 ప్రపంచకప్లో పాక్పై 19వ ఓవర్లో వరుసగా రెండు సిక్స్లు కొట్టడంతోపాటు చివరి వరకూ క్రీజ్లో ఉండి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. కోహ్లీ బ్యాటింగ్కు బలైన ఆ బౌలర్ హారిస్ రవూఫ్ అని అందరికీ తెలుసు. కానీ, ఓ పాక్ వెటరన్ క్రికెటర్ మాత్రం ఇప్పటికీ కోహ్లీ కొట్టిన సిక్స్లు షహీన్ షా అఫ్రిది బౌలింగ్లో అనుకొన్నానని, అవేమీ కష్టమైన షాట్లు కాదని పేర్కోవడం గమనార్హం.
19వ ఓవర్ వేసిన హారిస్ రవూఫ్ బౌలింగ్లో ఫైన్ లెగ్ వైపు సిక్స్ కొట్టిన కోహ్లీ.. తర్వాతి బంతికే వికెట్ల మీదుగా అద్భుతమైన సిక్స్గా మలిచాడు. క్రికెట్ చరిత్రలో ఇదొక అత్యుత్తమ షాట్గా మారిపోయింది. ఈ క్రమంలో పాక్ వెటరన్ పేసర్ సోహైల్ ఖాన్ మాత్రం హారిస్ రవూఫ్కు బదులు షహీన్ షా అఫ్రిది బౌలింగ్లో విరాట్ సిక్స్లు కొట్టినట్లు భావించానని తెలిపాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ స్ట్రెయిట్ సిక్స్ కొట్టాడు. హారిస్ రవూఫ్ బౌలింగ్లో అద్భుతమైన షాట్ సాధించాడు. తొలుత ఇది షహీన్ షా బౌలింగ్లో వచ్చిందేమో అనుకొని భ్రమపడ్డా.’’ అని సోహైల్ వ్యాఖ్యానించాడు.
గత టీ20 ప్రపంచకప్లో భారత్ సెమీస్కు దూసుకెళ్లగా.. పాక్ ఫైనల్ వరకూ వెళ్లి బోల్తా పడింది. ఇంగ్లాండ్తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో ఇంటిముఖం పట్టింది. ఇక పాక్ ఫైనల్కు చేరినప్పటికీ.. ఇంగ్లాండ్ చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో టీ20 ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి టైటిల్ను సొంతం చేసుకొన్న రెండో జట్టుగా ఇంగ్లాండ్ అవతరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల