‘తాగి, హోటల్ గదిలో మమ్మల్ని కొట్టారు’: సమాఖ్య సభ్యుడిపై ఫుట్బాల్ క్రీడాకారిణులు
ఫుట్బాల్ సమాఖ్య (AIFF) సభ్యుడు ఒకరు హోటల్ గదిలో తమను కొట్టారంటూ ఇద్దరు క్రీడాకారిణులు ఫిర్యాదు చేశారు.
దిల్లీ: అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF)కు చెందిన ఓ సభ్యుడిపై ఇద్దరు క్రీడాకారిణులు (Women Footballers) తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తమ హోటల్ గదికి వచ్చి భౌతిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..
హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఖాద్ ఫుట్బాల్ క్లబ్కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు.. సమాఖ్య ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దీపక్ శర్మపై ఈ ఆరోపణలు చేశారు. ఆయన హిమాచల్ ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కూడా. ఫుడ్ తయారీ విషయంలో ఆగ్రహానికి గురైన ఆయన తమపై దాడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ‘మా డిన్నర్ పూర్తైన తర్వాత.. గుడ్లు ఉడకపెట్టుకునేందుకు మా రూమ్కు వెళ్లాం. ఈ విషయంపై ఆగ్రహానికి గురైన ఆయన మా గదిలోకి దూసుకొచ్చారు. మాపై భౌతిక దాడికి పాల్పడ్డారు’ అని ఆరోపించారు. అప్పుడు ఆయన మద్యం సేవించి ఉన్నారని, అలాగే హిమాచల్ ప్రదేశ్ నుంచి గోవాకు వస్తోన్న సమయంలో కూడా ఆయన తమ ముందే తాగారని అందులో పేర్కొన్నారు. ఇండియన్ విమెన్ లీగ్లో భాగంగా ఖాద్ బృందం ప్రస్తుతం గోవాలో ఉంది.
క్రీడాకారుణులు తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేయడంతో.. గోవా ఫుట్బాల్ అసోసియేషన్ అధికారులు హోటల్ రూమ్ వెళ్లి వారికి ధైర్యం చెప్పారు. వారి భద్రతపై రాతపూర్వక హామీ ఇచ్చారు. అలాగే దీనిపై ఏఐఎఫ్ఎఫ్ (AIFF) విమెన్ ఫుట్బాల్ కమిటీ ఛైర్పర్సన్ వాలంకా అలెమావో స్పందించినట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి. ‘ఆ ఫిర్యాదు కాపీ నా దృష్టికి వచ్చింది. అలాంటి ఘటనలు ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. దీనిపై ఏఐఎఫ్ఎఫ్ తగిన చర్యలు తీసుకుటుంది’ అని వాలంకా వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి