T20 League: ఓపెనింగ్లో చెన్నై సరికొత్త రికార్డు.. మరి ఇతర జట్ల పరిస్థితేంటి?
బ్యాటింగ్లో శుభారంభం దక్కితే చాలు.. మిడిలార్డర్తోపాటు మిగతా ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తారు.. ఓపెనర్లు తక్కువ స్కోరుకే ...
ఇంటర్నెట్ డెస్క్: బ్యాటింగ్లో శుభారంభం దక్కితే చాలు.. మిడిలార్డర్తోపాటు మిగతా ఆటగాళ్లు ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తారు.. ఓపెనర్లు తక్కువ స్కోరుకే పరిమితమై పెవిలియన్కు చేరితే తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీంతో పరుగుల వేగం మందగిస్తుంది. అయితే ప్రస్తుత టీ20 లీగ్లో విజయాలపరంగా అట్టడుగు నుంచి రెండో స్థానంలో ఉన్న చెన్నై అద్భుత రికార్డును సృష్టించింది. చెన్నై ఓపెనర్లు తొలి వికెట్కు అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం (182) నిర్మించారు. మరి మిగతా జట్లలో ఓపెనింగ్ పరిస్థితి ఎలా ఉందో ఓ సారి తెలుసుకుందాం..
చెన్నై: ప్రస్తుత సీజన్లో కేవలం మూడు విజయాలనే నమోదు చేసింది. గత సీజన్లో డుప్లెసిస్, రుతురాజ్ అద్భుత ఫామ్తో ఉండటంతో పరుగుల వరద పారించింది. అయితే ఈసారి మాత్రం ఓపెనింగ్ సమస్య తీవ్రంగా ఉంది. అయితే హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో మాత్రం తొలి వికెట్కు 182 పరుగులు జోడించి రికార్డు సృష్టించింది. రుతురాజ్ గైక్వాడ్-కాన్వే పోటీ పడుతూ బౌండరీల వర్షం కురిపించారు. ఇది కాకుండా ఒక్కసారి కూడానూ ఓపెనర్ల జోడీ కనీసం అర్ధ శతకం కూడా జోడించలేకపోయింది.
కోల్కతా: ఆరంభంలో విజయాలతో దూసుకెళ్లిన కోల్కతా తర్వాత డీలా పడిపోయింది. వరుసగా ఐదు ఓటములతో కుదేలైన కోల్కతా ఓపెనింగ్ సమస్యతో కొట్టుమిట్టాడుతోంది. ఇప్పటి వరకు 43 పరుగులే అత్యధిక తొలి వికెట్ భాగస్వామ్యం. అదీ చెన్నైతో జరిగిన తొలి మ్యాచ్లోనే కావడం గమనార్హం. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క మంచి పార్టనర్షిప్ లేదు. కోల్కతా ఓడిపోవడానికి ఇదీ ఓ కారణంగా చెప్పొచ్చు. ఆరోన్ ఫించ్, సునిల్ నరైన్, వెంకటేశ్ అయ్యర్ వంటి హార్డ్ హిట్టర్లు సరిగ్గా రాణించలేకపోతున్నారు.
ముంబయి: వరుసగా ఎనిమిది మ్యాచ్లు ఓడి.. తొమ్మిదో మ్యాచ్లో అదృష్టవశాత్తూ విజయం సాధించిన జట్టు ముంబయి. బ్యాటింగ్, బౌలింగ్లో పేలవ ప్రదర్శనతో తేలిపోయింది. సీజన్ తొలి మ్యాచ్లో దిల్లీపై ముంబయి ఓపెనర్లు 67 పరుగులు జోడించారు. ఇప్పటి వరకు ముంబయికి ఇదే అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం. మరో రెండు సార్లు మాత్రమే అర్ధ శతక భాగస్వామ్యం నిర్మించారు. తొమ్మిది మ్యాచుల్లో కెప్టెన్ రోహిత్ శర్మ 155 పరుగులు మాత్రమే చేశాడు. అత్యధిక స్కోరు 41 మాత్రమే. రోహిత్తోపాటు ఇషాన్ కిషన్ కూడా విఫలం కావడం ముంబయికి అడ్డంకిగా మారింది.
దిల్లీ: మ్యాచ్ తర్వాత మ్యాచ్ విజయం సాధిస్తూ పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. దిల్లీకి కూడా ఓపెనింగ్ సమస్య వెంటాడుతోంది. లఖ్నవూతో మ్యాచ్లో డేవిడ్ వార్నర్-పృథ్వీ షా 67 పరుగులను జోడించారు. అలానే కోల్కతాపై 93 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. బెంగళూరుపై అర్ధ శతకం (50) సాధించారు. పంజాబ్తో జరిగిన స్వల్ప స్కోరు మ్యాచ్లో 83 పరుగులు జోడించారు. అయితే కీలకమైన సందర్భాల్లో ఓపెనర్లు ఇద్దరూ విఫలం కావడంతో గెలిచే మ్యాచ్లను కూడా ఓడిపోవాల్సి వచ్చింది. డేవిడ్ వార్నర్ వరుసగా మూడు అర్ధ శతకాలను నమోదు చేసినా జట్టు విజయంలో కీలక పాత్ర పోషించలేకపోతున్నాడు.
బెంగళూరు: డుప్లెసిస్, విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్ వంటి సూపర్ బ్యాటర్లు ఉన్న బెంగళూరు ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలని ప్రతి అభిమాని కోరుకుంటున్నాడు. దానికి తగ్గట్టుగానే తొలి ఏడు మ్యాచుల్లో ఐదు విజయాలతో చెలరేగింది. అయితే ఆ తర్వాత నుంచి చేతులెత్తేసింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఓడింది. కేవలం మూడే మ్యాచుల్లో మాత్రమే అర్ధ శతక (50, 55, 50) భాగస్వామ్యాలను నిర్మించింది. డుప్లెసిస్, కోహ్లీ, అనుజ్ రావత్ ఓపెనర్లుగా వచ్చినా ఎలాంటి మార్పు లేదు.
పంజాబ్: యువ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ నాయకత్వంలోని పంజాబ్ పెద్దగా రాణించడం లేదు. శిఖర్ ధావన్, భానుక రాజపక్స, లివింగ్స్టోన్ ఆడుతున్నా విజయాలు మాత్రం దక్కడం లేదు. ఇప్పటి వరకు 9 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలను మాత్రమే నమోదు చేసింది. తొలి మ్యాచ్లో బెంగళూరుపై భారీ లక్ష్యాన్ని ఛేదించిన పంజాబ్ ఆ తర్వాత అటువంటి ఆటతీరును ప్రదర్శించలేదు. ఈ మ్యాచ్లో ఓపెనర్లు 71 పరుగులను జోడించారు. ఆ తర్వాత ముంబయిపై 97 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ రెండు సందర్భాలు తప్ప మరోసారి ఇటువంటి ప్రదర్శన చేయలేదు.
లఖ్నవూ: కొత్త జట్టైన లఖ్నవూ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. పది మ్యాచ్లకుగాను కేవలం మూడింట్లో మాత్రమే ఓడి ఏడు విజయాలను నమోదు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ మంచి ఫామ్లో ఉన్నాడు. మరో ఓపెనర్ డికాక్తో కలిసి రాహుల్ అప్పుడప్పుడు మాత్రమే శుభారంభాలను ఇవ్వగలుగుతున్నాడు. అయితే వీరిద్దరిలో ఎవరో ఒకరు ఉండటంతో లఖ్నవూ విజయాల బాట పడుతోంది. వీరిద్దరూ ఆడనప్పుడు ఓటమిబాట పట్టడం విశేషం. చెన్నైపై 99 పరుగులు, దిల్లీపై 73 పరుగులు, ముంబయిపై 52 పరుగులు జోడించారు.
గుజరాత్: దాదాపు ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్న జట్టు గుజరాత్. ఇప్పటి వరకు తొమ్మిదింట్లో ఒక్క మ్యాచ్ మినహా ఎనిమిది విజయాలను నమోదు చేసిన ఏకైక జట్టు. బౌలింగ్, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ సహకారంతో మ్యాచ్లను నెగ్గడం విశేషం. గుజరాత్ అత్యధిక ఓపెనింగ్ పార్టనర్షిప్ ఎంతంటే.. 69 పరుగులు. అదీ హైదరాబాద్పై ఓపెనర్లు సాధించారు. మరోసారి బెంగళూరు మీద 51 పరుగులను జోడించారు. ఈ రెండు సందర్భాల్లో తప్ప మరెప్పుడూ స్థిరంగా రాణించలేదు. అయినా విజయపరంపర కొనసాగిస్తూ దూసుకెళ్తోంది. శుభ్మన్ గిల్కు తోడు మ్యాథ్యూ వేడ్, సాహాలో ఒకరు ఓపెనింగ్ వస్తున్నారు.
రాజస్థాన్: ప్రస్తుత సీజన్లో అత్యధిక శతకాలతోపాటు టాప్ స్కోరర్గా ఉన్న బ్యాటర్ రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్. ఇప్పటికే మూడు సెంచరీలను బాదేశాడు. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఓపెనర్లలో ఎవరో ఒకరు భారీ స్కోరు సాధిస్తుండటం రాజస్థాన్కు కలిసొస్తుంది. తొలి మ్యాచ్ హైదరాబాద్పై 58 పరుగులు జోడించారు. ఇంక బెంగళూరుపై 97 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ప్రస్తుత సీజన్లోనే అత్యధిక స్కోరు (222/2) నమోదు చేసిన రాజస్థాన్కు ఓపెనర్లు తొలి వికెట్కు 155 పరుగులను జోడించారు. ఇది రెండో అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం.
హైదరాబాద్: బౌలింగ్నే నమ్ముకుని బరిలోకి దిగిన హైదరాబాద్ జట్టు బ్యాటింగ్లోనూ రాణిస్తోంది. తొలి రెండు మ్యాచ్లను ఓడిన తర్వాత వరుసగా ఐదు మ్యాచుల్లో విజయం సాధించింది. వీటిల్లో ఓపెనర్లు అభిషేక్ శర్మ-కేన్ విలియమ్సన్ కీలక పాత్ర పోషించారు. చెన్నైపై 89 పరుగులు, గుజరాత్ మీద 64, బెంగళూరుపై 64, మరోసారి చెన్నైపై 58 పరుగులు జోడించారు. ప్రస్తుతం తొమ్మిది మ్యాచులకుగాను ఐదు గెలిచి, నాలుగింట్లో ఓడింది. ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకోవాలంటే కనీసం ఇంకో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్