ODI World Cup: విజయాల వెనుక పేస్ మంత్ర... ప్రపంచకప్లో ఫాస్ట్ బౌలర్ల హవా
భారత్లో క్రికెట్ పిచ్లు అంటే స్పిన్నర్లకు స్వర్గధామం అని అంటుంటారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపచంకప్లో పేసర్లే ఎక్కువగా రాణిస్తున్నారు.
సాధారణంగా భారత్లో ప్రపంచకప్ (ODI World Cup) అనగానే స్పిన్నర్లదే హవా అని అంతా అనుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఆరంభంలో కొన్ని మ్యాచ్ల్లో స్పిన్నర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. కానీ టోర్నీ గడుస్తున్న కొద్దీ పరిస్థితి మారిపోయింది. నెమ్మదిగా పేసర్లు ముద్ర చూపించారు. ఇప్పుడు వాళ్లదే హవా. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో తొలి 10 మందిలో 8 మంది పేసర్లే.
మనోళ్ల జోరు
పేస్ అనగానే ఇప్పుడు గుర్తుకొస్తున్న జట్టు భారతే. జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah), మహ్మద్ షమీ (Mohammed Shami) ప్రపంచకప్లో వేసిన ముద్ర అలాంటిది. 6 మ్యాచ్ల్లో 14 వికెట్లతో బుమ్రా అత్యధిక వికెట్ల జాబితాలో టాప్ 3లో చోటు దక్కించుకున్నాడు. అతడు వేస్తున్న బంతులకు బ్యాటర్ల నుంచి సమాధానమే ఉండట్లేదు. ఔట్ స్వింగ్, ఇన్స్వింగర్లతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. ఇక బుల్లెట్ యార్కర్ల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇంగ్లాండ్తో మ్యాచే ఇందుకు ఉదాహరణ. అందుకే వసీమ్ అక్రమ్ లాంటి దిగ్గజం సైతం తనకన్నా నియంత్రణతో బంతులు వేస్తున్నాడని బుమ్రాకు కితాబిచ్చాడు. అంతేకాదు ప్రస్తుత ప్రపంచ క్రికెట్లో బుమ్రానే అత్యుత్తమ బౌలర్ అని కూడా ప్రశంసించాడు.
మహ్మద్ షమీ గురించి ఎంత ఎక్కువ చెప్పినా తక్కువే. దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని రెండు చేతులతో అందుకుని అదరగొట్టేస్తున్నాడీ పేసర్. రెండు కఠినమైన మ్యాచ్ల్లో రాణించడం ఈ పేసర్ సత్తాకు నిదర్శనం. న్యూజిలాండ్తో మ్యాచ్తో ఈ టోర్నీలో తొలిసారి ఆడే అవకాశాన్ని దక్కించుకున్న షమీ 5 వికెట్లతో విజృంభించాడు. అతడు వేసిన యార్కర్లను ఆడడం కివీస్ బ్యాటర్లకు తలకు మించిన పనే అయింది. ఇక ఇంగ్లాండ్ బ్యాటర్లను ఆఫ్ కటర్స్తో బోల్తా కొట్టించాడు షమి. ఆ జట్టు అగ్రశ్రేణి బ్యాటర్ బెన్ స్టోక్స్కు వేసిన బంతి అయితే అద్భుతం. వేగాన్ని ఎక్కువగా తగ్గించకుండానే బంతిని ఆఫ్ కటర్గా వేసి క్లీన్బౌల్డ్ చేశాడు. 2 మ్యాచ్ల్లోనే 9 వికెట్లు పడగొట్టి దూసుకెళ్తున్నాడతను.
అటు అఫ్రిది.. ఇటు జాన్సన్
ప్రపంచకప్లో పాకిస్థాన్ రాణించలేకపోయింది. వరుసగా నాలుగు మ్యాచ్ల్లో ఓడి సెమీఫైనల్ అవకాశాలను క్లిష్టం చేసుకుంది. అయితే ఆ జట్టు స్టార్ పేసర్ షహీన్షా అఫ్రిది మాత్రం తనపై అంచనాలను నిలబెట్టుకుంటున్నాడు. భారత్తో మ్యాచ్లో తేలిపోయినా.. మిగిలిన మ్యాచ్ల్లో రాణించాడు. ఇప్పటిదాకా 6 మ్యాచ్ల్లో 16 వికెట్లు తీసి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్తో మ్యాచ్లో గొప్పగా బౌలింగ్ చేసిన అతడు 23 పరుగులకే 3 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కట్టడి చేశాడు. పిచ్ స్లోగా ఉన్నా బంతి వేగాన్ని తగ్గిస్తూ బ్యాటర్లను బుట్టలో వేస్తున్నాడు అఫ్రిది.
దక్షిణాఫ్రికా జైత్రయాత్రలో ఆల్రౌండర్ మార్కో జాన్సన్ది ప్రముఖ పాత్ర. అటు బ్యాట్తో అదరగొడుతున్న అతడు.. బంతితోనూ విజృంభిస్తున్నాడు. టోర్నీలో ఆడుతున్న క్రికెటర్లలోకెల్లా పొడగరి అయిన అతడు ఎత్తును సద్వినియోగం చేసుకుంటూ బ్యాటర్ల కదలికలను బట్టి బంతులు సంధిస్తున్నాడు. స్లో బౌన్సర్లతో వికెట్లు సాధిస్తున్నాడు. 6 మ్యాచ్ల్లో ఈ సఫారీ బౌలర్ 13 వికెట్లు తీసి టాప్ 5లో ఉన్నాడు.
వాళ్లు కూడా..
మదుశంక (శ్రీలంక), మాట్ హెన్రీ (న్యూజిలాండ్), బాస్ డీ లీడ్ (నెదర్లాండ్స్), రబాడ (దక్షిణాఫ్రికా), కొయెట్జీ (దక్షిణాఫ్రికా), మీకెరన్ (నెదర్లాండ్స్) హారిస్ రవూఫ్ (పాకిస్థాన్) అదరగొడుతున్న బౌలర్ల జాబితాలో ఉన్నారు. వీరిలో కొయెట్జీ, మీకెరన్ బౌలింగ్ చూసి తీరాల్సిందే. వైవిధ్యానికి పేస్ను జత చేస్తూ వీళ్లిద్దరూ వికెట్ల వేటలో సాగిపోతున్నారు. నెదర్లాండ్స్ సంచనల విజయాల్లో మీకెరన్తో పాటు బాస్ డీ లీడ్ది కీలకపాత్ర. వీళ్లందరి ప్రదర్శనలు చూస్తుంటే ప్రపంచకప్ జరుగుతుంది భారత్లోనేనా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే గతంలో భారత్లో జరిగిన 1996, 2011 ప్రపంచకప్పుల్లో స్పిన్నర్లే ఆధిపత్యం ప్రదర్శించారు. ఈసారి మాత్రం స్పిన్నర్లు బ్యాక్సీట్ తీసుకోవడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. మున్ముందు పేసర్ల నుంచి మరిన్ని ఆసక్తికర ప్రదర్శలు రావడం ఖాయంగా కనిపిస్తోంది.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
లీగ్ స్టేజ్ చివరిదశకు చేరుకుంటున్న సమయంలో అన్ని ఫ్రాంచైజీలకు ఇబ్బందులు తప్పేలా లేవు. మరీ ముఖ్యంగా చెన్నై అభిమానులకు నిరాశ కలిగించే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
టాప్ ప్లేస్లో ఉన్న రాజస్థాన్తో హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. ప్లేఆఫ్స్ బెర్తు రేసులో ముందుకు రావాలంటే సన్రైజర్స్కు ఈ మ్యాచ్ అత్యంత కీలకం. -
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
-
చెన్నైకి షాక్ తప్పదా.. ఐదుగురు బౌలర్ల గైర్హాజరీపై ఫ్లెమింగ్ ఏమన్నాడంటే?
-
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
-
సిద్ధార్థ్తో నిశ్చితార్థం.. అందుకే వెల్లడించాల్సి వచ్చింది: అదితిరావు
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు