ODI WC 2023: బంతులు.. డీఆర్ఎస్.. టాస్ కాయిన్.. భారత్పై అక్కసు వెళ్లగక్కేందుకు వారికేదీ కాదు అనర్హం!
వరుసగా విజయాలు సాధిస్తున్న టీమ్ఇండియా (Team India) ప్రదర్శనను తక్కువగా చేయడానికి పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు కొందరు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్లో (ODI World Cup 2023) టీమ్ఇండియా ఫైనల్కు చేరింది. దాయాది పాకిస్థాన్ లీగ్ స్టేజ్లోనే ఇంటిముఖం పట్టింది. దీంతో కొందరు పాక్ దిగ్గజాలు భారత ఆటతీరును ప్రశంసిస్తుంటే.. మరికొందరు మాజీ ఆటగాళ్లు అక్కసును వెళ్లగక్కేందుకు తమ నోటికి పనిజెప్పారు. పైశాచిక ఆనందం పొందుతున్నారనే విమర్శలను మూటగట్టుకున్నారు. అనవసరమైన విషయాలను లేవనెత్తి వివాదాస్పదంగా మార్చడమే పనిగా పెట్టుకున్నారు. తొలుత విభిన్న బంతులు అన్నారు.. ఆ తర్వాత డీఆర్ఎస్పై పడ్డారు.. తాజాగా టాస్ సందర్భంగా కాయిన్ వేసే పద్ధతిపైనా ఆరోపణలు చేశారు. అయితే, వాటికి కౌంటర్లు పాక్ క్రికెట్ దిగ్గజం నుంచే రావడం ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇలాంటి ఆరోపణలు చేసి తమ పరువు తీయొద్దని సూచించారంటే ఆ మాజీలు ఎంతకు దిగజారిపోయారో అర్థమవుతుంది.
విభిన్న బంతులు వాడారట..
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా ఆ దేశం తరఫున ఆడింది కేవలం 23 అంతర్జాతీయ మ్యాచులే. అందులోనూ ఏడు టెస్టులు, 16 వన్డేలు ఉన్నాయి. మొత్తం 500 పరుగులు కూడా లేవు. కానీ, టీమ్ఇండియా గెలుపును మాత్రం తక్కువ చేయడానికి చాలా కష్టపడుతుంటాడు. ఈ వరల్డ్ కప్లో భారత్ లీగ్ స్టేజ్లో అన్ని మ్యాచుల్లోనూ విజయం సాధించింది. కానీ, పాక్ మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడింది. టీమ్ఇండియా పేసర్లు విజృంభించి ప్రత్యర్థులను కట్టడి చేశారు. దీంతో టీమ్ఇండియా విభిన్న బంతులను వాడటం వల్లే వారు గెలిచారనే ఆరోపణలను గుప్పించాడు. దీనికి పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.
‘‘వేర్వేరుగా బంతులను వినియోగించడానికి ఎక్కడా వీలుండదు. ప్రతి బంతిని గమనించి మ్యాచ్ కోసం అందుబాటులో ఉంచడానికి ఐసీసీ అధికార ప్రతినిధులు అక్కడే ఉంటారు. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్ల సమక్షంలోనూ ఇది జరుగుతుంది’’ వసీమ్ అక్రమ్ నుంచి వచ్చిన తొలి కౌంటర్ ఇది.
ఈసారి డీఆర్ఎస్..
మ్యాచ్లో వాడే బంతులపై విమర్శలు చేసిన హసన్ రజా మరోసారి డీఆర్ఎస్పై అసంబద్ధ ఆరోపణలు గుప్పించాడు. డెసిషన్ రివ్యూ సిస్టమ్ (DRS)ను ట్యాంపరింగ్ చేసి తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని రజా వ్యాఖ్యానించాడు. దానికి దక్షిణాఫ్రికాతో జరిగిన లీగ్ మ్యాచ్ను ఉదాహరణగా పేర్కొన్నాడు. వాండర్ డసెన్ ఔట్ ఇవ్వడం సరైంది కాదని విమర్శించాడు. ‘‘లైన్లోనే ఇంపాక్ట్ ఉందని.. బంతి లెగ్స్టంప్ను దాటేసి వెళ్తున్నట్లు అనిపించింది. కానీ, డీఆర్ఎస్లో మాత్రం లెగ్స్టంప్ను తాకినట్లు చూపించారు. ఇది నా అభిప్రాయం మాత్రమే. దీనిపై సునిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. భారత్-పాక్ మ్యాచ్లోనూ ఇలాంటి సంఘటనలు జరిగాయి’’ అని రజా ఓ ఛానల్లో వ్యాఖ్యానించాడు.
‘కొంచెమైనా సిగ్గుండాలి. మీ గేమ్ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇది ఐసీసీ వరల్డ్ కప్. మీ లోకల్ టోర్నమెంట్ కాదు. మీరు (హసన్ రజా) గతంలో ప్లేయరే కదా. ఇప్పటికే వసీమ్ అక్రమ్ సవివరంగా చెప్పాడు. కానీ, ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. అంటే క్రికెట్ దిగ్గజం, మీ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్నే మీరు నమ్మడం లేదా? మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు’’ అని భారత స్టార్ పేసర్ షమీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.
టాస్ కాయిన్ వేసే పద్ధతిపైనా..
పాకిస్థాన్ మాజీ ఆటగాడు సికిందర్ భక్త్ ఈసారి ఏకంగా టాస్ కాయిన్ వేసే పద్ధతిపై చేసిన వ్యాఖ్యలు ఆ దేశ మాజీలకే అసహనం కలిగించాయి. ఇలాంటివి చేసి తమను నవ్వులపాలు చేయొద్దని చురకలు అంటించారు. బీసీసీఐ, ఐసీసీ కలిసి టాస్ను మ్యానిపులేట్ చేస్తున్నాయని సికిందర్ ఆరోపించాడు. దానికి ఓ చెత్త కారణం కూడా చెప్పడం గమనార్హం. ‘‘ఇక్కడో కుట్ర కోణం ఉందని చెప్పడానికి ఉదాహరణ ఇస్తున్నా. భారత కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేసేటప్పుడు ప్రత్యర్థి కెప్టెన్కు దూరంగా విసిరేవాడు. దీంతో ఆ ప్రత్యర్థి సారథి అక్కడికి వెళ్లి కాయిన్ను చెక్ చేసేందుకు వెళ్లలేకపోయాడు. ఇతర కెప్టెన్లతో పోలిస్తే రోహిత్ టాస్ వేసే విధానం విచిత్రంగా ఉంది’’ అని సికిందర్ వ్యాఖ్యానించాడు. ఇంతకీ సికిందర్ తన 13 ఏళ్ల కెరీర్లో (1976-1989) 26 టెస్టులు, 27 వన్డేలు మాత్రమే ఆడాడు.
ఇలాంటి చెత్త మాటలు మాట్లాడి తమ పరువు తీయొద్దని పాక్ మాజీలు వసీమ్ అక్రమ్, షోయబ్ మాలిక్ చురకలు అంటించారు. ‘‘అసలు ఇలాంటి మాటలు ఎలా వస్తాయి? టాస్ వేసినప్పుడు కాయిన్ ఎక్కడ పడుతుందని ఎవరు నిర్ణయిస్తారు? ఒక్కో కెప్టెన్ ఒక్కో మాదిరిగా కాయిన్ వేస్తుంటారు. అందుకే ఇలాంటి వ్యాఖ్యలు చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. అసలు ఇలాంటి వాటిపై స్పందించడానికి నాకు అసహ్యమేస్తోంది’’ అని అక్రమ్ ప్రతిస్పందించాడు.
టీవీల్లో కనిపించాలనే..
భారత్ జట్టుపై ఇలా వ్యాఖ్యలు చేయడం వెనుక ఆ మాజీలకు ఉండే దురుద్దేశంతోపాటు టీవీల్లో ఫేమస్ కావాలనే ఆలోచన కూడా కారణమని క్రికెట్ అభిమానులు అనుకుంటున్నారు. తమ కెరీర్లో పెద్దగా రాణించకపోయినా.. ఇప్పుడు సోషల్ మీడియాలో తరచూ తమ పేరు కనిపించడానికి పొరుగుదేశంపై విమర్శలు చేస్తున్నారనే వాదనా ఉంది. పాకిస్థాన్ జట్టు మెరుగు పడటానికి అవసరమైన చర్యలు, సూచనలు అందించకుండా ఇతర జట్లపై అక్కసు వెళ్లగక్కితే పరువు పోయేది తమదేనని ఇప్పటికైనా కొందరు మాజీలు గ్రహించాలని అభిమానులు చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!