Pakistan Team: పాకిస్థాన్ జట్టుకు ఏమైంది?.. వరల్డ్ కప్లో పతనానికి కారణాలేంటి?
ఉపఖండ పిచ్లపై చెలరేగిపోయే జట్లలో పాకిస్థాన్ ఉంటుంది. కానీ, భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగిన పాక్ సెమీస్కు చేరుకోవడంలో విఫలమైంది.
పాకిస్థాన్ క్రికెట్ టీమ్.. ఎవరి అంచనాలకు అందని జట్టు ఇది. ఈ ప్రపంచకప్నకు ముందు పాక్ను (Pakistan) అరివీర భయంకర జట్టు అనుకున్నారు. కానీ కట్ చేస్తే సెమీ ఫైనల్స్కి కూడా చేరకుండా ఇంటికెళ్లిపోయింది. దీంతో అసలు పాక్కు ఏమైంది అనే ప్రశ్న మొదలైంది. మెగా టోర్నీలో పాక్ వైఫల్యం వెనుక కారణమేంటో చూస్తే...
జావెద్ మియాందాద్, ఇమ్రాన్ ఖాన్, అబ్దుల్ ఖాదిర్, వసీమ్ అక్రమ్, వకార్ యూనిస్, సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిదీ... పాకిస్థాన్ క్రికెట్ గురించి మాట్లాడుకుంటూ పోతే ఇలా చాలా పేర్లు వినిపిస్తాయి, వాళ్ల అద్భుతమైన ఆటతీరు కళ్ల ముందు కదలాడుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రత్యర్థి జట్లను గడగడలాడించిన పాక్ ఈసారి కీలక సమయంలో చతికిలపడిపోయింది. దీంతో లీగ్ దశలోనే ఇంటికెళ్లిపోయింది. ప్రపంచకప్లో (ODI World Cup 2023) పాకిస్థాన్ ఆటతీరు ఎలా ఉంది, వాళ్ల మైండ్ సెట్ ఎలా ఉందో చెప్పాలంటే... అఫ్గానిస్థాన్ మ్యాచ్ చక్కటి ఉదాహరణ. ఆ మ్యాచ్లో అఫ్గాన్ సంచలన విజయం సాధించింది అనే కంటే.. పాకిస్థాన్ చిత్తుగా ఓడింది అనడం బెటర్.
ఆ పేస్ ఏమైంది?
పాకిస్థాన్ పేస్ బౌలింగ్ అంటే ప్రత్యర్థులు గడగడలాడిపోయేవారు. ఫాస్ట్ బౌలర్ల కార్ఖానా అని పాక్ జట్టుకు పేరు. అయితే ఈ ప్రపంచకప్లో వాళ్లే జట్టు ఫెయిల్యూర్కి ప్రధాన కారణం. వన్డే ప్రపంచ కప్ ప్రారంభానికి ముందు షహీన్, రవూఫ్ల బౌలింగ్ను ఎదుర్కోవడం ఎలాంటి జట్టుకైనా సవాలేనని పాక్ మాజీలు ఎంతో నమ్మకంగా చెప్పారు. అలా భారీ అంచనాలతో బరిలోకి దిగిన షహీన్ అఫ్రిది, హారిస్ రవూఫ్ల పేస్ దళం ఆ రేంజిలో ప్రభావం చూపించకపోగా... సాధారణ బౌలర్లలా కనిపించారు. షహీన్ 9 మ్యాచుల్లో 18 వికెట్లు తీసినా 486 పరుగులు (81 ఓవర్లలో) ఇచ్చాడు. హారిస్ 79 ఓవర్లలో 474 పరుగులు ఇచ్చేశాడు. 16 వికెట్లను మాత్రమే తీశాడు. అత్యుత్తమ ఎకానమీతో బౌలింగ్ చేసిన టాప్ 15 బౌలర్ల జాబితాలో వీరిద్దరూ లేరు. అంటే ప్రత్యర్థి బ్యాటర్లు తేలిగ్గా పరుగులు రాబట్టేశారు.
భారత్ చేతిలో ఓటమితో..
గత ఆసియా కప్లో సూపర్-4 దశకే పరిమితమైన పాకిస్థాన్ వన్డే ప్రపంచకప్ను ఘనంగానే ఆరంభించింది. నెదర్లాండ్స్, శ్రీలంకపై విజయాలు సాధించింది. అయితే, టీమ్ఇండియాతో మ్యాచ్లో ఘోరంగా విఫలమైన పాక్ లయ తప్పింది. హోరాహోరీ తప్పదనుకున్న మ్యాచ్లో అన్ని రంగాల్లో విఫలమై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఆ తర్వాత వరుసగా నాలుగు ఓటములను చవిచూసింది. భారత్తో మ్యాచ్ అనంతరం తమ ఓటమికి పాక్ డైరెక్టర్ మికీ ఆర్థర్ ‘‘మాకు మైదానంలో సరైన మద్దతు లేదు. ఐసీసీ ఈవెంట్లా కాకుండా ద్వైపాక్షిక సిరీస్లా ఉంది’’ అని అన్నాడు. మికీ మాటలు జట్టు కండిషన్ను తెలిపేలా ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి. ఇలాంటి విషయాలు కాకుండా.. టోర్నీపై దృష్టిపెట్టాలని పాక్ మాజీలే అతనికి సూచనలు చేశారు.
బ్యాటింగ్లో దూకుడు ఎక్కడ?
ఒకరిద్దరు బ్యాటర్లు రాణిస్తే మ్యాచ్లు గెలవగలరు. మొత్తం బ్యాటర్లు ఆడితేనే కప్పులు గెలవగలం అంటారు. ఈ విషయంలోనూ పాక్ బాగా వెనుకబడింది. ప్రతి మ్యాచ్లో ఒకరో, ఇద్దరో ఆడటం మనం చూశాం. అంతేకాదు ఆడనివాళ్లను జట్టులో కొనసాగించి ఏకంగా ఫైనల్ జట్టు ఎంపిక విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేనట్లున్నాయి అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎంతో నమ్మకం పెట్టుకున్న ఇమామ్ పరుగులు చేయలేకపోతున్నా కొనసాగించారు. తీవ్ర విమర్శలు వచ్చాక కానీ కెప్టెన్ బాబర్ అజామ్ అతడిని పక్కన పెట్టలేదు.
అతని స్థానంలో వచ్చిన ఫకర్ జమాన్ భారీ ఇన్నింగ్స్తో జట్టును గెలిపించాడు. దీంతో అతణ్ని బెంచ్కి పరిమితం చేయడం ఎంత తప్పో తెలుసుకున్నారు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది. యువకులు సౌద్ షకీల్, అబ్దుల్లా షఫీక్ పరిణతితో ఆడి మెప్పించారు. అయితే మహమ్మద్ రిజ్వాన్, బాబర్ అజామ్ అర్ధశతకాలపై తప్ప మ్యాచ్లపై దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. భారీ హిట్టర్గా పేరున్న ఇఫ్తికార్ అహ్మద్ కూడా కొన్ని షాట్లకే పరిమితమయ్యాడు.
గాయాల బెడద.. ఫిట్నెస్ ఎక్కడ?
‘‘ఒక్కొక్కరు 8 కేజీల మటన్ తినేట్టు ఉన్నారు. ఫిట్నెస్ ఏ స్థాయిలో ఉందో కూడా అర్థం కావడం లేదు. మైదానంలో చురుగ్గా కదలడంలో ఘోరంగా విఫలమయ్యారు’’ - వసీమ్ అక్రమ్ చేసిన కామెంట్ ఇది. పాకిస్థాన్ ఆటగాళ్ల ఫామ్పై వాస్తవ పరిస్థితి చెప్పడానికి ఈ మాట ఒక్కటి చాలు. మైదానంలో చురుగ్గా కదలాల్సిన ఫీల్డర్లు ఆ ఆలోచనే మరిచిపోయారు అనేలా వసీమ్ ఆ మాటలన్నాడు. అతనన్నట్లే క్యాచ్ల విషయంలో, బౌండరీలు ఆపే విషయంలో ఎక్కడ ఒంటికి దెబ్బ తగులుతుందో అనేలా కొంతమంది ఫీల్డర్లు ప్రవర్తించారు. ఇక ప్రపంచకప్ మెగా సంగ్రామం ముందు ఆటగాళ్ల గాయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలనే మినిమిమ్ పాయింట్ను కూడా పాకిస్థాన్ మేనేజ్మెంట్ పక్కనపెట్టేసిందనే విమర్శలు కూడా వినిపించాయి.
బాబర్ కెప్టెన్సీపై..
వన్డే ప్రపంచకప్లో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నాసరే.. సరైన సమయంలో నిర్ణయాలు తీసుకొని జట్టును ముందుకు నడిపించే బాధ్యత కెప్టెన్దే. బౌలర్ లేదా బ్యాటర్ అయినా సరే మంచి ప్రదర్శన ఇచ్చి సహచరుల్లోనూ ఆత్మవిశ్వాసం కల్పించాలి. ఇప్పటి వరకు టీమ్ఇండియా కెప్టెన్గా రోహిత్ శర్మ చేసిందిందే. కానీ, బాబర్ అజామ్ విషయంలో రివర్స్ అయిపోయింది. కొన్ని అర్ధశతకాలు సాధించినా సెంచరీలు చేయలేకపోయాడు. అలాగే జట్టుకు బాగా అవసరం అయినప్పుడు అతని నుంచి పరుగులు రాలేదు.
ఇక బౌలింగ్ వనరులను వినియోగించుకున్న తీరు కూడా విమర్శలకు తావిచ్చింది. హారిస్ రవూఫ్ను తొలి పవర్ప్లే చివర్లో బౌలింగ్కు తీసుకురావడంతో బ్యాటర్లు దూకుడుగా ఆడి భారీగా పరుగులు రాబట్టేశారు. దీంతో అతడి ఆత్మవిశ్వాసం దెబ్బతిని ఆ ప్రభావం మిగతా ఓవర్లపై పడింది. ఇక స్పిన్నర్ షాదాబ్ ఖాన్ విఫలమైనప్పటికీ అతన్ని అధిక మ్యాచుల్లో ఆడించాడు. కెప్టెన్సీలో దూకుడు లేకపోతే ఎలా ఉంటుందో బాబర్ను చూస్తే ఈజీగా అర్థమవుతుంది అనే కామెంట్స్ కూడా వినిపించాయి.
ఇతరులపై అక్కసు..!
‘‘ఈ వరల్డ్ కప్లో భారత్ గెలవడానికి విభిన్న బంతులను వాడుతున్నారు. డీఆర్ఎస్ ట్యాంపరింగ్ కూడా జరిగింది’’ అంటూ పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా టీమ్ఇండియాపై అక్కసు వెళ్లగక్కాడు. ఆ మాటలకు మన మాజీలే కాదు.. మహమ్మద్ షమీ కూడా బదులిచ్చాడు. ‘‘వసీమ్ అక్రమ్ వివరంగా చెప్పినా మీకు అర్థం కావడం లేదా? మొదట ఆటపై దృష్టిపెట్టండి. మీ క్రికెట్ స్టార్పైనే మీకు నమ్మకం లేదా?’’ అని షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. నిజానికి పాక్కు ఇది కొత్తేం కాదు. గతంలో కూడా పెద్ద టోర్నీల్లో ఓడినా, భారత్ చేతిలో ఓడినా ఇలానే అనేవారు. కాలంతోపాటు మారాల్సిన ఆ మాజీలు... అక్కడే ఆగిపోయారు.
పెద్దలు చెబితే వినొచ్చుగా...
ఇతర జట్లను తిట్టే కొంత మంది మాజీల మాటలే జట్టు యాజమాన్యం వింటుందనిపిస్తోంది. అయితే.. నిర్మాణాత్మకంగా సూచనలు చేసే దిగ్గజాల మాటలను పెడచెవిన పెడుతున్నట్లు కనిపిస్తోంది. లోటుపాట్లన్నీ తమ జట్టులో పెట్టుకుని ఇతరులపై అక్కసు వెళ్లగక్కడం పాకిస్థాన్ మాజీల్లో కొందరికి అలవాటుగా మారిపోయింది. పరిస్థితులను చక్కదిద్దుకొని విమర్శలు చేయాలని స్వయంగా ఆ జట్టు దిగ్గజాలు చెబుతున్నా వినాలనే ఆలోచన మేనేజ్మెంట్కు ఉండదు. ఎంతలా అంటే... ‘‘సెమీస్కు చేరుకోవాలంటే ప్రత్యర్థి ఆటగాళ్లను మైదానంలోకి దిగనీయకుండా రూమ్లోనే లాక్ చేయండి’’ అని - పాక్ మాజీ క్రికెటర్లు వసీమ్ అక్రమ్, మిస్బా ఉల్ హక్ అన్నారు అంటే జట్టు ప్రదర్శన పట్ల మాజీలు ఎంత చిరాకుతో ఉన్నారు చెప్పొచ్చు. అయితే వీటిని వినకుండా ఇతర జట్లను తిట్టే ఆ కొందరి మాజీల మాటలే పాక్ మేనేజ్మెంట్కు ఇష్టంగా మారాయని పలువురు విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు