IPL 2023 PlayOff: ఐపీఎల్ 2023.. ప్లేఆఫ్స్కు చేరే ఆ నాలుగు జట్లు ఏవి..?
ఐపీఎల్లో (IPL 2023) ప్లేఆఫ్స్కు చేరే జట్లేవో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే, రెండు జట్లకు అవకాశాలు మెండుగా ఉండగా.. మిగతా రెండు స్థానాల కోసం ఎనిమిది జట్లు పోటీ పడుతున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా నాలుగు జట్లే ముందు వరుసలో నిలిచాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 (IPL 2023) సీజన్లో లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరాయి. మరో 15 లీగ్ మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో టాప్ -4లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్కు చేరతాయి. ఆరంభంలో కాస్త నెమ్మదిగా సాగిన మ్యాచ్లు.. ప్రస్తుతం మరింత ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో పది జట్ల ప్లేఆఫ్స్ అవకాశాలు ఆసక్తికరంగా మారాయి. ఇప్పటి వరకు ఆయా జట్ల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం..
- గుజరాత్ టైటాన్స్ (GT): డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్దే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో అగ్రస్థానం. ఇప్పటి వరకు 11 మ్యాచుల్లో 8 విజయాలతో 16 పాయింట్లతో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచుల్లో ముంబయి ఇండియన్స్, సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లతో గుజరాత్ తలపడాల్సి ఉంది. ఈ మూడు మ్యాచుల్లోనూ ఓడినా గుజరాత్కు పెద్దగా సమస్య ఉండదు. అయితే, తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లకు క్వాలిఫయర్ మ్యాచ్లు ఆడే అవకాశం ఉంటుంది. క్వాలిఫయర్ 1లో ఓడిన జట్టు... ఎలిమినేటర్లో గెలిచిన జట్టుతో క్వాలిఫయర్ 2 ఆడుతుంది. అలా తొలి రెండు స్థానాల్లోని జట్లకు రెండో అవకాశం కూడా ఉంటుంది. అందుకైనా గుజరాత్ అగ్రస్థానంలో ఉండేందుకు మొగ్గు చూపుతుంది.
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానం చెన్నైదే.. ఇంకా రెండు మ్యాచులను మాత్రమే ఆడనుంది. 12 మ్యాచుల్లో ఏడు విజయాలు, నాలుగు ఓటములు, ఒక రద్దుతో ప్రస్తుతం చెన్నై ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. ఇక కోల్కతా నైట్రైడర్స్, దిల్లీ క్యాపిటల్స్తోనే చెన్నై తలపడాల్సి ఉంది. లఖ్నవూతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడం.. పంజాబ్ చేతిలో చివరి బంతికి ఓడిపోవడం సీఎస్కేకు ఇబ్బంది అయింది. లేకపోతే ఈపాటికే ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకొనే అవకాశం ఉంది. యువ బౌలర్లతో అద్భుతంగా ఫలితాలను రాబడుతున్న ఎంఎస్ ధోనీ ఇదే జోరును కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
- ముంబయి ఇండియన్స్ (MI): ఈ ఐపీఎల్ సీజన్లో ఉవ్వెత్తున ఎగిసిన జట్టు ఏదైనా ఉందంటే అది రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్. వరుసగా తొలి రెండు మ్యాచుల్లో ఓడి మరీ పుంజుకొని ప్లేఆఫ్స్ రేసులోకి దూసుకొచ్చింది. ప్రస్తుతం 11 మ్యాచులు ఆడిన ముంబయి.. ఆరు విజయాలు, ఐదు ఓటములతో 12 పాయింట్లతో మూడో స్థానంలోకి దూసుకొచ్చింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తోపాటు లఖ్నవూ సూపర్ జెయింట్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లతో ముంబయి తలపడాల్సి ఉంది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా అదరగొట్టేస్తూ ముంబయిని విజయపథంలో నడిపిస్తున్నారు.
- లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG): దిల్లీ క్యాపిటల్స్పై విజయంతో ఐపీఎల్ సీజన్ను ప్రారంభించిన లఖ్నవూ.. అడపాదడపా విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో కాస్త వెనుకబడింది. మొత్తం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఐదు ఓటములు, ఒక మ్యాచ్ రద్దు కావడంతో లఖ్నవూ ఖాతాలో 11 పాయింట్లు ఉన్నాయి. తుదిపరి మ్యాచ్లో (మే 13న) సన్రైజర్స్ హైదరాబాద్తో లఖ్నవూ తలపడనుంది. అలాగే ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్రైడర్స్తోనూ ఆడనుంది. క్వింటన్ డికాక్తోపాటు కేల్ మేయర్స్, పూరన్, స్టాయినిస్, ఆయుష్ బదోని ఫామ్లో ఉన్నారు. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.
- రాజస్థాన్ రాయల్స్ (RR): గతేడాది ఫైనలిస్ట్... ఈసారి ఆడిన మొదటి ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి అదరగొట్టేసింది. అయితే, ఒక్కసారిగా రాజస్థాన్ ఓటమిబాట పట్టి ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. గత ఆరు మ్యాచుల్లో కేవలం ఒక్క విజయం మాత్రమే నమోదు చేసిన రాజస్థాన్ ఐదింట్లో ఓడిపోవడం గమనార్హం. బ్యాటింగ్, బౌలింగ్లో సీనియర్లు ఉన్నప్పటికీ.. పరాజయాలు మాత్రం తప్పడం లేదు. ప్రస్తుతం 11 మ్యాచుల్లో కేవలం ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లను మాత్రమే సాధించింది. చివరి మూడు మ్యాచుల్లో కోల్కతా, బెంగళూరు, పంజాబ్ జట్లతో తలపడనుంది.
- కోల్కతా నైట్రైడర్స్ (KKR): కొత్త కెప్టెన్ నితీశ్ రాణా నాయకత్వంలోని కోల్కతా గత రెండు మ్యాచుల్లో విజయం సాధించి ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. అయితే, మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ప్లే ఆఫ్స్ అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లతో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచుల్లో రాజస్థాన్, చెన్నై, లఖ్నవూ వంటి పటిష్ఠమైన జట్లతో తలపడనుంది. అన్ని మ్యాచులనూ గెలిస్తేనే ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): ఐపీఎల్లో అత్యధిక సార్లు ప్లేఆఫ్స్కు చేరిన జట్టుగా బెంగళూరుకు పేరుంది. ఈసారి కూడానూ ముంబయి ఇండియన్స్ జట్టును ఓడించి మరీ టోర్నీని ఆరంభించిన బెంగళూరు.. అప్పుడప్పుడు విజయాలు మాత్రమే సాధించి పాయింట్ల పట్టికలో కిందికి దిగజారుతూ పోయింది. ప్రస్తుతం 11 మ్యాచుల్లో ఐదు విజయాలు, ఆరు ఓటములతో 10 పాయింట్లను సాధించి ఏడో స్థానంలో కొనసాగుతోంది. రాజస్థాన్, హైదరాబాద్, గుజరాత్తో జరిగే మిగిలిన మ్యాచుల్లో విజయం సాధించాల్సి ఉంది. కేవలం టాప్ ఆర్డర్పైనే ఆధారపడి ఉండటం గమనార్హం.
- పంజాబ్ కింగ్స్ (PBKS): కోల్కతాతోపాటు గతేడాది ఫైనలిస్ట్ రాజస్థాన్ను ఓడించి అదరగొట్టిన పంజాబ్ కింగ్స్ మళ్లీ తేలిపోయింది. వరుసగా రెండేసి విజయాలు, ఓటములతో పాయింట్ల పట్టికలో కిందికి దిగజారింది. ఆరంభంలో కెప్టెన్ శిఖర్ ధావన్ అద్భుతమైన బ్యాటింగ్తో రాణించాడు. కీలక సమయంలో మాత్రం సరైన ప్రదర్శన ఇవ్వకపోవడంతో పంజాబ్కు కష్టాలు తప్పలేదు. ఆడిన 11 మ్యాచుల్లో కేవలం ఐదు విజయాలను మాత్రమే నమోదు చేసింది. ప్రస్తుతం 10 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. దిల్లీతో రెండు మ్యాచ్లు, రాజస్థాన్తో ఒకసారి తలపడనుంది.
- సన్రైజర్స్ హైదరాబాద్ (SRH): ప్రస్తుతం 10 మ్యాచుల్లో కేవలం నాలుగు విజయాలతో 8 పాయింట్లు సాధించి అట్టడుగు నుంచి రెండో స్థానంలో కొనసాగుతోంది. అయినా, ఇప్పటికీ సన్రైజర్స్కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆడాల్సిన నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధిస్తే అప్పుడు హైదరాబాద్ 16 పాయింట్లతో ప్లేఆఫ్స్కు వెళ్లొచ్చు. లఖ్నవూ, గుజరాత్, బెంగళూరు, ముంబయితో తలపడాల్సి ఉంది.
- దిల్లీ క్యాపిటల్స్ (DC): వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి దాదాపు ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎప్పుడో నిష్క్రమించింది. తర్వాత జరిగిన ఆరు మ్యాచుల్లో నాలుగు గెలిచినా ఫలితం మాత్రం శూన్యమే. ప్రస్తుతం 11 మ్యాచుల్లో 4 విజయాలు, ఏడు ఓటములతో కేవలం 8 పాయింట్లతో చివరిస్థానంలో నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్కు చేరుకోవడం దాదాపు అసాధ్యం. మిగతా మూడు మ్యాచుల్లోనూ గెలిచినా కష్టమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్