Praggnanandhaa: ప్రజ్ఞానంద మరో సంచలనం.. క్లాసికల్ చెస్లోనూ కార్ల్సన్కు షాక్
Praggnanandhaa: క్లాసికల్ చెస్లో మాగ్నస్ కార్ల్సన్ దశాబ్ద కాలంగా తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తున్నాడు. తాజాగా అతణ్ని భారత యువ సంచలనం ప్రజ్ఞానంద ఓడించాడు.
స్టావాంజర్ (నార్వే): భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద (Praggnanandhaa) మరో సంచలనం నమోదు చేశాడు. చెస్లో కొరకరాని కొయ్యగా పేరొందిన మాగ్నస్ కార్ల్సన్కు మరోసారి ఓటమి రుచి చూపించాడు. ఈసారి అతణ్ని క్లాసికల్ చెస్ గేమ్లో మట్టికరిపించాడు. ఇది ప్రజ్ఞానందకు కీలక మైలురాయి. 2024 నార్వే చెస్ టోర్నమెంట్లో మూడో రౌండ్లో తెల్ల పావులతో ఆడిన అతడు కార్ల్సన్ (Magnus Carlsen) ఆట కట్టించాడు. ఈ మ్యాచ్ను 37 ఎత్తుల్లో గెలుచుకున్నాడు. గతంలో ర్యాపిడ్/ఎగ్జిబిషన్ గేమ్స్లో కార్ల్సన్ను ప్రజ్ఞానంద ఓడించిన సందర్భాలు ఉన్నాయి.
చెస్ చరిత్రలోనే కార్ల్సన్కు గొప్ప ఆటగాడిగా పేరుంది. గత దశాబ్దకాలంగా క్లాసికల్ చెస్లో అతడిదే ఆధిపత్యం. తాజా గెలుపుతో ప్రజ్ఞానంద (Praggnanandhaa) కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టినట్లయింది. ఆట ఆరంభంలో కార్ల్సన్ చేసిన కొన్ని తప్పులను ఆసరా చేసుకున్న ప్రజ్ఞానంద తనదైన శైలిలో దూసుకెళ్లాడు. బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్న క్రమంలో భారత యువ సంచలనం ఆట ఆసాంతం వ్యూహాత్మక ఎత్తులతో గొప్ప సంకల్పాన్ని ప్రదర్శించాడు. చివరకు గెలుపును సొంతం చేసుకొని తన సత్తా చాటాడు. ఫలితంగా ఈ టోర్నీ పాయింట్ల పట్టికలో తొలిస్థానానికి చేరాడు. కార్ల్సన్ (Magnus Carlsen) ఐదో స్థానానికి పడిపోయాడు.
క్లాసికల్ చెస్లో పావులను కదిపేందుకు ఎంత సమయమైనా తీసుకోవచ్చు. ఒక్కోసారి తమ వ్యూహాలకు పదునుపెడుతూ ఆటగాళ్లు ఒక్కో ఎత్తుకోసం గంట సమయం తీసుకున్న సందర్భాలూ ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గోదావరిలో నీరుంది.. కానీ ప్రభుత్వానికి ఇచ్చే మనసు లేదు: కేటీఆర్
-
ఐటీఆర్ దాఖలు గడువు పొడిగింపు లేనట్లేనా?
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు