Punjab Vs Delhi: తొలి మ్యాచ్లో ‘పంజా’బ్ విసిరింది.. దిల్లీపై సూపర్ విక్టరీ
ఐపీఎల్-17 సీజన్లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లో పంజాబ్ మెరిసింది. దిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-17 సీజన్లో భాగంగా ఆడిన తొలి మ్యాచ్లో పంజాబ్ మెరిసింది. దిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని పంజాబ్ 19.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సామ్ కరన్ (63; 47 బంతుల్లో 6×4, 1×6) అర్ధ శతకం బాది జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. శిఖర్ ధావన్ (22), ప్రభ్సిమ్రన్ సింగ్ (26) పరుగులు చేశారు. బెయిర్ స్టో (9), జితేశ్ శర్మ(9) విఫలమయ్యారు. లివింగ్స్టోన్ (38*; 2×4, 3×6)), హర్ప్రీత్ బ్రర్ (2*) నాటౌట్గా నిలిచారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన దిల్లీకి ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (29), మిచెల్ మార్ష్ (20) శుభారంభం అందించారు. వన్డౌన్ బ్యాటర్ షై హోప్ (33) రాణించాడు. 15 నెలల తర్వాత బ్యాట్ పట్టిన రిషభ్ పంత్ (18) పరుగులు చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో అభిషేక్ పొరెల్ (32; 10 బంతుల్లో) చెలరేగి ఆడాడు. అతడు వరుసగా 4,6,4,4,6 బాదాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 2, హర్షల్ పటేల్ 2, రబాడ, హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు