PV Sindhu: టైటిల్ కోసం తప్పని నిరీక్షణ.. మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో సింధు ఓటమి

ఒలింపిక్స్‌ సమీస్తున్న వేళ.. సూపర్ సిరీస్‌ టైటిల్‌ను నెగ్గి ఆత్మవిశ్వాసం పెంచుకుందామని భావించిన పీవీ సింధుకు నిరాశే ఎదురైంది.

Published : 26 May 2024 15:37 IST

ఇంటర్నెట్ డెస్క్: తెలుగు తేజం, స్టార్ షట్లర్ పీవీ సింధు (PV Sindhu) మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో ఓటమిపాలైంది. సూపర్‌ సిరీస్‌ టైటిళ్ల కరవు తీర్చుకోవాలని, రెండేళ్ల నిరీక్షణకు తెరదించాలని భావించిన సింధుకు మరోసారి నిరాశే ఎదురైంది. మలేషియా మాస్టర్స్‌ ఫైనల్‌లో చైనాకు చెందిన వాంగ్‌ జి యి చేతిలో 21-16, 5-21, 16-21 తేడాతో ఓడిపోయింది. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు జరిగిన ఈ సూపర్ సిరీస్‌ టైటిల్‌ను నెగ్గి ఆత్మవిశ్వాసం పెంచుకుందామని పీవీ సింధు భావించింది.

మొదటి రౌండ్‌లో ఆధిక్యం సాధించిన సింధుకు అసలైన పోటీ రెండో రౌండ్‌ నుంచి ఎదురైంది. ప్రత్యర్థి వాంగ్‌ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సెకండ్‌ రౌండ్‌లో చెలరేగిపోయింది. ఇద్దరు క్రీడాకారిణులు చెరొక రౌండ్‌ గెలిచి సమంగా నిలిచారు. విజేతగా తేల్చే చివరి రౌండ్‌ ఉత్కంఠభరితంగా సాగింది. వాంగ్‌ మరోసారి కీలక సమయంలో దూకుడు పెంచి చివరి రౌండ్‌లోనూ గెలిచి టైటిల్‌ను కైవసం చేసుకుంది. దాదాపు 79 నిమిషాలపాటు సాగిన పోరులో సింధుకు ఓటమి తప్పలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని