BCCI-Dravid: రాహుల్.. అప్పటి వరకు కోచ్గా కొనసాగు.. బీసీసీఐ మరో ప్రతిపాదన
రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) ప్రధాన కోచ్గా కొనసాగుతాడా? లేదా..? అనే ఉత్కంఠ భారత క్రికెట్ అభిమానుల్లో నెలకొంది. మిస్టర్ డిపెండబుల్కు బీసీసీఐ ఆఫర్లు ఇస్తూనే ఉన్నా అతడు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా ప్రధాన కోచ్గా ఇటీవల కాంట్రాక్ట్ను పూర్తి చేసుకున్న రాహుల్ ద్రవిడ్ను (Rahul Dravid) కొనసాగించాలని బీసీసీఐ భావిస్తోంది. మరో రెండేళ్లు అతడికి అవకాశం ఇస్తామని ఇప్పటికే బీసీసీఐ ప్రతిపాదించింది. ద్రవిడ్ మాత్రం కొనసాగేందుకు సుముఖంగా లేకపోవడంతో మరో ఆఫర్తో ముందుకొచ్చింది. కనీసం వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ వరకైనా జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టాలని కోరింది. ఒకవేళ ద్రవిడ్ ఈ ఆఫర్కు అంగీకరిస్తే.. అతడితోపాటు వన్డే ప్రపంచకప్ వరకు ఉన్న సహాయక సిబ్బంది కూడా కొనసాగే అవకాశం ఉంది. బ్యాటింగ్ కోచ్గా విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు కాంట్రాక్ట్ పొడిగింపు లభించనుంది.
ద్రవిడ్ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా మద్దతుగా నిలిచారు. అలాగే ద్రవిడ్ను దక్షిణాఫ్రికా పర్యటనకు పంపించాలని బీసీసీఐ భావిస్తోంది. డిసెంబర్ 10 నుంచి జనవరి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ‘‘కాంట్రాక్ట్ కొనసాగింపుపై చర్చలు జరుగుతూనే ఉంటాయి. అయితే, దక్షిణాఫ్రికాతో సిరీస్ చాలా కీలకం. ఈ పర్యటనలోని టీ20 సిరీస్కు వెళ్లకూడదని ద్రవిడ్ భావిస్తే.. వన్డేల నాటికి భారత జట్టుతో కలవచ్చు’’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్నే పంపాలని యాజమాన్యం బలంగా భావిస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. లక్ష్మణ్కు అవకాశంపై స్పందిస్తూ.. అతడు ఇప్పటికే ఎన్సీఏ పనులతో బిజీగా ఉన్నాడని.. అండర్-19 వరల్డ్ కప్ కూడా సమీస్తున్న తరుణంలో దక్షిణాఫ్రికా పర్యటనకు పంపడమూ కష్టమేనని బీసీసీఐ అధికారులు తెలిపారు. ప్రస్తుతం లక్ష్మణ్ ఆసీస్తో టీ20 సిరీస్కు కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు.
ఆశిశ్ నెహ్రా వద్దన్నాడా..?
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ తొలిసారే కప్ సాధించడంలో కెప్టెన్ హార్దిక్ పాండ్యతోపాటు భారత మాజీ పేసర్ ఆశిశ్ నెహ్రా కూడా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో ఆశిశ్ను పొట్టి ఫార్మాట్కు భారత కోచ్గా బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ భావించిందని సమాచారం. కానీ, ఆశిశ్ మాత్రం ఈ పదవి తీసుకోవడానికి అంగీకరించకపోవడంతో మళ్లీ రాహుల్ ద్రవిడ్ వైపే బీసీసీఐ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే, ఈ వార్తలపై అటు ఆశిశ్ లేదా బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం