Rahul Dravid: ఇన్నింగ్స్ ఇంకా ఉంది
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు.
ప్రధాన కోచ్గా కొనసాగనున్న ద్రవిడ్
దిల్లీ
సందిగ్ధత తొలగింది. ఊహాగానాలకు తెరపడింది. టీమ్ఇండియా ప్రధాన కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగనున్నాడు. అతడి కాంట్రాక్ట్ను పొడిగించాలని బీసీసీఐ నిర్ణయించింది. వీవీఎస్ లక్ష్మణ్ ఎన్సీఏలోనే ఉంటాడు.
భారత్ ప్రపంచకప్ ఫైనల్లో ఓడినప్పటికీ.. జట్టు అదిరే ప్రదర్శన నేపథ్యంలో ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్పై బీసీసీఐ విశ్వాసముంచింది. కోచ్గా అతడి కాంట్రాక్ట్ను పొడిగిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. పదవీకాలం ఎంతన్నది మాత్రం వెల్లడించలేదు. ‘‘ప్రపంచకప్తో పదవీకాలం ముగిసిన నేపథ్యంలో ద్రవిడ్తో బోర్డు ఫలవంతమైన చర్చలు జరిపింది. అతడితో పాటు సహాయ సిబ్బంది పదవీకాలాన్ని పొడిగించాలని ఏకగ్రీవంగా అంగీకరించింది’’ అని ఓ ప్రకటనలో బీసీసీఐ చెప్పింది. ద్రవిడ్కు బోర్డు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని కార్యదర్శి జై షా అన్నాడు. ‘‘ప్రపంచకప్లో టీమ్ఇండియా ప్రదర్శన అసాధారణం. ఫైనల్కు ముందు వరుసగా పది మ్యాచ్ల్లో గెలిచింది. జట్టు గొప్ప ప్రదర్శన చేసేలా కృషి చేసిన ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ప్రశంసార్హుడు. అతడికి మా పూర్తి మద్దతు ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో జట్టు నిలకడగా విజయాలు సాధించడానికి అవసరమైన సహకారాన్నంతా ఇస్తాం’’ అని చెప్పాడు.
‘‘టీమ్ఇండియాతో గత రెండేళ్లు చిరస్మరణీయం. మేము ఎన్నో ఎత్తు పల్లాలు చూశాం. ప్రయాణం ఆసాంతం జట్టులో అంతా ఒకరికొకరం గొప్పగా సహకరించుకున్నాం’’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. ప్రపంచకప్ అనంతర దశలో జట్టును మరింత ఉత్తమంగా తీర్చిదిద్దడానికి కృషి కొనసాగుతుందని అన్నాడు. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాఠోడ్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ దిలీప్లకు కూడా పొడిగింపు లభించింది. ద్రవిడ్ బృందం పదవీకాలంపై బోర్డు ఎలాంటి స్పష్టత ఇవ్వకున్నా.. కనీసం వచ్చే ఏడాది (జూన్-జులై)లో వెస్టిండీస్, అమెరికాలో జరిగే టీ20 ప్రపంచకప్ వరకు వాళ్లు కొనసాగుతారని భావిస్తున్నారు. మరోవైపు కోచ్గా కొనసాగడానికి ద్రవిడ్ అంగీకరించినంద]ుకు బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘‘కోచ్గా ద్రవిడ్ నైపుణ్యానికి భారత జట్టు ప్రదర్శనే నిదర్శనం. ప్రధాన కోచ్గా కొనసాగేందుకు అతడు అంగీకరించినంద]ుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పాడు.
లక్ష్మణ్ అక్కడే..: ద్రవిడ్ వైదొలిగితే ప్రధాన కోచ్గా అతడి స్థానాన్ని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) అధిపతి వీవీఎస్ లక్ష్మణ్ భర్తీ చేస్తాడని వార్తలొచ్చాయి. అయితే ఎన్సీఏ బాధ్యతలతో పాటు భారత్-ఏ, అండర్-19 జట్లతో పని చేయడమే తనకు ఎక్కువ సౌకర్యంగా ఉంటుందని బీసీసీఐ పెద్దలకు లక్ష్మణ్ తెలిపినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అతడు ఎన్సీఏ అధిపతిగా కొనసాగనున్నాడు. ఎన్సీఏ అధిపతిగా, తాత్కాలిక ప్రధాన కోచ్గా తన విధులను లక్ష్మణ్ గొప్పగా నిర్వర్తించాడని ప్రకటనలో బీసీసీఐ పేర్కొంది.
‘‘డ్రెస్సింగ్రూమ్లో మేం నెలకొల్పిన సంస్కృతికి నేను గర్విస్తున్నా. ఈ సంస్కృతి జయాల్లోనూ, అపజయాల్లోనూ గట్టిగా నిలబడుతుంది. మా జట్టులో గొప్ప నైపుణ్యం, ప్రతిభ ఉన్నాయి. మేం సరైన ప్రక్రియను అనుసరించాం. సన్నాహాలకు కట్టుబడి ఉన్నాం. ఫలితంగా సత్ఫలితాలు సాధించాం’’
రాహుల్ ద్రవిడ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల