Rajasthan : రాజస్థాన్ వెనుక కుమార వ్యూహం.. బోనస్గా బట్లర్ బీభత్సం
ఎప్పుడో మొదటి సీజన్లో టీ20 లీగ్ టైటిల్ను నెగ్గిన జట్టు.. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. మూడు సార్లు ప్లేఆఫ్స్కు...
టీ20 లీగ్లో దూసుకుపోతున్న సంజూ సేన
ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడో మొదటి సీజన్లో టీ20 లీగ్ టైటిల్ను నెగ్గిన జట్టు.. ఆ తర్వాత మళ్లీ ఆ ఊసే లేదు. మూడు సార్లు ప్లేఆఫ్స్కు వెళ్లినా టైటిల్ నెగ్గే దిశగా అడుగులు పడలేదు. ఇక మిగిలిన అన్నిసార్లూ లీగ్ దశకే పరిమితమై ఇంటిముఖం పట్టింది. అయితే ఎలాగైనా 15వ సీజన్ కప్ను సొంతం చేసుకోవాలని బరిలోకి దిగిన రాజస్థాన్.. ఆ దిశగా సాగుతోంది. ఈ క్రమంలోనే అత్యధిక పరుగులు, అత్యధిక వికెట్లు సాధించిన ఆటగాళ్లు ఈ జట్టునుంచే ఉండటం విశేషం. ఇక గత సీజన్లో అట్టడుగు నుంచి రెండో స్థానానికే పరిమితమైన రాజస్థాన్ జట్టులో వచ్చిన మార్పులేమిటి...? ఆటతీరులో మెరుగైన అంశాలు ఏంటనేవి తెలుసుకుందాం..
బ్యాటింగ్లో అతిపెద్ద మార్పు
గత సీజన్లో ఆడిన పద్నాలుగు మ్యాచుల్లో కేవలం ఐదు మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించిన రాజస్థాన్ (10) పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. అప్పట్లో బట్లర్, సంజూ శాంసన్, డేవిడ్ మిల్లర్, రియాన్ పరాగ్, రాహుల్ తెవాతియా, శివమ్ దూబే వంటి హార్డ్ హిట్టర్లు ఉన్నారు. ప్రస్తుతం వీరిలో బట్లర్, సంజూ శాంసన్, రియాన్ మాత్రమే ఉన్నారు. అయితే మెగా వేలానికి ముందు జోస్ బట్లర్తోపాటు సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్ను రాజస్థాన్ అట్టిపెట్టుకుంది. ఇక మెగా వేలంలో దేవదత్ పడిక్కల్, డారిల్ మిచెల్, హెట్మయేర్, వాన్ డస్సెన్, కరుణ్ నాయర్ వంటి బ్యాటర్లను కొనుగోలు చేసుకుంది. అయితే గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని జోస్ బట్లర్ ఈసారి మాత్రం చెలరేగిపోయాడు. ఎనిమిది మ్యాచుల్లో మూడు శతకాలు, రెండు అర్ధశతకాలతో 499 పరుగులు చేశాడు. సంజూ శాంసన్ (255) కూడా ఫర్వాలేదు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో రియాన్ పరాగ్ (56) అర్ధశతకం సాధించి రాజస్థాన్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
బలంగా పేస్ దళం..
బ్యాటింగ్ ఎంత బలంగా ఉన్నప్పటికీ బౌలింగ్లో పట్టు లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో గతేడాది వరకు బెంగళూరు పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. దీంతో ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, కుల్దీప్ సేన్ వంటి నాణ్యమైన ఫాస్ట్ బౌలర్లను రాజస్థాన్ కొనుగోలు చేసింది. ముంబయి విజయాల్లో ఓపెనింగ్ బౌలింగ్ చేసిన బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు కూడానూ పేస్ దళాన్ని ముందుండి నడిపిస్తున్నాడు. వికెట్లు తీయకపోయినా బ్యాటర్లపై ఒత్తిడి తీసుకువస్తున్నాడు. వీరే కాకుండా రిజర్వ్ బెంచ్పై నీషమ్, నవ్దీప్ సైని, మెకాయ్, నాథన్ కౌల్టర్ నైల్ వంటి పేసర్లూ అందుబాటులో ఉన్నారు. బెంగళూరుపై 145 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవలంలో సఫలీకృతం కావడానికి ప్రధాన కారణం యువ బౌలర్ కుల్దీప్ సేన్. అతడిపై నమ్మకముంచి అవకాశం కల్పించడమే కాకుండా డెత్ఓవర్లలోనూ బంతిని అందించిన సంజూ శాంసన్ మంచి ఫలితాలను రాబట్టాడు. ఇలా ప్రతి మ్యాచ్లోనూ వ్యూహాలను మారుస్తూ ప్రత్యర్థులకు చెమటలు పట్టేలా చేస్తున్నాడు.
టాప్ స్పిన్ ద్వయం సొంతం
టీమ్ఇండియాలో టాప్ స్పిన్నర్లుగా పేరుగాంచిన రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ను రాజస్థాన్ సొంతం చేసుకుని తమ స్పిన్ విభాగాన్ని పటిష్ఠం చేసుకుంది. ప్రస్తుతం టీ20 లీగ్లో అత్యధిక వికెట్లు (18) తీసిన బౌలర్గా చాహల్ కొనసాగుతున్నాడు. ఓడిపోతుందనుకున్న మ్యాచ్ను తన స్పిన్ మాయాజాలంతో రాజస్థాన్ వశమయ్యేలా చేస్తున్నాడు. కోల్కతాపై హ్యాట్రిక్తోపాటు ఐదువికెట్ల ప్రదర్శన చేసి సంచలనం సృష్టించాడు. ఇక అశ్విన్ 7.19 ఎకానమీతో ఏడు వికెట్లను తీశాడు. వికెట్లను తక్కువగా తీసినా పరుగులను నియంత్రించడంలో కీలకంగా మారాడు.
అదే సారథి.. మరి మార్పు ఎక్కడ...?
ఐదు సీజన్ల నుంచి రాజస్థాన్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజూ శాంసన్ గతేడాది స్టీవ్ స్మిత్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడు. గత సీజన్లో సారథి మారినా రాజస్థాన్ తలరాత మారలేదన్నట్లుగా గ్రూప్ స్టేజ్కే పరిమితమైంది. ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఈసారి మాత్రం తొలి నుంచి ఆధిపత్య ధోరణితో పాయింట్ల పట్టికలో టాప్-4లో కొనసాగుతోంది. టాప్ ఆర్డర్లో ఒక్క బ్యాటరైనా నిలబడి పరుగులు సాధిస్తుండటంతో భారీ స్కోర్లు చేయగలుగుతుంది. మరోవైపు ఓపెనర్ జోస్ బట్లర్ శతకాలు సాధిస్తూ జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నాడు. గత సీజన్లో రెగ్యులర్ స్పిన్నర్లు లేకుండా బరిలోకి దిగి బోల్తాపడిన రాజస్థాన్ ఈ సారి మాత్రం ఆ లోటును పూరించుకుని నాణ్యమైన బౌలర్లతో రంగంలోకి దిగింది. బ్యాటర్లు, బౌలర్లు సమష్ఠిగా రాణిస్తుండటం రాజస్థాన్కు ప్లస్ పాయింట్గా మారింది.
పునాది అక్కడే..
మెగా వేలం ఇతర టాప్ జట్లకు ఉపయోగపడిందో లేదో కానీ రాజస్థాన్కు బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. గత సీజన్లో భారీ స్కోరు చేసినా కాపాడుకోలేక బోల్తాపడింది. దీంతో ఈసారి బౌలర్లపై భారీగా ఖర్చు చేసింది. ప్రసిధ్ కృష్ణ (రూ. 10 కోట్లు), ట్రెంట్ బౌల్ట్ (రూ. 8 కోట్లు), యుజ్వేంద్ర చాహల్ (రూ. 6.50 కోట్లు), రవిచంద్రన్ అశ్విన్ (రూ. 5 కోట్లు) వంటి అగ్రశ్రేణి బౌలర్ల కోసం భారీగా వెచ్చించింది. దీని కోసం అద్భుత వ్యూహాలతో రాజస్థాన్ క్రికెట్ డైరెక్టర్ కుమార సంగక్కర నేతృత్వంలోని యాజమాన్యం మెగా వేలంలో పాల్గొంది. ఏ ఆటగాడిని ఎలా సొంతం చేసుకోవాలనే దానిపై పక్కాగా ప్రణాళికలతో బరిలోకి దిగి విజయవంతమైంది. ఇక ఆటపరంగానూ ఇలాంటి ప్రదర్శన కొనసాగిస్తే టీ20 లీగ్ టైటిల్ను నెగ్గే జట్లలో రాజస్థాన్ ఒకటని విశ్లేషకులు భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
గాయం కారణంగా టీమ్కు దూరమైన స్టార్ పేసర్ షమీ.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. -
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్