Rajasthan Vs Kolkata: ఒక్క బంతీ పడకుండానే..

ఐపీఎల్‌-17లో లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ వర్షార్పణం అయింది.

Published : 20 May 2024 02:07 IST

గువాహటి: ఐపీఎల్‌-17లో లీగ్‌ దశలో ఆఖరి మ్యాచ్‌ వర్షార్పణం అయింది. ఆదివారం గువాహటిలో రాజస్థాన్‌ రాయల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య పోరు ఒక్క బంతీ పడకుండానే తుడిచిపెట్టుకుపోయింది. మొదట వర్షం కారణంగా టాస్‌ ఆలస్యం అయింది. రా.8.30లోపు వర్షం ఆగితే పూర్తి మ్యాచ్‌ జరిగే అవకాశం ఉండేది. కానీ వరుణుడు కరుణించకపోవడంతో పిచ్‌తో పాటు మైదానాన్ని కవర్లు కప్పి ఉంచారు. వర్షం తగ్గడంతో రా.10.25కి అంపైర్లు పిచ్‌ను పరిశీలించి ఇన్నింగ్స్‌కు 7 ఓవర్ల చొప్పున మ్యాచ్‌ నిర్వహించాలని నిర్ణయించారు. కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. కాసేపట్లో ఆట మొదలవుతుందనగా మళ్లీ వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్‌ రద్దయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు