Rajasthan Vs Bengaluru: బట్లర్ శతకం.. రాజస్థాన్ నాలుగో విజయం
ఐపీల్ 2024లో రాజస్థాన్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
జైపుర్: ఐపీఎల్ 17లో రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సంజూ సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్కిది వరుసగా నాలుగో విజయం. ఈ సీజన్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113*; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు) శతకం బాదాడు. 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) విఫలమైనా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (100*; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి దాకా క్రీజులో ఉండి సిక్సర్ బాది సెంచరీ పూర్తిచేసుకోవడంతోపాటు మ్యాచ్ను ముగించాడు.
వన్డౌన్ బ్యాటర్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరు బౌలర్లలో రీస్ టాప్లీ 2, యశ్ దయాల్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీతోపాటు డుప్లెసిస్ (44; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. కోహ్లీ, డుప్లెసిస్ ద్వయం తొలి వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (1), సౌరభ్ చౌహన్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2, నంద్రి బర్గర్ ఒక వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ విశేషాలు
-
బట్లర్కిది వందో ఐపీఎల్ మ్యాచ్. అతడు తన వందో మ్యాచ్లో 100 సాధించడం విశేషం.
- ఐపీఎల్లో విరాట్ కోహ్లీకిది ఎనిమిదో సెంచరీ. ఈ శతకంతో ఐపీఎల్లో 7500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కోహ్లీ 7579 పరుగులతో ఉన్నాడు.
- ఈ మ్యాచ్తో ఐపీఎల్ 17లో శతకం కరువు తీరిపోయింది. ఏకంగా ఇద్దరు (కోహ్లీ, బట్లర్) శతకాలు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లెలో బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన సిసోదియా
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి