Rajasthan Vs Bengaluru: బట్లర్ శతకం.. రాజస్థాన్ నాలుగో విజయం
ఐపీల్ 2024లో రాజస్థాన్ వరుసగా నాలుగో విజయాన్ని నమోదు చేసింది.
జైపుర్: ఐపీఎల్ 17లో రాజస్థాన్ జైత్రయాత్ర కొనసాగుతోంది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సంజూ సేన 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. రాజస్థాన్కిది వరుసగా నాలుగో విజయం. ఈ సీజన్లో బెంగళూరుకు ఇది నాలుగో ఓటమి. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (113*; 72 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్లు) శతకం బాదాడు. 184 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ నాలుగు వికెట్లు కోల్పోయి మరో ఐదు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (0) విఫలమైనా.. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (100*; 58 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లు) చివరి దాకా క్రీజులో ఉండి సిక్సర్ బాది సెంచరీ పూర్తిచేసుకోవడంతోపాటు మ్యాచ్ను ముగించాడు.
వన్డౌన్ బ్యాటర్ సంజు శాంసన్ (69; 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) అర్ధ శతకంతో మెరిశాడు. బెంగళూరు బౌలర్లలో రీస్ టాప్లీ 2, యశ్ దయాల్, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీతోపాటు డుప్లెసిస్ (44; 33 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. కోహ్లీ, డుప్లెసిస్ ద్వయం తొలి వికెట్కు 125 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. గ్లెన్ మ్యాక్స్వెల్ (1), సౌరభ్ చౌహన్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 2, నంద్రి బర్గర్ ఒక వికెట్ పడగొట్టారు.
మ్యాచ్ విశేషాలు
-
బట్లర్కిది వందో ఐపీఎల్ మ్యాచ్. అతడు తన వందో మ్యాచ్లో 100 సాధించడం విశేషం.
- ఐపీఎల్లో విరాట్ కోహ్లీకిది ఎనిమిదో సెంచరీ. ఈ శతకంతో ఐపీఎల్లో 7500 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం కోహ్లీ 7579 పరుగులతో ఉన్నాడు.
- ఈ మ్యాచ్తో ఐపీఎల్ 17లో శతకం కరువు తీరిపోయింది. ఏకంగా ఇద్దరు (కోహ్లీ, బట్లర్) శతకాలు సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.