MS Dhoni: ‘ఎం.ఎస్.ధోనీ.. అత్యంత నిస్వార్థ ఆటగాడు’
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) అత్యంత నిస్వార్థ ఆటగాడని పలువురు మాజీ క్రికెటర్లు ఓ కార్యక్రమంలో చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులున్నారు. చాలా క్రికెటర్లు సైతం ‘కెప్టెన్ కూల్’ని అభిమానిస్తారు. తాజాగా జియో సినిమా, స్టోర్ట్స్ 18 ఛానల్ నిర్వహించిన ‘ర్యాపిడ్ ఫైర్ విత్ ది లెజెండ్స్’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్లు ధోనీతో ఉన్న అనుబంధాన్ని, అతడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, పార్థివ్ పటేల్, రాబిన్ ఊతప్పతోపాటు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్గేల్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ పాల్గొన్నారు. ర్యాపిడ్ ఫైర్లో చోప్రా వేసిన ప్రశ్నలకు ఎవరో ఏం సమాధానమిచ్చారంటే..
ప్రశ్న: అత్యంత నిస్వార్థ ఆటగాడు ఎవరు?
మొదటి ఈ ప్రశ్నను రాబిన్ ఊతప్పను అడగ్గా.. అతడు మహేంద్ర సింగ్ ధోనీ అని సమాధానమిచ్చాడు. తర్వాత స్ట్రెరిస్ ఈ ప్రశ్నకు విలియమ్సన్ అని జవాబిచ్చాడు. దీంతో ఆకాశ్ చోప్రా జోక్యం చేసుకుని కివీస్ ఆటగాడు కాకుండా మరో క్రికెటర్ను ఎంచుకోవాలని స్కాట్ని కోరగా.. అతడు ధోనీని ఎంచుకున్నాడు. పార్థివ్ పటేల్ తనను తాను (సరదాగా) నిస్వార్థ ఆటగాడిగా చెప్పుకోవడంతో అక్కడున్నవారు కాసేపు నవ్వుకున్నారు. అనిల్ కుంబ్లే, క్రిస్ గేల్ కూడా ధోనీ పేరే చెప్పారు. అంటే ఐదుగురిలో నలుగురు ధోనీకే ఓటు వేశారన్నమాట.
ప్రశ్న: మోస్ట్ ఫ్యాషనెబుల్ (స్టైలిష్) ప్లేయర్ ఎవరు?
అనిల్ కుంబ్లే.. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) పేరు చెప్పగా.. పార్థివ్ పటేల్ లసిత్ మలింగని ఎంచుకున్నాడు. స్కాట్ స్ట్రైరిస్ వెస్టిండీస్ ఆటగాళ్లలో ఎవరినైనా స్టైలిష్ ప్లేయర్గా భావించొచ్చు అని చెప్పగా.. నీ ముందు కూర్చుని ఉన్న క్రిస్ గేల్ అందుకు సరిపోతాడా అని చోప్రా అడగ్గా.. స్కాట్ అవును అని సమాధానమిచ్చాడు.
ప్రశ్న: ఫన్నీ స్లెడ్జింగ్ చేసింది ఎవరు?
ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెటర్స్ షేన్ వార్న్, మాథ్యూ హేడెన్ తనపై సరదాగా స్లెడ్జింగ్ చేశారని స్కాట్ స్ట్రైరిస్ చెప్పాడు. తనపై ఎవరు స్లెడ్జింగ్ చేయలేదని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.
ఐపీఎల్లో క్రిస్ గేల్ చాలాకాలంపాటు ఆర్సీబీ (RCB) తరఫున ఆడిన విషయం తెలిసిందే. అయితే, జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ఒక్కసారిగా కూడా ఛాంపియన్గా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై అభిమానుల, మీడియా ఫోకస్ బెంగళూరు జట్టు టైటిల్ ఆశలను దెబ్బతీసిందా? అని క్రిస్ గేల్ను స్కాట్ స్ట్రైరిస్ ప్రశ్నించాడు. ‘నేను ఆర్సీబీ తరఫున ఆరేళ్లు ఆడాను. టైటిల్ గెలవాలంటే సరైన జట్టు ఉండాలి. జట్టుకు సమయం కేటాయించాలి. జట్టు సభ్యులు ఒక కుటుంబంలా ముందుకు సాగితే ఛాంపియన్గా నిలవొచ్చు. రాబిన్ ఊతప్ప ప్రస్తావించినట్టుగా చాలామంది ఆటగాళ్లు జట్టు నుంచి వెళ్లిపోయారు. అనేక మంది ఆటగాళ్లు తాము ఫ్రాంచైజీ భాగం అని భావించలేదు. జట్టులో నాతోపాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్పై మాత్రమే ఎక్కువ ఫోకస్ ఉండేది. దాంతో చాలా మంది క్రికెటర్లు మానసికంగా తాము జట్టులో లేమని భావించారు. అందుకే ఆర్సీబీకి టైటిల్ గెలవడం సవాలుగా మారింది’ అని గేల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్