MS Dhoni: ‘ఎం.ఎస్.ధోనీ.. అత్యంత నిస్వార్థ ఆటగాడు’
భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ (MS Dhoni) అత్యంత నిస్వార్థ ఆటగాడని పలువురు మాజీ క్రికెటర్లు ఓ కార్యక్రమంలో చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)కి ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది అభిమానులున్నారు. చాలా క్రికెటర్లు సైతం ‘కెప్టెన్ కూల్’ని అభిమానిస్తారు. తాజాగా జియో సినిమా, స్టోర్ట్స్ 18 ఛానల్ నిర్వహించిన ‘ర్యాపిడ్ ఫైర్ విత్ ది లెజెండ్స్’ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ క్రికెటర్లు ధోనీతో ఉన్న అనుబంధాన్ని, అతడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ కార్యక్రమానికి టీమ్ఇండియా మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, పార్థివ్ పటేల్, రాబిన్ ఊతప్పతోపాటు వెస్టిండీస్ దిగ్గజం క్రిస్గేల్, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ పాల్గొన్నారు. ర్యాపిడ్ ఫైర్లో చోప్రా వేసిన ప్రశ్నలకు ఎవరో ఏం సమాధానమిచ్చారంటే..
ప్రశ్న: అత్యంత నిస్వార్థ ఆటగాడు ఎవరు?
మొదటి ఈ ప్రశ్నను రాబిన్ ఊతప్పను అడగ్గా.. అతడు మహేంద్ర సింగ్ ధోనీ అని సమాధానమిచ్చాడు. తర్వాత స్ట్రెరిస్ ఈ ప్రశ్నకు విలియమ్సన్ అని జవాబిచ్చాడు. దీంతో ఆకాశ్ చోప్రా జోక్యం చేసుకుని కివీస్ ఆటగాడు కాకుండా మరో క్రికెటర్ను ఎంచుకోవాలని స్కాట్ని కోరగా.. అతడు ధోనీని ఎంచుకున్నాడు. పార్థివ్ పటేల్ తనను తాను (సరదాగా) నిస్వార్థ ఆటగాడిగా చెప్పుకోవడంతో అక్కడున్నవారు కాసేపు నవ్వుకున్నారు. అనిల్ కుంబ్లే, క్రిస్ గేల్ కూడా ధోనీ పేరే చెప్పారు. అంటే ఐదుగురిలో నలుగురు ధోనీకే ఓటు వేశారన్నమాట.
ప్రశ్న: మోస్ట్ ఫ్యాషనెబుల్ (స్టైలిష్) ప్లేయర్ ఎవరు?
అనిల్ కుంబ్లే.. భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) పేరు చెప్పగా.. పార్థివ్ పటేల్ లసిత్ మలింగని ఎంచుకున్నాడు. స్కాట్ స్ట్రైరిస్ వెస్టిండీస్ ఆటగాళ్లలో ఎవరినైనా స్టైలిష్ ప్లేయర్గా భావించొచ్చు అని చెప్పగా.. నీ ముందు కూర్చుని ఉన్న క్రిస్ గేల్ అందుకు సరిపోతాడా అని చోప్రా అడగ్గా.. స్కాట్ అవును అని సమాధానమిచ్చాడు.
ప్రశ్న: ఫన్నీ స్లెడ్జింగ్ చేసింది ఎవరు?
ఒక మ్యాచ్లో ఆస్ట్రేలియా క్రికెటర్స్ షేన్ వార్న్, మాథ్యూ హేడెన్ తనపై సరదాగా స్లెడ్జింగ్ చేశారని స్కాట్ స్ట్రైరిస్ చెప్పాడు. తనపై ఎవరు స్లెడ్జింగ్ చేయలేదని రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.
ఐపీఎల్లో క్రిస్ గేల్ చాలాకాలంపాటు ఆర్సీబీ (RCB) తరఫున ఆడిన విషయం తెలిసిందే. అయితే, జట్టులో ఎంతోమంది స్టార్ ఆటగాళ్లు ఉన్నా ఆర్సీబీ ఒక్కసారిగా కూడా ఛాంపియన్గా నిలవలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆటగాళ్లపై అభిమానుల, మీడియా ఫోకస్ బెంగళూరు జట్టు టైటిల్ ఆశలను దెబ్బతీసిందా? అని క్రిస్ గేల్ను స్కాట్ స్ట్రైరిస్ ప్రశ్నించాడు. ‘నేను ఆర్సీబీ తరఫున ఆరేళ్లు ఆడాను. టైటిల్ గెలవాలంటే సరైన జట్టు ఉండాలి. జట్టుకు సమయం కేటాయించాలి. జట్టు సభ్యులు ఒక కుటుంబంలా ముందుకు సాగితే ఛాంపియన్గా నిలవొచ్చు. రాబిన్ ఊతప్ప ప్రస్తావించినట్టుగా చాలామంది ఆటగాళ్లు జట్టు నుంచి వెళ్లిపోయారు. అనేక మంది ఆటగాళ్లు తాము ఫ్రాంచైజీ భాగం అని భావించలేదు. జట్టులో నాతోపాటు విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్పై మాత్రమే ఎక్కువ ఫోకస్ ఉండేది. దాంతో చాలా మంది క్రికెటర్లు మానసికంగా తాము జట్టులో లేమని భావించారు. అందుకే ఆర్సీబీకి టైటిల్ గెలవడం సవాలుగా మారింది’ అని గేల్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
ఐపీఎల్ 17వ సీజన్లో బెంగళూరుకు రెండో విజయం దక్కింది. మరోవైపు సొంత మైదానంలో హైదరాబాద్కు ఓటమి ఎదురైంది. -
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
వెస్టిండీస్ క్రికెటర్లకు ఐపీఎల్ తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను పాక్ మాజీ క్రికెటర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. -
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
టీ20 ప్రపంచకప్కు టీమ్ ఇండియాను ఎంచుకోండి అని అడిగితే.. పాఠకులు సెలక్ట్ చేసిన 15 మంది వీరే. -
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!