Ravi Shastri: గంగూలీ సహా దిల్లీ డగౌట్పై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
వరుసగా ఐదు మ్యాచుల్లోనూ ఓడిపోయిన దిల్లీ క్యాపిటల్స్ (DC) పాయింట్ల పట్టికలో ఖాతా తెరవలేదు. క్రికెట్ దిగ్గజాలు జట్టుతోపాటు ఉన్నప్పటికీ.. విజయాలు మాత్రం దక్కడంలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో రికీ పాంటింగ్, సౌరభ్ గంగూలీ దిగ్గజ క్రికెటర్లు. వీరిద్దరూ కలిసి డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మాత్రం ఐపీఎల్ 16వ సీజన్లో (IPL 2023) ఇప్పటి వరకు ఒక్క విజయం చేకూర్చలేకపోయారు. వరుసగా ఐదు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది. తాజాగా బెంగళూరు చేతిలో పరాజయం పాలైంది. దీంతో టీమ్ఇండియా మాజీ కోచ్, క్రికెట్ వ్యాఖ్యాత రవిశాస్త్రి మాత్రం దిల్లీ ఫ్రాంచైజీ, గంగూలీ సహా ఇతర కోచింగ్ సిబ్బందిపై కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు - దిల్లీ మ్యాచ్ సందర్భంగా కామెంట్రీ బాక్స్లో రవిశాస్త్రి వ్యాఖ్యాతగా వ్యవహరించాడు.
‘‘ఇతర జట్లు విజయాలతో ముందుకు సాగుతున్న వేళ.. దిల్లీ క్యాపిటల్స్ మాత్రం ఒక్క గెలుపు కోసం పోరాడాల్సి వస్తోంది. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిపోయిన జట్టు తిరిగి పుంజుకోవాలంటే మాత్రం కష్టమే. దిల్లీ డగౌట్లో ఉండే వారికి కూడా ఓడిపోవడం ఇష్టం ఉండదు. అందులో రికీ పాంటింగ్, డేవిడ్ వార్నర్, గంగూలీ.. వీరెవరికీ ఓడిపోవడం నచ్చదు. మ్యాచ్ చివరి వరకూ పోరాడి మరీ దిల్లీ మ్యాచ్లను చేజార్చుకుంది. ఇది వారికి సంతోషించే అంశం కాదు. కానీ, మ్యాచ్ మ్యాచ్కు కాస్త మెరుగు కావడం మాత్రం ముందడుగు లాంటిదని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ భావిస్తాడనుకుంటా’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి