WTC Final: భారత జట్టా.. ఫ్రాంచైజీ క్రికెట్టా..?ఐపీఎల్ కాంట్రాక్ట్లో కొత్త క్లాజ్ చేర్చాలన్న రవిశాస్త్రి
ఐపీఎల్లో రాణించిన బ్యాటర్లు డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final)లో తేలిపోవడంపై విమర్శలు వస్తున్న క్రమంలో టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ (WTC Final 2023) తొలి ఇన్నింగ్స్లో భారత టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఐపీఎల్లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ వంటి ఆటగాళ్లు తేలిపోవడంపై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కఠిన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ 14 పరుగులు చేయగా.. గిల్ 13 పరుగులకే పెవిలియన్కు చేరాడు. దీంతో బీసీసీఐ ముందు రవిశాస్త్రి పలు ప్రతిపాదలను తీసుకొచ్చాడు. ఆటగాళ్లు భారత జట్టుకు ఆడేందుకు ఆసక్తిగా ఉన్నారా..? ఫ్రాంచైజీ క్రికెట్ను మాత్రమే ఆడతారా..? అనే క్లాజ్ను ఐపీఎల్ కాంట్రాక్ట్లో పొందుపరిచే విధంగా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలని సూచించాడు.
‘‘ఆటగాళ్ల ప్రాధాన్యత ఏది..? ఫ్రాంచైజీ క్రికెట్టా..? భారత్ జట్టు తరఫున లేదా ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతారో నిర్ణయం తీసుకోవాలి. కేవలం ఫ్రాంచైజీ క్రికెట్ అంటే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్ గురించి మరిచిపోండి. ఒకవేళ ఇదే (wtc final) ముఖ్యమని భావిస్తే బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బీసీసీఐనే బాస్. అందుకే, ఐపీఎల్ కాంట్రాక్ట్స్లో ఒక క్లాజ్ను చేర్చాలి. భారత్ తరఫున ఆడాల్సిన అవసరం ఉన్నప్పుడు ఐపీఎల్ నుంచి బయటకు వచ్చేలా రూల్ చేయాలి. అయితే, ఫ్రాంచైజీ నుంచి అనుమతి కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారీ మొత్తం ఇన్వెస్ట్ చేసి ఆటగాళ్లను సొంతం చేసుకుంటాయి. కానీ, కస్టోడియన్ మాత్రం బీసీసీఐ కాబట్టి తుది నిర్ణయం దానిదే. భారత్లో క్రికెట్ను నియంత్రించే బాధ్యత బీసీసీఐదే’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ(Virat Kohli) ఆటతీరుపై సునీల్ గావస్కర్ విమర్శలు గుప్పించాడు. -
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
ఉప్పల్లో హైదరాబాద్-బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్లో ట్రావిస్ హెడ్ బలహీనత మరోసారి బయటపడింది. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ దీనిని చక్కగా సద్వినియోగం చేసుకున్నాడు. -
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
Faf du Plessis: విజయంతోనే జట్టులో విశ్వాసం వస్తుందన్నాడు బెంగళూరు సారథి ఫాఫ్ డుప్లెసిస్. తమ జట్టులో విరాట్ కోహ్లీ టాప్ స్కోరర్గా ఉండటం ఆనందంగా ఉందన్నాడు. -
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
Pat Cummins: హైదరాబాద్ వేదికగా గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో బెంగళూరు చేతిలో సన్రైజర్స్ ఓటమిపాలైంది. దీనిపై కమిన్స్ మాట్లాడుతూ.. తమ జట్టు అనుసరిస్తున్న వ్యూహాన్ని సమర్థించుకున్నాడు. -
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు