Hardik Pandya: అతడూ మనిషే.. వరుసగా ఓడినంత మాత్రాన చెడ్డ జట్టేమీ కాదు: రవిశాస్త్రి
ఓ వ్యక్తిని టార్గెట్ చేస్తూ మైదానంలో అల్లరి చేయడం తగదని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్యను (Hardik Pandya) అభిమానులు ట్రోలింగ్ చేయడంపై రవిశాస్త్రి కాస్త అసహనం వ్యక్తం చేశాడు. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్ సమయంలో.. ప్రేక్షకులు నినాదాలతో హోరెత్తించారు. దీనిపై రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘‘గత కొన్నేళ్లుగా ముంబయికి మద్దతుగా నిలిచారు. కానీ, కేవలం రెండు మ్యాచుల్లో ఓడిపోయినంత మాత్రాన జట్టును తక్కువ చేయడం మంచిది కాదు. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన టీమ్ అదే. ఇప్పుడు కొత్త కెప్టెన్ సారథ్యంలో బరిలోకి దిగింది. కాస్త ఓపికగా ఉండాలి. పాండ్యను మరీ ట్రోలింగ్ చేయడం తప్పు. అతడు కూడా మనిషే. రోజు ముగిసిన తర్వాత ఎవరైనా నిద్ర పోవాల్సిందే. కాబట్టి, ప్రతిఒక్కరూ కాస్త ఆలోచించండి. నిశ్శబ్దంగా ఉండాలి. ఈసందర్భంగా పాండ్యకు కూడా ఒక సూచన చేస్తున్నా. ఓపికగా ఉండి.. గేమ్పైనే దృష్టిసారించాలి. ఆ జట్టులో చాలా మంచి ఆటగాళ్లు ఉన్నారు. మరో నాలుగు మ్యాచుల్లో గెలిస్తే చాలు. అంతా సర్దుకుంటుంది’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
ఇషాన్ కిషన్కు భలే పనిష్మెంట్
ముంబయి ఆటగాడు ఇషాన్ కిషన్కు ఆ జట్టు మేనేజ్మెంట్ వినూత్నమైన శిక్ష విధించింది. అతడితో సూపర్ మ్యాన్ వేషం వేయించింది. అలాగే కుమార్ కార్తికేయ, షామ్స్ ములాని, నువాన్ తుషారాకూ ఇదే పనిష్మెంట్ ఇచ్చారు. ఎందుకు అనేగా మీ డౌటు? వీరంతా జట్టు మీటింగ్కు ఆలస్యం వచ్చారని ఇలాంటి శిక్ష విధించింది. దీంతో డ్రెస్సింగ్ రూమ్లో నవ్వులు విరిశాయి. ఈమేరకు ముంబయి తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు పెట్టింది. అందులో నమన్ ధిర్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇలాంటి శిక్షలు ఉంటాయనే తాను మీటింగ్కు అస్సలు ఆలస్యంగా రానని వ్యాఖ్యానించాడు. గతంలో నెహాల్ వధేరాకూ ఇలాంటి శిక్ష పడింది. అయితే, ఇషాన్కు ఇదే తొలిసారి కాదు. 2018లోనూ ఓసారి సమావేశానికి ఆలస్యంగా వచ్చాడు. అప్పుడు రాహుల్ చాహర్, అనుకుల్ రాయ్తో కలిసి ఆలస్యమయ్యాడు. ఆ సమయంలో తాను మళ్లీ ఎప్పుడూ లేట్ కానని వ్యాఖ్యానించాడు. ఇప్పుడు మరోసారి పనిష్మెంట్ను ఎదుర్కోవడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి