Virat - Ganguly: విరాట్ - గంగూలీ ‘షేక్హ్యాండ్’ వివాదం.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం కొత్త చర్చకు దారితీసింది. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ, డీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కరచాలనం ఇచ్చుకునేందుకు ఇష్టపడకపోవడంతో సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్లో (IPL 2023) మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే, ఓ సంఘటన మాత్రం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వాడీవేడీ వాతావరణం ఒక్కసారిగా ఐపీఎల్ను వార్తల్లో నిలిచేలా చేసింది. దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs DC) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గంగూలీకి కరచాలనం చేసేందుకు విరాట్ కోహ్లీ విముఖత ప్రదర్శించాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఇద్దరూ అన్ఫాలో చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
‘‘ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. ఒకరేమో (X ప్లేయర్) టీమ్ఇండియా గొప్ప ఆటగాడు. మాజీ కెప్టెన్. దిగ్గజం. మరొక ఆటగాడు (Y ప్లేయర్) కూడా భారత్కు చెందిన గొప్ప ఆటగాడే. మాజీ కెప్టెన్ అయిన ఆ ప్లేయర్ ఇంకా ఆడుతున్నాడు. ఇప్పుడు X ఓ జట్టును నడిపిస్తున్నాడు. Y అనే ఆటగాడు తన జట్టు కోసం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరిపై మరొకరు అయిష్టతను ప్రదర్శిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా కరచాలనం చేసుకొనేందుకు వచ్చారు. అయితే, X, Y మాత్రం షేక్హ్యాండ్ ఇచ్చుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. వారిద్దరూ మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు వారికి ఏమైనా సలహాలు ఇస్తారా? అని అడుగుతుంటారు. అయితే, నాకున్న రిలేషన్స్ ఆధారంగానే మాట్లాడతా. నేను మాట్లాడకూడదనుకుంటే దాటవేస్తాను’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!