Virat - Ganguly: విరాట్ - గంగూలీ ‘షేక్హ్యాండ్’ వివాదం.. రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వివాదం కొత్త చర్చకు దారితీసింది. ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ, డీసీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరూ కరచాలనం ఇచ్చుకునేందుకు ఇష్టపడకపోవడంతో సోషల్ మీడియాలో ఈ అంశం వైరల్గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్లో (IPL 2023) మ్యాచ్లు రసవత్తరంగా సాగుతున్నాయి. అయితే, ఓ సంఘటన మాత్రం అభిమానుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. టీమ్ఇండియా మాజీ కెప్టెన్లు సౌరభ్ గంగూలీ, విరాట్ కోహ్లీ మధ్య వాడీవేడీ వాతావరణం ఒక్కసారిగా ఐపీఎల్ను వార్తల్లో నిలిచేలా చేసింది. దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB vs DC) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా గంగూలీకి కరచాలనం చేసేందుకు విరాట్ కోహ్లీ విముఖత ప్రదర్శించాడు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఇద్దరూ అన్ఫాలో చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య జరిగిన వ్యవహారంపై టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
‘‘ఇక్కడ ఇద్దరు ఆటగాళ్లు ఉన్నారు. ఒకరేమో (X ప్లేయర్) టీమ్ఇండియా గొప్ప ఆటగాడు. మాజీ కెప్టెన్. దిగ్గజం. మరొక ఆటగాడు (Y ప్లేయర్) కూడా భారత్కు చెందిన గొప్ప ఆటగాడే. మాజీ కెప్టెన్ అయిన ఆ ప్లేయర్ ఇంకా ఆడుతున్నాడు. ఇప్పుడు X ఓ జట్టును నడిపిస్తున్నాడు. Y అనే ఆటగాడు తన జట్టు కోసం అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ ఒకరిపై మరొకరు అయిష్టతను ప్రదర్శిస్తున్నారు. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆటగాళ్లంతా కరచాలనం చేసుకొనేందుకు వచ్చారు. అయితే, X, Y మాత్రం షేక్హ్యాండ్ ఇచ్చుకునేందుకు కూడా ప్రయత్నించలేదు. వారిద్దరూ మాట్లాడుకోవాలనుకోవడం లేదు. ఇప్పుడు వారికి ఏమైనా సలహాలు ఇస్తారా? అని అడుగుతుంటారు. అయితే, నాకున్న రిలేషన్స్ ఆధారంగానే మాట్లాడతా. నేను మాట్లాడకూడదనుకుంటే దాటవేస్తాను’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి