Ravindra jadeja: సీఎస్కేకు మద్దతు ఇవ్వండి.. గుజరాత్ అభిమానులకు జడేజా విజ్ఞప్తి
డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్తో చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) తొలి మ్యాచ్లో తలపడనుంది. సీఎస్కే స్టార్ ఆటగాడు రవీంద్ర జడేజా (Ravindra Jadeja) సొంత రాష్ట్రమైన గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ ఆడబోతుండటం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఐపీఎల్ (IPL 2023) 16వ సీజన్ టోర్నీకి సిద్ధమైపోయాడు. ఇప్పటికే జట్టు సభ్యులతో ప్రాక్టీస్ చేసిన జడ్డూ (Ravindra Jadeja) తాజాగా అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్తో జరిగే మ్యాచ్పైనా ప్రత్యేకంగా మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను చెన్నైసూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ యూట్యూబ్లో విడుదల చేసింది. తమ జట్టుకు మద్దతు ఇవ్వాలని గుజరాత్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు.
‘‘కొవిడ్ తర్వాత భారీ సంఖ్యలో ప్రేక్షకుల మధ్య ఆడుతున్న తొలి సీజన్ ఇదే కావడం విశేషం. అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మ్యాచ్లను వీక్షించేందుకు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి స్టేడియాల్లో ఆడటం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ అతి పెద్ద మైదానంలో ఆడబోతుండటం మరింత ఉత్సాహంగా ఉంది. అయితే, గుజరాత్లోని సీఎస్కే అభిమానులకు ఓ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి ఒక్కరూ వచ్చి చెన్నైజట్టుకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నా. ఇక ఈ మైదానంలో ఇటీవలే ఆసీస్తో టెస్టు మ్యాచ్ ఆడిన అనుభవం ఉంది. అప్పుడు భారీగానే అభిమానులు మ్యాచ్ కోసం వచ్చారు. హోం గ్రౌండ్లో సొంత జట్టుకు మద్దతుగా అభిమానులు వస్తుంటారు. అలా ఉండటం కూడా గర్వకారణం. అయితే, ఇప్పుడు ఈ మ్యాచ్కు మాత్రం గుజరాత్ అభిమానులు చెన్నై సూపర్ కింగ్స్కు సపోర్ట్ చేయాలని కోరుతున్నా’’ అని జడేజా తెలిపాడు. అయితే.. గుజరాత్తో తొలి మ్యాచ్లో కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆడటం ఇంకా అనుమానంగానే ఉంది. ధోనీ లేకపోతే.. జడ్డూ నాయకత్వం వహించే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..