2013 Champions Trophy: ధోనీ నమ్మకాన్ని నిలబెట్టిన ఇషాంత్, జడ్డూ, అశ్విన్
అంతర్జాతీయ టోర్నీల్లో టీమ్ఇండియా చివరిసారి ట్రోఫీ సాధించి నేటికి 9 ఏళ్లు గడుస్తున్నాయి. ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ లాంటి....
అంతర్జాతీయ టోర్నీల్లో టీమ్ఇండియా చివరిసారి ట్రోఫీ సాధించి నేటికి 9 ఏళ్లు గడుస్తున్నాయి. ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో టీమ్ఇండియా తక్కువ స్కోరే చేసినా కెప్టెన్ ధోనీ ధైర్యం.. ఆటగాళ్ల పట్టుదలతో విజయం సాధించింది. ముఖ్యంగా ధోనీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఇషాంత్, జడేజా, అశ్విన్.. ఓడిపోయే మ్యాచ్ను గెలిపించారు. ఆ మధుర క్షణాలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
టాస్ ఓడి.. బ్యాటింగ్లో తడబడి..
బర్మింగ్హామ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాను.. ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. బ్రాడ్, రవి బొపారా, జేమ్స్ అండర్సన్ వంటి స్టార్ బౌలర్లు చెలరేగడంతో టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ (9), దినేశ్ కార్తీక్ (6), సురేశ్ రైనా (1), ధోనీ (0) పూర్తిగా విఫలమైనా శిఖర్ ధావన్ (31), విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) పోరాడటంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. ముఖ్యంగా 14 నుంచి 19 ఓవర్ల మధ్య కోహ్లీ, జడేజా ఆరో వికెట్కు 47 పరుగులు జోడించారు. లేకపోతే జట్టు పరిస్థితి మరింత ఘోరమయ్యేది చివరికి 129/7తో నిలిచి ఇంగ్లాండ్ ముందు ఊరించే లక్ష్యం నిర్దేశించారు.
ఇంగ్లాండ్ కూడా అంతంతే..
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా ఛేదనలో తడబడింది. భారత బౌలర్లు ఆదిలో వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టుకు కష్టమైంది. ఉమేశ్ యాదవ్ రెండో ఓవర్లోనే అలిస్టర్ కుక్ (2) వంటి ప్రమాదకర బ్యాటర్ను పెవిలియన్కు పంపగా.. తర్వాత అశ్విన్, జడేజా మెరిశారు. దీంతో జొనాథన్ ట్రాట్ (20), జోరూట్ (7), ఇయాన్ బెల్(13) వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. అయితే, నాలుగు వికెట్లు పడ్డాక జోడీ కట్టిన ఇయాన్ మోర్గాన్ (33), రవిబొపారా (30) నిలకడగా ఆడారు. వీరిద్దరూ సుమారు 9 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి వికెట్లు కాపాడుకుంటూనే మెల్లి మెల్లిగా లక్ష్యం వైపు సాగారు. దీంతో 17 ఓవర్లకు ఇంగ్లాండ్ 102/4 స్కోర్తో నిలిచి తేలిగ్గా విజయం సాధించేలా కనిపించింది.
మలుపుతిప్పిన ఇషాంత్..
ఇక అంతా ఇంగ్లాండ్కు ట్రోఫీ ఖాయం అనుకున్న సమయంలో కెప్టెన్ ధోనీ బంతిని ఇషాంత్కు అప్పగించాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్లో రెండో బంతికి సిక్సర్ కొట్టిన మోర్గాన్ మూడో బంతిని మిడ్వికెట్ మీదుగా ఇంకో షాట్ ఆడబోయాడు. బంతి బ్యాట్ అంచున తాకడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ చేతుల్లో పడింది. దీంతో 64 పరుగుల కీలక ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఇషాంత్ మరుసటి బంతిని షార్ట్పిచ్గా వేయడంతో బొపార సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతి బ్యాట్కు తాకి గాలిలోకి లేవడంతో అశ్విన్ మరోసారి క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 18 ఓవర్లకు 111/6తో నిలిచింది.
జడేజాను ప్రయోగించి..
ఇక ధోనీ మరోసారి ప్రయోగం చేసి 19వ ఓవర్ను జడేజాతో బౌలింగ్ చేయించాడు. అప్పటికి ఇంగ్లాండ్ గెలవాలంటే 12 బంతుల్లో 19 పరుగులే కావాలి. క్రీజులో బట్లర్, బ్రెస్నన్ ఉండటంతో పాటు చేతిలో ఇంకో నాలుగు వికెట్లు ఉండటంతో ఇంగ్లాండ్ విజయావకాశలే ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో జడేజా వేసిన తొలి బంతికి బ్రెస్నన్ (2) సింగిల్ తీశాడు. మరుసటి బంతికే బట్లర్ ఔట్. అతడు ఎదుర్కొన్న తొలి బంతికే మిడిల్ స్టంప్ ఎగిరింది. దీంతో ప్రమాదకర బట్లర్ డకౌట్గా వెనుదిరిగాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ (7) సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతిని స్వీప్ షాట్ ఆడిన బ్రెస్నన్ ఎల్బీడబ్ల్యూగా అనిపించడంతో టీమ్ఇండియా అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే, అదే సమయంలో చురుగ్గా ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ సింగిల్ కోసం వెళ్లిన బ్రెస్నన్ను రనౌట్ చేశాడు. తర్వాత రెండు సింగిల్స్ మాత్రమే రావడంతో జడ్డూ ఆ ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు.
టీమ్ఇండియా విజయోత్సాహం..
ఇంగ్లాండ్ చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా ధోనీ బంతిని అశ్విన్కు ఇచ్చాడు. తొలి బంతికి పరుగులు చేయలేని బ్రాడ్ రెండో బంతికి బౌండరీ బాది.. మూడో బంతికి సింగిల్ తీశాడు. తర్వాత ట్రెడ్వెల్ నాలుగు, ఐదు బంతులకు రెండేసి పరుగులు చేయగా ఇంగ్లాండ్ స్కోర్ 125/8కి చేరుకొంది. దీంతో ఆఖరి బంతికి ఇంగ్లాండ్కు 5 పరుగులు అవసరం కాగా ఉత్కంఠ నెలకొంది. కానీ, అశ్విన్ మాయ చేసి బౌలింగ్ చేయడంతో చివరికి పరుగులేమీ రాలేదు. దీంతో టీమ్ఇండియా 5 పరుగుల స్వల్ప తేడాతో అతిగొప్ప విజయాన్ని నమోదు చేసింది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం