2013 Champions Trophy: ధోనీ నమ్మకాన్ని నిలబెట్టిన ఇషాంత్, జడ్డూ, అశ్విన్
అంతర్జాతీయ టోర్నీల్లో టీమ్ఇండియా చివరిసారి ట్రోఫీ సాధించి నేటికి 9 ఏళ్లు గడుస్తున్నాయి. ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ లాంటి....
అంతర్జాతీయ టోర్నీల్లో టీమ్ఇండియా చివరిసారి ట్రోఫీ సాధించి నేటికి 9 ఏళ్లు గడుస్తున్నాయి. ధోనీ సారథ్యంలోని భారత జట్టు ఇంగ్లాండ్ లాంటి బలమైన జట్టును దాని సొంతగడ్డపైనే ఓడించిన విషయం తెలిసిందే. నాటి ఫైనల్లో టీమ్ఇండియా తక్కువ స్కోరే చేసినా కెప్టెన్ ధోనీ ధైర్యం.. ఆటగాళ్ల పట్టుదలతో విజయం సాధించింది. ముఖ్యంగా ధోనీ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఇషాంత్, జడేజా, అశ్విన్.. ఓడిపోయే మ్యాచ్ను గెలిపించారు. ఆ మధుర క్షణాలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
టాస్ ఓడి.. బ్యాటింగ్లో తడబడి..
బర్మింగ్హామ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, ఇంగ్లాండ్ జట్లు తలపడ్డాయి. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాను.. ఆతిథ్య జట్టు తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. బ్రాడ్, రవి బొపారా, జేమ్స్ అండర్సన్ వంటి స్టార్ బౌలర్లు చెలరేగడంతో టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ (9), దినేశ్ కార్తీక్ (6), సురేశ్ రైనా (1), ధోనీ (0) పూర్తిగా విఫలమైనా శిఖర్ ధావన్ (31), విరాట్ కోహ్లీ (43), రవీంద్ర జడేజా (33) పోరాడటంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. ముఖ్యంగా 14 నుంచి 19 ఓవర్ల మధ్య కోహ్లీ, జడేజా ఆరో వికెట్కు 47 పరుగులు జోడించారు. లేకపోతే జట్టు పరిస్థితి మరింత ఘోరమయ్యేది చివరికి 129/7తో నిలిచి ఇంగ్లాండ్ ముందు ఊరించే లక్ష్యం నిర్దేశించారు.
ఇంగ్లాండ్ కూడా అంతంతే..
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ కూడా ఛేదనలో తడబడింది. భారత బౌలర్లు ఆదిలో వికెట్లు తీయడంతో ఆతిథ్య జట్టుకు కష్టమైంది. ఉమేశ్ యాదవ్ రెండో ఓవర్లోనే అలిస్టర్ కుక్ (2) వంటి ప్రమాదకర బ్యాటర్ను పెవిలియన్కు పంపగా.. తర్వాత అశ్విన్, జడేజా మెరిశారు. దీంతో జొనాథన్ ట్రాట్ (20), జోరూట్ (7), ఇయాన్ బెల్(13) వంటి టాప్ ఆర్డర్ బ్యాటర్లు కూడా రాణించలేకపోయారు. అయితే, నాలుగు వికెట్లు పడ్డాక జోడీ కట్టిన ఇయాన్ మోర్గాన్ (33), రవిబొపారా (30) నిలకడగా ఆడారు. వీరిద్దరూ సుమారు 9 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి వికెట్లు కాపాడుకుంటూనే మెల్లి మెల్లిగా లక్ష్యం వైపు సాగారు. దీంతో 17 ఓవర్లకు ఇంగ్లాండ్ 102/4 స్కోర్తో నిలిచి తేలిగ్గా విజయం సాధించేలా కనిపించింది.
మలుపుతిప్పిన ఇషాంత్..
ఇక అంతా ఇంగ్లాండ్కు ట్రోఫీ ఖాయం అనుకున్న సమయంలో కెప్టెన్ ధోనీ బంతిని ఇషాంత్కు అప్పగించాడు. ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్లో రెండో బంతికి సిక్సర్ కొట్టిన మోర్గాన్ మూడో బంతిని మిడ్వికెట్ మీదుగా ఇంకో షాట్ ఆడబోయాడు. బంతి బ్యాట్ అంచున తాకడంతో అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న అశ్విన్ చేతుల్లో పడింది. దీంతో 64 పరుగుల కీలక ఐదో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. ఇక ఇషాంత్ మరుసటి బంతిని షార్ట్పిచ్గా వేయడంతో బొపార సరిగ్గా అంచనా వేయలేకపోయాడు. బంతి బ్యాట్కు తాకి గాలిలోకి లేవడంతో అశ్విన్ మరోసారి క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్ 18 ఓవర్లకు 111/6తో నిలిచింది.
జడేజాను ప్రయోగించి..
ఇక ధోనీ మరోసారి ప్రయోగం చేసి 19వ ఓవర్ను జడేజాతో బౌలింగ్ చేయించాడు. అప్పటికి ఇంగ్లాండ్ గెలవాలంటే 12 బంతుల్లో 19 పరుగులే కావాలి. క్రీజులో బట్లర్, బ్రెస్నన్ ఉండటంతో పాటు చేతిలో ఇంకో నాలుగు వికెట్లు ఉండటంతో ఇంగ్లాండ్ విజయావకాశలే ఎక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో జడేజా వేసిన తొలి బంతికి బ్రెస్నన్ (2) సింగిల్ తీశాడు. మరుసటి బంతికే బట్లర్ ఔట్. అతడు ఎదుర్కొన్న తొలి బంతికే మిడిల్ స్టంప్ ఎగిరింది. దీంతో ప్రమాదకర బట్లర్ డకౌట్గా వెనుదిరిగాడు. మూడో బంతికి క్రీజులోకి వచ్చిన స్టువర్ట్ బ్రాడ్ (7) సింగిల్ తీశాడు. ఇక నాలుగో బంతిని స్వీప్ షాట్ ఆడిన బ్రెస్నన్ ఎల్బీడబ్ల్యూగా అనిపించడంతో టీమ్ఇండియా అప్పీల్ చేసింది. అంపైర్ నాటౌటిచ్చాడు. అయితే, అదే సమయంలో చురుగ్గా ఫీల్డింగ్ చేసిన రోహిత్ శర్మ సింగిల్ కోసం వెళ్లిన బ్రెస్నన్ను రనౌట్ చేశాడు. తర్వాత రెండు సింగిల్స్ మాత్రమే రావడంతో జడ్డూ ఆ ఓవర్లో నాలుగు పరుగులే ఇచ్చాడు.
టీమ్ఇండియా విజయోత్సాహం..
ఇంగ్లాండ్ చివరి ఓవర్లో విజయానికి 15 పరుగులు అవసరం కాగా ధోనీ బంతిని అశ్విన్కు ఇచ్చాడు. తొలి బంతికి పరుగులు చేయలేని బ్రాడ్ రెండో బంతికి బౌండరీ బాది.. మూడో బంతికి సింగిల్ తీశాడు. తర్వాత ట్రెడ్వెల్ నాలుగు, ఐదు బంతులకు రెండేసి పరుగులు చేయగా ఇంగ్లాండ్ స్కోర్ 125/8కి చేరుకొంది. దీంతో ఆఖరి బంతికి ఇంగ్లాండ్కు 5 పరుగులు అవసరం కాగా ఉత్కంఠ నెలకొంది. కానీ, అశ్విన్ మాయ చేసి బౌలింగ్ చేయడంతో చివరికి పరుగులేమీ రాలేదు. దీంతో టీమ్ఇండియా 5 పరుగుల స్వల్ప తేడాతో అతిగొప్ప విజయాన్ని నమోదు చేసింది.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు