Ravindra Jadeja: టెస్టుల్లో 3000 పరుగులు.. 250 వికెట్లు.. ‘జడ్డూ’ ది గ్రేట్
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్ అతడు. బ్యాట్, బంతితో పాటు ఫీల్డింగ్లో మెరుపులు మెరిపిస్తాడు. తాజాగా ఇంగ్లాండ్తో మూడో టెస్టులో ఓ అరుదైన ఘనతను సాధించాడు.
బ్యాటింగ్లో జట్టు కష్టాల్లో ఉందా.. అయితే మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్లో వచ్చి ఆదుకుంటాడు. జట్టుకు వికెట్లు కావాలా.. అయితే బంతి అందుకుని తన స్పిన్తో మాయ చేస్తాడు. చురుకైన ఫీల్డర్ కావాలా.. అయితే తానున్నానంటూ మైదానంలో మెరుపు వేగంతో సాగుతాడు. అతను ఇంకెవరో కాదు.. టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతితో, బ్యాట్తో సత్తా చాటుతున్న ఈ ప్రపంచ నంబర్వన్ టెస్టు ఆల్రౌండర్ తాజాగా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 3 వేల పరుగులు చేయడంతో పాటు 250 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కపిల్దేవ్, అశ్విన్ అతనికంటే ముందున్నారు. 70వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న జడేజా ఖాతాలో 3005 పరుగులు, 280 వికెట్లున్నాయి.
గాయాలను దాటి..
ఇటీవల కాలంలో జడేజా తరచూ గాయాల బారిన పడుతున్నాడు. టీమ్ఇండియా ఆడిన చాలా టెస్టు మ్యాచ్లకు దూరమయ్యాడు. కానీ గాయపడిన ప్రతిసారీ పట్టుదలతో కోలుకుంటూ, బలంగా పుంజుకుంటున్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ, ఆడిన ప్రతి మ్యాచ్లోనూ జడేజా తనదైన ముద్ర కచ్చితంగా వేస్తున్నాడు. గాయంతో విశాఖపట్నంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన అతను.. తిరిగి కోలుకోవడమే కాదు మూడో టెస్టు కోసం జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. 2012లో టెస్టు అరంగేట్రం చేసిన 35 ఏళ్ల జడ్డూ.. 2019 నుంచి అత్యుత్తమ ఆటతీరుతో సాగుతున్నాడు. ఆల్రౌండర్గా జడేజా 2.0 వర్షన్ను చూపిస్తున్నాడు. 2019 నుంచి 30 టెస్టుల్లో 44.47 సగటుతో 1601 పరుగులు చేశాడు. 26.26 సగటుతో 90 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో అయితే మరింత ప్రమాదకరంగా మారాడు. 2019 నుంచి భారత్లో 14 టెస్టులాడిన జడ్డూ.. 54.43 సగటుతో 871 పరుగులు చేశాడు. 24.24 సగటుతో 55 వికెట్లు సాధించాడు. ఓవరాల్గా స్వదేశంలో 42 టెస్టుల్లో 41.69 సగటుతో 1793 పరుగులు చేశాడు. 21.04 సగటుతో 199 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్లో స్పెషలిస్టు బ్యాటర్ తరహాలో, బౌలింగ్లో ప్రధాన బౌలర్గా సాగుతున్నాడు.
సంధి దశలో..
భారత జట్టు సంధి దశలో ఉన్న ఈ తరుణంలో టాప్ఆర్డర్లో మార్పులు జరుగుతున్నాయి. కొత్త కుర్రాళ్లు వస్తున్నారు. కొన్నిసార్లు టాప్ఆర్డర్ నిలదొక్కుకోలేకపోతోంది. మిడిలార్డరూ విఫలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. బజ్బాల్ అంటూ ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతున్న ఈ రోజుల్లో జడ్డూ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అసలైన టెస్టు బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. 33కే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో పట్టుదలతో క్రీజులో నిలిచాడు. రాజ్కోట్ రాజకుమారుడైన జడ్డూ తన సొంతగడ్డపై పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో నాలుగో టెస్టు శతకాన్ని అందుకున్నాడు. రోహిత్తో కలిసి నాలుగో వికెట్కు 204 పరుగులు జోడించి జట్టును నిలబెట్టిన అతను.. సర్ఫరాజ్తో అయిదో వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. సర్ఫరాజ్ రనౌట్లో తప్పు తనదే అని ఒప్పుకోవడం జడ్డూ వ్యక్తిత్వానికి నిదర్శనం.
రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జడ్డూకు గొప్ప రికార్డుంది. 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఏకంగా 142.18 సగటుతో అతను 1564 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలున్నాయి. అలాగే 20 కంటే తక్కువ సగటుతో 60 వికెట్లూ తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అయితే 3 మ్యాచ్ల్లో 128 సగటుతో రెండు శతకాలతో సహా 256 పరుగులు చేశాడు. ఇక జడ్డూకు ఇంగ్లాండ్ ప్రియ ప్రత్యర్థి. ఈ జట్టుపై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన 15వ భారత ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. ఇప్పటివరకూ ఆ జట్టుతో ఆడిన 18 మ్యాచ్ల్లో 1000 పరుగులు, 56 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?