Ravindra Jadeja: టెస్టుల్లో 3000 పరుగులు.. 250 వికెట్లు.. ‘జడ్డూ’ ది గ్రేట్
ప్రపంచంలోనే అత్యుత్తమ ఆల్రౌండర్ అతడు. బ్యాట్, బంతితో పాటు ఫీల్డింగ్లో మెరుపులు మెరిపిస్తాడు. తాజాగా ఇంగ్లాండ్తో మూడో టెస్టులో ఓ అరుదైన ఘనతను సాధించాడు.
బ్యాటింగ్లో జట్టు కష్టాల్లో ఉందా.. అయితే మిడిలార్డర్, లోయర్ మిడిలార్డర్లో వచ్చి ఆదుకుంటాడు. జట్టుకు వికెట్లు కావాలా.. అయితే బంతి అందుకుని తన స్పిన్తో మాయ చేస్తాడు. చురుకైన ఫీల్డర్ కావాలా.. అయితే తానున్నానంటూ మైదానంలో మెరుపు వేగంతో సాగుతాడు. అతను ఇంకెవరో కాదు.. టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బంతితో, బ్యాట్తో సత్తా చాటుతున్న ఈ ప్రపంచ నంబర్వన్ టెస్టు ఆల్రౌండర్ తాజాగా మరో రికార్డు ఖాతాలో వేసుకున్నాడు. టెస్టుల్లో 3 వేల పరుగులు చేయడంతో పాటు 250 కంటే ఎక్కువ వికెట్లు పడగొట్టిన మూడో భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. కపిల్దేవ్, అశ్విన్ అతనికంటే ముందున్నారు. 70వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న జడేజా ఖాతాలో 3005 పరుగులు, 280 వికెట్లున్నాయి.
గాయాలను దాటి..
ఇటీవల కాలంలో జడేజా తరచూ గాయాల బారిన పడుతున్నాడు. టీమ్ఇండియా ఆడిన చాలా టెస్టు మ్యాచ్లకు దూరమయ్యాడు. కానీ గాయపడిన ప్రతిసారీ పట్టుదలతో కోలుకుంటూ, బలంగా పుంజుకుంటున్నాడు. అవకాశం వచ్చిన ప్రతిసారీ, ఆడిన ప్రతి మ్యాచ్లోనూ జడేజా తనదైన ముద్ర కచ్చితంగా వేస్తున్నాడు. గాయంతో విశాఖపట్నంలో ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్టుకు దూరమైన అతను.. తిరిగి కోలుకోవడమే కాదు మూడో టెస్టు కోసం జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. 2012లో టెస్టు అరంగేట్రం చేసిన 35 ఏళ్ల జడ్డూ.. 2019 నుంచి అత్యుత్తమ ఆటతీరుతో సాగుతున్నాడు. ఆల్రౌండర్గా జడేజా 2.0 వర్షన్ను చూపిస్తున్నాడు. 2019 నుంచి 30 టెస్టుల్లో 44.47 సగటుతో 1601 పరుగులు చేశాడు. 26.26 సగటుతో 90 వికెట్లు పడగొట్టాడు. స్వదేశంలో అయితే మరింత ప్రమాదకరంగా మారాడు. 2019 నుంచి భారత్లో 14 టెస్టులాడిన జడ్డూ.. 54.43 సగటుతో 871 పరుగులు చేశాడు. 24.24 సగటుతో 55 వికెట్లు సాధించాడు. ఓవరాల్గా స్వదేశంలో 42 టెస్టుల్లో 41.69 సగటుతో 1793 పరుగులు చేశాడు. 21.04 సగటుతో 199 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. బ్యాటింగ్లో స్పెషలిస్టు బ్యాటర్ తరహాలో, బౌలింగ్లో ప్రధాన బౌలర్గా సాగుతున్నాడు.
సంధి దశలో..
భారత జట్టు సంధి దశలో ఉన్న ఈ తరుణంలో టాప్ఆర్డర్లో మార్పులు జరుగుతున్నాయి. కొత్త కుర్రాళ్లు వస్తున్నారు. కొన్నిసార్లు టాప్ఆర్డర్ నిలదొక్కుకోలేకపోతోంది. మిడిలార్డరూ విఫలమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జడేజా ఆపద్బాంధవుడిగా నిలుస్తున్నాడు. బజ్బాల్ అంటూ ఇంగ్లాండ్ దూకుడుగా ఆడుతున్న ఈ రోజుల్లో జడ్డూ మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్లో అసలైన టెస్టు బ్యాటింగ్ నైపుణ్యాలను ప్రదర్శించాడు. 33కే 3 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడిన సమయంలో పట్టుదలతో క్రీజులో నిలిచాడు. రాజ్కోట్ రాజకుమారుడైన జడ్డూ తన సొంతగడ్డపై పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకుంటూ కెరీర్లో నాలుగో టెస్టు శతకాన్ని అందుకున్నాడు. రోహిత్తో కలిసి నాలుగో వికెట్కు 204 పరుగులు జోడించి జట్టును నిలబెట్టిన అతను.. సర్ఫరాజ్తో అయిదో వికెట్కు 77 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. సర్ఫరాజ్ రనౌట్లో తప్పు తనదే అని ఒప్పుకోవడం జడ్డూ వ్యక్తిత్వానికి నిదర్శనం.
రాజ్కోట్లోని నిరంజన్ షా స్టేడియంలో జడ్డూకు గొప్ప రికార్డుంది. 17 ఫస్ట్క్లాస్ మ్యాచ్ల్లో ఏకంగా 142.18 సగటుతో అతను 1564 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలున్నాయి. అలాగే 20 కంటే తక్కువ సగటుతో 60 వికెట్లూ తీసుకున్నాడు. అంతర్జాతీయ టెస్టుల్లో అయితే 3 మ్యాచ్ల్లో 128 సగటుతో రెండు శతకాలతో సహా 256 పరుగులు చేశాడు. ఇక జడ్డూకు ఇంగ్లాండ్ ప్రియ ప్రత్యర్థి. ఈ జట్టుపై టెస్టుల్లో 1000 పరుగులు చేసిన 15వ భారత ఆటగాడిగా జడ్డూ నిలిచాడు. ఇప్పటివరకూ ఆ జట్టుతో ఆడిన 18 మ్యాచ్ల్లో 1000 పరుగులు, 56 వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్