IPL 2024: ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో కొద్ది మార్పులుంటాయి: డీకోడ్ చేసిన రాయుడు
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ 17వ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. మరో 43 పరుగులు చేస్తే తన పేరిట ఓ రికార్డు నమోదవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ ఎలా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో డెత్ ఓవర్లలో హార్డ్ హిట్టింగ్ చేసి కీలక పరుగులు సాధించాడు. అయితే, ఈసారి మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వ్యాఖ్యానించాడు. గత సీజన్ వరకు ఐపీఎల్లో సీఎస్కే జట్టుకు ఆడిన అంబటి రాయుడు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. మరో 43 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5వేల పరుగులు చేసిన బ్యాటర్గా ధోనీ అవతరిస్తాడు.
‘‘ధోనీ భాయ్ తీసుకొనే నిర్ణయాలు ఎవరికీ తెలియదు. గత కొన్ని సీజన్లలో అతడి గురించి తెలుసుకున్నాను కాబట్టి.. చెబుతున్నా. బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు ఉంటాయి. కానీ, ధోనీ టాప్ ఆర్డర్కు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఏడో స్థానంలో వస్తున్న అతడు అవసరమైతే ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడు. పైవరుసలో మాత్రం కుర్రాళ్లకే అవకాశం ఇస్తాడు. చాలామంది ధోనీకిదే చివరి సీజన్ అని చెబుతున్నారు. కానీ, అతడి ఫిట్నెస్ను చూస్తే మాత్రం మరో ఏడాది కూడా ఆడతాడు’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు.
ధోనీని ఎవరూ పునరావృతం చేయలేరు: ధ్రువ్
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసి సత్తా చాటిన ధ్రువ్ జురెల్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీతో పోల్చాడు. తాజాగా సన్నీ వ్యాఖ్యలపై ధ్రువ్ స్పందించాడు. ‘‘సునీల్ గావస్కర్కు ధన్యవాదాలు. నన్ను ధోనీతో పోల్చారు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం ధోనీని ఎవరూ అందుకోలేరని భావిస్తా. భారత క్రికెట్కు అతడు చేసిన దాంట్లో కొంత చేసినా చాలు. ధోనీ అంటే ఒకరే ఉంటాడు. నేను మాత్రం ధ్రువ్లా ఉండేందుకు ప్రయత్నిస్తా. ధోనీ ఓ దిగ్గజం. అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగుతా’’ అని ధ్రువ్ (Dhruv Jurel) తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం