IPL 2024: ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో కొద్ది మార్పులుంటాయి: డీకోడ్ చేసిన రాయుడు
సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) ఐపీఎల్ 17వ సీజన్ కోసం సిద్ధమవుతున్నాడు. మరో 43 పరుగులు చేస్తే తన పేరిట ఓ రికార్డు నమోదవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ ఎలా చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. గత సీజన్లో డెత్ ఓవర్లలో హార్డ్ హిట్టింగ్ చేసి కీలక పరుగులు సాధించాడు. అయితే, ఈసారి మాత్రం బ్యాటింగ్ ఆర్డర్లో ముందుకొచ్చే అవకాశం ఉందని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) వ్యాఖ్యానించాడు. గత సీజన్ వరకు ఐపీఎల్లో సీఎస్కే జట్టుకు ఆడిన అంబటి రాయుడు ఇప్పటికే వీడ్కోలు పలికాడు. మరో 43 పరుగులు చేస్తే సీఎస్కే తరఫున 5వేల పరుగులు చేసిన బ్యాటర్గా ధోనీ అవతరిస్తాడు.
‘‘ధోనీ భాయ్ తీసుకొనే నిర్ణయాలు ఎవరికీ తెలియదు. గత కొన్ని సీజన్లలో అతడి గురించి తెలుసుకున్నాను కాబట్టి.. చెబుతున్నా. బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు ఉంటాయి. కానీ, ధోనీ టాప్ ఆర్డర్కు వచ్చే అవకాశం ఉండదు. ఇప్పుడు ఏడో స్థానంలో వస్తున్న అతడు అవసరమైతే ఐదు లేదా ఆరో స్థానంలో ఆడతాడు. పైవరుసలో మాత్రం కుర్రాళ్లకే అవకాశం ఇస్తాడు. చాలామంది ధోనీకిదే చివరి సీజన్ అని చెబుతున్నారు. కానీ, అతడి ఫిట్నెస్ను చూస్తే మాత్రం మరో ఏడాది కూడా ఆడతాడు’’ అని రాయుడు వ్యాఖ్యానించాడు.
ధోనీని ఎవరూ పునరావృతం చేయలేరు: ధ్రువ్
ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్లో అరంగేట్రం చేసి సత్తా చాటిన ధ్రువ్ జురెల్పై క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. ‘కెప్టెన్ కూల్’ ఎంఎస్ ధోనీతో పోల్చాడు. తాజాగా సన్నీ వ్యాఖ్యలపై ధ్రువ్ స్పందించాడు. ‘‘సునీల్ గావస్కర్కు ధన్యవాదాలు. నన్ను ధోనీతో పోల్చారు. కానీ, వ్యక్తిగతంగా మాత్రం ధోనీని ఎవరూ అందుకోలేరని భావిస్తా. భారత క్రికెట్కు అతడు చేసిన దాంట్లో కొంత చేసినా చాలు. ధోనీ అంటే ఒకరే ఉంటాడు. నేను మాత్రం ధ్రువ్లా ఉండేందుకు ప్రయత్నిస్తా. ధోనీ ఓ దిగ్గజం. అతడిని ఆదర్శంగా తీసుకుని ముందుకుసాగుతా’’ అని ధ్రువ్ (Dhruv Jurel) తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!