Virat Kohli: విరాట్ కోహ్లీకి గాయం.. అప్డేట్ ఇచ్చిన ఆర్సీబీ హెడ్ కోచ్
గుజరాత్తో జరిగిన మ్యాచ్లో విజయ్ శంకర్ క్యాచ్ను అందుకునే క్రమంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) గాయపడిన సంగతి తెలిసిందే. కోహ్లీ గాయంపై ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అప్డేట్ ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ (Virat Kohli) సూపర్ సెంచరీ బాదినా ఆర్సీబీ ఓటమిపాలైన విషయం తెలిసిందే. కోహ్లీ ఫీల్డింగ్లోనూ అదరగొట్టాడు. విజయ్ శంకర్ ఇచ్చిన క్యాచ్ను విరాట్ అద్భుతంగా అందుకున్నాడు. క్యాచ్ అందుకున్న తర్వాత మోకాలి నొప్పితో విరాట్ విలవిల్లాడాడు. ఫిజియో వచ్చి పరీక్షించిన అనంతరం కోహ్లీ కుంటుతూ మైదానాన్ని వీడాడు. చివరి ఐదు ఓవర్ల ఆటను డగౌట్లో కూర్చొని వీక్షించాడు. దీంతో విరాట్ గాయంపై అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీ గాయంపై ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ అప్డేట్ ఇచ్చాడు.
‘‘కోహ్లీ మోకాలి నొప్పితో బాధపడుతున్నాడు. కానీ, అది తీవ్రమైనది కాదనుకుంటున్నా. నాలుగు రోజుల వ్యవధిలో వరుసగా రెండు సెంచరీలు సాధించాడు. అతను బ్యాటింగ్తోనే కాకుండా ఫీల్డింగ్లోనూ జట్టుకు తన వంతు సహకారం అందించాలనుకునే వ్యక్తి. సన్రైజర్స్తో మ్యాచ్లో 40 ఓవర్లు, ఆఖరి మ్యాచ్ (గుజరాత్తో)లో 35 ఓవర్ల పాటు కోహ్లీ మైదానంలో ఉన్నాడు. అతను తన బెస్ట్ ఇస్తున్నాడు. అతడికి తగిలిన గాయం అంత తీవ్రమైనది కాదని భావిస్తున్నాను’’ అని సంజయ్ బంగర్ అన్నాడు. గుజరాత్పై ఓటమితో ఆర్సీబీ లీగ్ దశలో టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!