Hyderabad: హైదరాబాద్కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఇక లేనట్లే.. కారణాలేంటంటే..?
భారత టీ20 లీగ్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకునే క్రమంలో హైదరాబాద్ ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయాయి...
భారత టీ20 లీగ్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకునే క్రమంలో హైదరాబాద్ ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. సాంకేతికంగా ఇంకా అవకాశం ఉన్నా.. అది చాలా కష్టమే. గతరాత్రి కోల్కతాతో ఓటమి తర్వాత 10 పాయింట్లతోనే నిలిచిన హైదరాబాద్ ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టే వీలుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు వైఫల్యానికి గల కారణాలేంటంటే..
అవే తప్పటడుగులు..
హైదరాబాద్ చేసిన అతిపెద్ద తప్పు మాజీ సారథి డేవిడ్ వార్నర్ను వదులుకోవడం. అతడు గతేడాది తప్ప ప్రతి సీజన్లోనూ విశేషంగా రాణించాడు. మరోవైపు ఈ సీజన్లోనూ దిల్లీ తరఫున ఓపెనర్గా అదరగొడుతున్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో ప్రస్తుతం (427) మూడో స్థానంలో దూసుకుపోతున్నాడు. అలాంటి ఆటగాడిని ఒక్క సీజన్లో ఆడలేనంత మాత్రాన వదులుకోవడం నిజంగా పెద్ద తప్పిదమే. మరోవైపు స్పిన్ మాంత్రికుడు రషీద్ఖాన్నూ వదిలేసుకోవడం కూడా జట్టుకు భారీ నష్టాన్నే మిగిల్చింది. అతడు గుజరాత్ తరఫున బౌలింగ్తో (15) వికెట్లు తీస్తూనే లోయర్ ఆర్డర్లో అవసరమైనప్పుడు దంచికొడుతున్నాడు. దీంతో వీరిద్దర్నీ వదిలేసుకోవడం హైదరాబాద్ వైఫల్యానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వార్నర్, రషీద్ ఈ జట్టులోనే ఉండి ఇప్పుడు వేరే జట్ల తరఫున ఆడుతున్నట్లు ఆడి ఉంటే పరిస్థితులు కచ్చితంగా మరోలా ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
లోపించిన వ్యూహాలు..
ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలోనూ ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి ఆటగాళ్లను తీసుకోవాలి.. ఎవరికి ఎంత వెచ్చించాలనే విషయాలపై ఏమాత్రం వ్యూహాలు రచించలేదని స్పష్టంగా తెలుస్తోంది. కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్లను అట్టిపెట్టుకున్నా నటరాజన్, భువనేశ్వర్ను మళ్లీ కొనుగోలు చేయడం మంచి విషయమే. అయితే, కొందరు ఆటగాళ్లపై అతి నమ్మకం ఉంచిన హైదరాబాద్ టీమ్ భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. తీరా ఆ క్రికెటర్లు తాము తీసుకునే సొమ్ముకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు. అందులో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), నికోలస్ పూరన్ (10.75 కోట్లు), రోమారియో షెపర్డ్ (7.75). ఇక అభిషేక్ శర్మ (6.5 కోట్లు), రాహుల్ త్రిపాఠి (8.5) లాంటి ఆటగాళ్లు కూడా భారీ మొత్తం దక్కించుకున్నా ఫర్వాలేదనిపించారే తప్ప పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్లేఆఫ్స్కు చేరలేకపోవడంతో అవి మరింత రెట్టింపయ్యాయి.
విలియమ్సన్ కూడా విఫలం..
గతేడాది సీజన్ మధ్యలో వార్నర్ను కెప్టెన్గా తొలగించి అర్ధాంతరంగా కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అప్పటికి వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ తొలి ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయమే సాధించింది. అయితే, కెప్టెన్సీలో మార్పులు చేశాక కూడా జట్టులో ఎలాంటి ప్రభావం లేకపోయింది. విలియమ్సన్ నేతృత్వంలోనూ ఘోరంగా విఫలమైంది. అతడి సారథ్యంలో 8 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించింది. దీంతో హైదరాబాద్ కెప్టెన్గా విలియమ్సన్ కూడా పెద్దగా ఉపయోగపడలేదని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు బ్యాట్స్మన్గానూ పూర్తిగా తేలిపోయాడు. ఆడిన 12 మ్యాచ్ల్లో 18.91 సగటుతో 208 పరుగులే చేశాడు.
ఫినిషర్, స్పిన్ బౌలింగ్ లేక..
షినిషర్లుగా కొన్ని మ్యాచ్ల్లో నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు అడపాదడపా రాణించినా తర్వాత కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేశారు. తొలి రెండు ఓటముల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్లు గెలవడంలో వీళ్లే కీలకపాత్ర పోషించారు. కానీ, గత ఐదు మ్యాచ్ల్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడలేక చతికిల పడ్డారు. రోమియో షపర్డ్ లాంటి ఆటగాడిని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినా కేవలం రెండు మ్యాచ్ల్లోనే ఆడించారు. మరోవైపు స్పిన్ విభాగంలో భూతద్దం పెట్టి వెతికినా నాణ్యమైన స్పిన్నర్ లేకపోయాడు. అయితే, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ లాంటి పేసర్లే అంత ఇంతో నెట్టుకొచ్చారు. చివరి ఐదు మ్యాచ్ల్లో జట్టు సమష్టిగా విఫలమైంది. కేవలం అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి మాత్రమే ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున ఆకట్టుకున్నారు. ఇవన్నీ కలగలిసి చివరికి హైదరాబాద్ గతేడాది లాగే ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటి ముఖం పడుతోంది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
ద్రవిడ్ పదవీకాలం పొడిగింపుపై బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే, ఇంపాక్ట్ రూల్పైనా మాట్లాడారు. -
ఓడి గుజరాత్ ఇంటికెళ్తుందా? గెలిచి చెన్నై ముందుకెళ్తుందా?
ప్లేఆఫ్స్ రసవత్తరంగా మారుతున్న తరుణంలో చెన్నై మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. గుజరాత్ను అహ్మదాబాద్ వేదికగా ఢీకొట్టనుంది. -
హార్దిక్ కెప్టెన్సీలో అహంకారం కనిపిస్తోంది..: ఏబీడీ
హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని ఏబీ డివిలియర్స్ తప్పుపట్టాడు. సీనియర్లు ఉన్న జట్టుకు ఆ విధానం సరిపోదని తెలిపాడు. -
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
వరుసగా ఆరు ఓటముల తర్వాత పుంజుకున్న బెంగళూరు గత నాలుగు మ్యాచుల్లోనూ విజయం సాధించి స్వల్పంగా ఉన్న ప్లేఆఫ్స్ అవకాశాలను కాపాడుకుంది. -
బెంగళూరు ఉంది.. పంజాబ్ పోయింది
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లి క్యాచ్ను ఎవరైనా వదిలేస్తారా? అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. ఇలా అవకాశం ఇస్తే కోహ్లి ఊరుకుంటాడా? ఈ తప్పిదానికి పంజాబ్ భారీ మూల్యం చెల్లించుకునేలా విరాట్ విధ్వంసం సృష్టించాడు. రజత్, గ్రీన్ కూడా అదరగొట్టారు. ఛేదనలో ప్రతిఘటించినా పంజాబ్ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. -
లక్ష్యం ఒలింపిక్స్.. బరిలోకి నీరజ్
ఒలింపిక్స్ పసిడిని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా సాగుతున్న భారత స్టార్ జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా కఠిన సవాలుకు సిద్ధమయ్యాడు. శుక్రవారం ఆరంభమయ్యే ప్రతిష్ఠాత్మక డైమండ్ లీగ్ తొలి అంచె పోటీల్లో అతను డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలో దిగుతున్నాడు. -
బజ్రంగ్పై యూడబ్ల్యూడబ్ల్యూ సస్పెన్షన్
డోపింగ్ పరీక్ష చేయించుకోవడానికి నిరాకరించినందుకు స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాపై ఐక్య ప్రపంచ రెజ్లింగ్ (యూడబ్ల్యూడబ్ల్యూ) సస్పెన్షన్ వేటు వేసింది. -
అర్జున్కు తొలి విజయం
సూపర్బెట్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్లో తెలుగుతేజం ఇరిగేశి అర్జున్ తొలి విజయాన్ని అందుకున్నాడు. -
జ్యోతికి పసిడి
తెలుగమ్మాయి జ్యోతి యర్రాజి సత్తా చాటింది. నెదర్లాండ్స్లో జరిగిన హ్యారీ షట్లింగ్ అథ్లెటిక్స్లో ఆమె పసిడితో మెరిసింది. -
భారత్ క్లీన్స్వీప్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్ను భారత మహిళల జట్టు 5-0తో క్లీన్స్వీప్ చేసింది. గురువారం జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 21 పరుగుల తేడాతో నెగ్గింది.
తాజా వార్తలు (Latest News)
-
నేను రాజకీయాలకు అతీతం.. ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి: చిరు
-
వేరే అపార్ట్మెంట్లోకి ప్రవేశించి పోలీసుల కాల్పులు.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి మృతి
-
రిఫండ్లు చకచకా.. 6 గంటల్లోనే క్యాన్సిల్ టికెట్ల సొమ్ము!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా