Hyderabad: హైదరాబాద్కు ప్లేఆఫ్స్ అవకాశాలు ఇక లేనట్లే.. కారణాలేంటంటే..?
భారత టీ20 లీగ్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకునే క్రమంలో హైదరాబాద్ ప్లేఆఫ్స్ దారులు మూసుకుపోయాయి...
భారత టీ20 లీగ్ 15వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకునే క్రమంలో హైదరాబాద్ ప్లేఆఫ్స్ దారులు దాదాపుగా మూసుకుపోయాయి. సాంకేతికంగా ఇంకా అవకాశం ఉన్నా.. అది చాలా కష్టమే. గతరాత్రి కోల్కతాతో ఓటమి తర్వాత 10 పాయింట్లతోనే నిలిచిన హైదరాబాద్ ఈసారి కూడా ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటిముఖం పట్టే వీలుంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు వైఫల్యానికి గల కారణాలేంటంటే..
అవే తప్పటడుగులు..
హైదరాబాద్ చేసిన అతిపెద్ద తప్పు మాజీ సారథి డేవిడ్ వార్నర్ను వదులుకోవడం. అతడు గతేడాది తప్ప ప్రతి సీజన్లోనూ విశేషంగా రాణించాడు. మరోవైపు ఈ సీజన్లోనూ దిల్లీ తరఫున ఓపెనర్గా అదరగొడుతున్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో ప్రస్తుతం (427) మూడో స్థానంలో దూసుకుపోతున్నాడు. అలాంటి ఆటగాడిని ఒక్క సీజన్లో ఆడలేనంత మాత్రాన వదులుకోవడం నిజంగా పెద్ద తప్పిదమే. మరోవైపు స్పిన్ మాంత్రికుడు రషీద్ఖాన్నూ వదిలేసుకోవడం కూడా జట్టుకు భారీ నష్టాన్నే మిగిల్చింది. అతడు గుజరాత్ తరఫున బౌలింగ్తో (15) వికెట్లు తీస్తూనే లోయర్ ఆర్డర్లో అవసరమైనప్పుడు దంచికొడుతున్నాడు. దీంతో వీరిద్దర్నీ వదిలేసుకోవడం హైదరాబాద్ వైఫల్యానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఒకవేళ వార్నర్, రషీద్ ఈ జట్టులోనే ఉండి ఇప్పుడు వేరే జట్ల తరఫున ఆడుతున్నట్లు ఆడి ఉంటే పరిస్థితులు కచ్చితంగా మరోలా ఉండేవనడంలో ఎలాంటి సందేహం లేదు.
లోపించిన వ్యూహాలు..
ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలోనూ ఆ జట్టు యాజమాన్యం ఎలాంటి ఆటగాళ్లను తీసుకోవాలి.. ఎవరికి ఎంత వెచ్చించాలనే విషయాలపై ఏమాత్రం వ్యూహాలు రచించలేదని స్పష్టంగా తెలుస్తోంది. కేన్ విలియమ్సన్, ఉమ్రాన్ మాలిక్, అబ్దుల్ సమద్లను అట్టిపెట్టుకున్నా నటరాజన్, భువనేశ్వర్ను మళ్లీ కొనుగోలు చేయడం మంచి విషయమే. అయితే, కొందరు ఆటగాళ్లపై అతి నమ్మకం ఉంచిన హైదరాబాద్ టీమ్ భారీ మొత్తం వెచ్చించి మరీ కొనుగోలు చేసింది. తీరా ఆ క్రికెటర్లు తాము తీసుకునే సొమ్ముకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయారు. అందులో వాషింగ్టన్ సుందర్ (8.75 కోట్లు), నికోలస్ పూరన్ (10.75 కోట్లు), రోమారియో షెపర్డ్ (7.75). ఇక అభిషేక్ శర్మ (6.5 కోట్లు), రాహుల్ త్రిపాఠి (8.5) లాంటి ఆటగాళ్లు కూడా భారీ మొత్తం దక్కించుకున్నా ఫర్వాలేదనిపించారే తప్ప పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేదు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ప్లేఆఫ్స్కు చేరలేకపోవడంతో అవి మరింత రెట్టింపయ్యాయి.
విలియమ్సన్ కూడా విఫలం..
గతేడాది సీజన్ మధ్యలో వార్నర్ను కెప్టెన్గా తొలగించి అర్ధాంతరంగా కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. అప్పటికి వార్నర్ సారథ్యంలో హైదరాబాద్ తొలి ఆరు మ్యాచ్ల్లో కేవలం ఒక్క విజయమే సాధించింది. అయితే, కెప్టెన్సీలో మార్పులు చేశాక కూడా జట్టులో ఎలాంటి ప్రభావం లేకపోయింది. విలియమ్సన్ నేతృత్వంలోనూ ఘోరంగా విఫలమైంది. అతడి సారథ్యంలో 8 మ్యాచ్ల్లో రెండే విజయాలు సాధించింది. దీంతో హైదరాబాద్ కెప్టెన్గా విలియమ్సన్ కూడా పెద్దగా ఉపయోగపడలేదని స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు బ్యాట్స్మన్గానూ పూర్తిగా తేలిపోయాడు. ఆడిన 12 మ్యాచ్ల్లో 18.91 సగటుతో 208 పరుగులే చేశాడు.
ఫినిషర్, స్పిన్ బౌలింగ్ లేక..
షినిషర్లుగా కొన్ని మ్యాచ్ల్లో నికోలస్ పూరన్, ఎయిడెన్ మార్క్రమ్, శశాంక్ సింగ్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఆటగాళ్లు అడపాదడపా రాణించినా తర్వాత కీలక మ్యాచ్ల్లో చేతులెత్తేశారు. తొలి రెండు ఓటముల తర్వాత వరుసగా ఐదు మ్యాచ్లు గెలవడంలో వీళ్లే కీలకపాత్ర పోషించారు. కానీ, గత ఐదు మ్యాచ్ల్లో పరిస్థితులకు తగ్గట్టు ఆడలేక చతికిల పడ్డారు. రోమియో షపర్డ్ లాంటి ఆటగాడిని భారీ మొత్తం వెచ్చించి కొనుగోలు చేసినా కేవలం రెండు మ్యాచ్ల్లోనే ఆడించారు. మరోవైపు స్పిన్ విభాగంలో భూతద్దం పెట్టి వెతికినా నాణ్యమైన స్పిన్నర్ లేకపోయాడు. అయితే, నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, భువనేశ్వర్ కుమార్ లాంటి పేసర్లే అంత ఇంతో నెట్టుకొచ్చారు. చివరి ఐదు మ్యాచ్ల్లో జట్టు సమష్టిగా విఫలమైంది. కేవలం అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి మాత్రమే ఈ సీజన్లో హైదరాబాద్ తరఫున ఆకట్టుకున్నారు. ఇవన్నీ కలగలిసి చివరికి హైదరాబాద్ గతేడాది లాగే ప్లేఆఫ్స్ చేరకుండా ఇంటి ముఖం పడుతోంది.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం