Team India: కరోనా అంటే భయం లేదా.. బాధ్యతారాహిత్యమా?
రెండేళ్ల క్రితం కరోనా అంటే ప్రతిఒక్కరూ భయపడేవారు. ఎంతో ఫిట్నెస్ ఉండే క్రీడాకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా అంటే భయంలేకుండా పోయింది...
(Photo: Johns Twitter)
రెండేళ్ల క్రితం కరోనా అంటే ప్రతిఒక్కరూ భయపడేవారు. ఎంతో ఫిట్నెస్ ఉండే క్రీడాకారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారాయి. కరోనా అంటే భయంలేకుండా పోయింది. అందరిలోనూ నిర్లక్ష్యం.. మాకేమవుతుందిలే అనే ఉదాసీనత అలవడింది. అది ఇప్పుడు టీమ్ఇండియా క్రికెటర్లకూ పాకింది. అందువల్లే కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడినట్లు పలువురు అంటున్నారు.
రోహిత్ ఎందుకిలా..
ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా ఒక టెస్టు, మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. అందుకోసం కాస్త ముందుగానే అక్కడికి చేరుకుంది. ఈ క్రమంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారినపడ్డాడు. ప్రస్తుతానికి అతడికి ఒక్కడికే వైరస్ సోకిందని తెలుస్తుండగా రాబోయే రోజుల్లో మరెంత మంది ఆటగాళ్లకు పాజిటివ్గా తేలుతుందనేది చూడాలి. అయితే, ఇక్కడ రోహిత్కు పాజిటివ్గా తేలడానికి ప్రధాన కారణం .. వార్మప్ మ్యాచ్కు ముందు అతడు నిర్లక్ష్యంగా వ్యవహరించాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పర్యటనలో కచ్చితమైన బయోబబుల్ నిబంధనలు పాటించని నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు యథేచ్ఛగా బయటకు వెళ్లారు. మాస్కులు ధరించకుండానే అభిమానులతో ఫొటోలు దిగడం, షాపింగ్లకు వెళ్లడం లాంటివి చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయి. మరోవైపు ఇంగ్లాండ్లో రోజువారీ కేసులు భారీగా నమోదవుతున్నాయి. దీంతో ఆటగాళ్లు జాగ్రత్తలు పాటించాల్సింది పోయి.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి.
ముందే హెచ్చరించాల్సింది..
(Photo: Johns Twitter)
అయితే, ఆటగాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా బయటకు వెళ్లడం, షాపింగ్లు చేయడం, బయట అభిమానులను కలవడంపై విమర్శలు రావడంతో బీసీసీఐ హెచ్చరించింది. అనవసరంగా బయటకు వెళ్లరాదని, మాస్కులు ధరించాలని, బాధ్యతతో మెలగాలని సూచించింది. అదేదో ఆటగాళ్లు ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టినప్పుడే చేయాల్సిన పని అని.. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించాక ఇప్పుడు హెచ్చరిస్తే ఏం ప్రయోజనం అని అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలోనూ పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడ్డారు. అప్పుడు న్యూజిలాండ్తో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు ముందు కచ్చితమైన బయోబబుల్ ఏర్పాటు చేసి మ్యాచ్ను పూర్తి చేశారు. తర్వాత ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్కు నెల రోజులకుపైగా విరామం దొరకడంతో ఆటగాళ్లను కొద్ది రోజులు బబుల్ నుంచి విడుదల చేశారు. దీంతో పలువురు క్రికెటర్లు ఇతర క్రీడా ఈవెంట్లకు హాజరయ్యారు. ఆ సమయంలో రిషభ్ పంత్ వైరస్ బారినపడ్డాడు. టెస్టు సిరీస్ ప్రారంభమయ్యేనాటికి అందరూ క్షేమంగా ఉన్నా.. మళ్లీ ఐదో టెస్టుకు ముందు పలు కేసులు నమోదయ్యాయి.
ఆ మాత్రం ఆలోచించరా..?
(Photo: Johns Twitter)
ఇక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుముఖం పట్టినా అది ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. వాక్సినేషన్లు, బూస్టర్ డోసుల ప్రభావంతో ప్రాణనష్టం తగ్గినా ఇప్పటికి ప్రమాదం పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. అయితే.. కొందరు వైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం చూస్తున్నాం. ఈ క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఉండే పలువురు క్రికెటర్లు కూడా ఏమాత్రం నిబంధనలు పాటించడం లేదు. క్రికెట్ అనేది ఆటగాళ్లంతా కలిసి ఆడే గేమ్. ఒక్క ఆటగాడికి వైరస్ సోకితే అది మిగతా వారికి కూడా వ్యాపించే ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ నేపథ్యంలో గత అనుభవాల నుంచి కూడా టీమ్ఇండియా ఏమాత్రం నేర్చుకోలేదనే విషయం అర్థమవుతోంది. గతేడాది పూర్తికావాల్సిన ఐదో టెస్టు కరోనా కేసుల కారణంగానే వాయిదా పడింది. అలాంటిది ఇప్పుడు కూడా ఆటగాళ్లు ఇలా వైరస్ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ సిరీస్కు ముందు విరాట్ కోహ్లీ, అశ్విన్ కూడా వైరస్ బారినపడ్డారు.
బయోబబుల్ హుష్కాకి..
(Photo: Johns Twitter)
కరోనా తొలి ఏడాది అన్ని రంగాల్లాగే క్రికెట్ కూడా కుదేలైన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో మిగతా క్రీడల్లాగే క్రికెట్ టోర్నీలు సైతం రద్దయ్యాయి లేదా వాయిదా పడ్డాయి. తర్వాత నెమ్మదిగా కేసులు తగ్గుముఖం పట్టడంతో బయోబబుల్ వంటి పకడ్బందీ ఏర్పాట్లతో వాటిని తిరిగి నిర్వహించడం మొదలెట్టారు. అప్పుడు ఆయా టోర్నీలు, సిరీస్ల్లో పాల్గొనే ఆటగాళ్లకు ముందే కరోనా పరీక్షలు చేయడం, వారిని కొద్ది రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్లో ఉంచడం.. ఆ తర్వాతే బబుల్లోకి పంపడం చేసేవారు. దీంతో ఎలాంటి కేసులు లేకుండా ఆ టోర్నీలు సజావుగా సాగేవి. కానీ, కొంత కాలంగా అంతర్జాతీయ మ్యాచ్లు యథావిధిగా సాగుతుండటంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఇతర లీగులు కూడా నిర్వహిస్తుండటంతో ఆటగాళ్లు చాలా రోజుల పాటు బయోబబుల్ల్లో గడపాల్సి వస్తోంది. దీంతో వారు మానసికంగా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున నిబంధనలను కాస్త సడలించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న టీమ్ఇండియా ఆటగాళ్లకు అంత కఠినమైన నిబంధనలు లేవు. అందుకే రోహిత్ ఇలా వైరస్ బారినపడ్డాడనే విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనా ఇంగ్లాండ్తో ఈ టెస్టు కీలకమైంది కాబట్టి ఆటగాళ్లు ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచిది కాదు. ఇకనైనా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం