Lucknow: లఖ్నవూ ‘చేతులారా’ పోగొట్టుకుంది..!
కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లఖ్నవూ జట్టు ఈ టోర్నీలో ఆడింది తొలిసారే అయినా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పేరు తెచ్చుకుంది. అయితే, గతరాత్రి కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో...
ఎలిమినేటర్ మ్యాచ్లో ఎందుకు ఓడిపోయారంటే?
కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లఖ్నవూ జట్టు ఈ టోర్నీలో ఆడింది తొలిసారే అయినా టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా పేరు తెచ్చుకొంది. అయితే, గతరాత్రి కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయి అభిమానుల ఆశలు ఆవిరి చేసింది. లీగ్స్టేజ్లో టాప్-2లో నిలిచేలా కనిపించిన ఆ జట్టు రన్రేట్ పరంగా వెనుకపడి ఆఖరి క్షణాల్లో మూడోస్థానానికి పడిపోయింది. ఈ నేపథ్యంలోనే నాలుగో స్థానంలో నిలిచిన బెంగళూరుతో పోటీపడి చివరికి నిరాశతో వెనుదిరిగింది. అయితే, ఇక్కడ లఖ్నవూ ఓటమికి పలు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. అవేంటో చూద్దాం..
టాస్ దగ్గరే తప్పటడుగు..
ఈడెన్ గార్డెన్స్ అంటేనే బ్యాట్స్మెన్కు పరుగుల స్వర్గధామం. అలాంటిది ఇక్కడ ఎవరు టాస్ గెలిచినా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంటారు. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్ టాస్ నెగ్గిన వెంటనే బౌలింగ్ ఎంచుకొన్నాడు. అదే ఆ జట్టు ఓటమికి తొలి కారణంగా కనిపిస్తోంది. బ్యాటింగ్కు కలిసివచ్చే పిచ్పై తొలుత ప్రత్యర్థికి అవకాశం ఇవ్వడం ఎంత తప్పో బెంగళూరు ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రాహుల్కు అర్థమైంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న డుప్లెసిస్ టీమ్.. లఖ్నవూ ముందు 208 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో ఛేదనలో ఎంత కష్టపడినా రాహుల్ టీమ్ కొండంత లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. లఖ్నవూ దీని కన్నా ముందు ఆడిన 10 మ్యాచ్ల్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడే 6 సార్లు విజయం సాధించింది. రెండోసారి బ్యాటింగ్ చేసిన 4 సార్లూ ఓటమిపాలైంది. ఈ గణాంకాలను పరిశీలించినా రాహుల్ తొలుత బ్యాటింగ్ వదులుకొని ఎంత తప్పు చేశాడో అర్థం చేసుకోవచ్చు.
క్యాచ్లు జారవిడవడం..
ఇక ఎలిమినేటర్ లాంటి కీలక దశలో ఏ చిన్న తప్పిదం జరిగినా అది భారీ మూల్యం చెల్లించుకునేలా చేస్తుంది. అలాంటిది ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డింగ్లో భారీ తప్పిదాలే చేసింది. టైటిల్ పోరులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో కొన్ని క్యాచ్లు వదిలేయడం ఆ జట్టు కొంపముంచింది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మ్యాచ్లో శతకంతో కదం తొక్కిన రజత్ పటీదార్ (112 నాటౌట్; 54 బంతుల్లో 12x4, 7x6) మూడుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకోగా.. దినేశ్ కార్తీక్ (37 నాటౌట్; 23 బంతుల్లో 5x4, 1x6) కూడా క్రీజులోకి వచ్చిన వెంటనే క్యాచ్ ఔట్ అయ్యే ప్రమాదం నుంచి బతికిపోయాడు. తొలుత రజత్ 59 పరుగుల వద్ద ఉండగా కృనాల్ పాండ్య బౌలింగ్లో షార్ట్ థర్డ్ మ్యాన్ దిశగా బంతిని గాల్లోకి లేపాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న మోసిన్ ఖాన్ బంతిని అందుకునేలా కనిపించినా విఫలమయ్యాడు. తర్వాత రజత్ 72 పరుగుల వద్ద ఉండగా రవిబిష్ణోయ్ బౌలింగ్లో డీప్మిడ్ వికెట్ మీదుగా షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న దీపక్ హూడా సైతం సులువైన క్యాచ్ను వదిలేశాడు. అలాగే మోసిన్ ఖాన్ బౌలింగ్లో కార్తీక్ 2 పరుగుల వద్ద ఉండగానే మిడాఫ్లో కేఎల్ రాహుల్ చేతికి చిక్కాడు. కానీ, ఆ బంతి కూడా నేలపాలైంది. దీంతో ఇలా మూడు సార్లు క్యాచ్లు వదిలి లఖ్నవూ చేతులారా మ్యాచ్ను సమర్పించుకొంది.
డెత్ ఓవర్లలో అధిక పరుగులు..
లఖ్నవూ ఓటమికి మరో ప్రధాన కారణం డెత్ ఓవర్లలో అధికంగా పరుగులివ్వడం. అది కేవలం ఈ మ్యాచ్లో పరుగులిచ్చారని చెప్పడం లేదు. ఈ సీజన్లో ఇంతకుముందు కోల్కతా, చెన్నై జట్లతో ఆడిన సందర్భాల్లోనూ ఇలాగే చివరి ఓవర్లలో విపరీతంగా పరుగులిచ్చింది. ఈ మ్యాచ్లో లఖ్నవూ చివరి ఐదు ఓవర్లలో 84 పరుగులు ఇవ్వడం గమనార్హం. దీంతో ఈ సీజన్ డెత్ ఓవర్లలో రెండో సారి కూడా అత్యధిక పరుగులిచ్చిన జట్టుగా నిలిచింది. తొలుత 15 ఓవర్ల దాకా బెంగళూరును బాగా కట్టడి చేసినా.. ఆ తర్వాత చేతులెత్తేసింది. బౌలర్లు ఎలా వేసినా పటీదార్, కార్తీక్ రెచ్చిపోయారు. బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. దీంతో బెంగళూరు 15 ఓవర్లకు 123/4 స్కోర్తో ఉండగా.. ఇన్నింగ్స్ పూర్తయ్యేసరికి 207/4 స్కోర్తో నిలిచింది. అంటే చివరి ఐదు ఓవర్లలో సగటున 16.8 పరుగులిచ్చింది. అంతకుముందు కోల్కతాతో ఆడిన మ్యాచ్లోనూ చివరి ఐదు ఓవర్లలో 74 పరుగులిచ్చింది. ఇక్కడ ఓవర్కు సగటున 14.8 పరుగులిచ్చింది. అలాగే చెన్నైతో ఆడిన మ్యాచ్లోనూ ఆఖరి ఐదు ఓవర్లలో 63 పరుగులిచ్చింది. అంటే సగటున 12.6 పరుగులు సమర్పించుకొంది. దీన్ని బట్టి లఖ్నవూ డెత్ ఓవర్లలో బౌలింగ్ ఎలా గాడి తప్పిందో పోల్చి చూసుకోవచ్చు.
బ్యాటింగ్ ఆర్డర్లో గందరగోళం..
మరోవైపు లఖ్నవూ బ్యాటింగ్ ఆర్డర్ ఈ సీజన్లో అందర్నీ కాసింత గందరగోళానికి గురిచేసింది. ఒక్కో మ్యాచ్లో ఒక్కోలా బ్యాట్స్మన్ స్థానాలు మార్చి ప్రయోగాలు చేసింది. ఒకసారి కృష్ణప్ప గౌతమ్ వంటి లోయర్ ఆర్డర్ బ్యాట్స్మన్ను మూడో స్థానంలో ఆడించిన ఆ జట్టు మరికొన్నింటిలో దిగువ స్థాయిలోనే అవకాశం ఇచ్చింది. అలాగే ఎవిన్ లూయిస్ వంటి ఓపెనర్ను కూడా ఒక్కోసారి మూడో నంబర్ ఆటగాడిగా, మరికొన్ని సార్లు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్గా ఆడించింది. కృనాల్ పాండ్యను సైతం ఒక్కోసారి మిడిల్ ఆర్డర్లో, ఒక్కోసారి లోయర్ మిడిల్ ఆర్డర్లో పంపించింది. ఇలా పలుమార్లు ప్రయోగాలు చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక కీలకమైన ఈ ఎలిమినేటర్ మ్యాచ్లోనూ మనన్ వోహ్రాను మూడో నంబర్ ఆటగాడిగా తీసుకొచ్చి లూయిస్ను వెనక్కినెట్టింది. దీపక్ హూడా నాలుగో స్థానంలో మెరవడంతో మార్కస్ స్టాయినిస్ లాంటి బిగ్ హిట్టర్ను ఆఖరివరకు దాచిపెట్టుకొంది. దీంతో ఈ మ్యాచ్లో లూయిస్, స్టాయినిస్ లాంటి ఆటగాళ్లు క్రీజులో కుదురుకునేసరికే ఆడాల్సిన రన్రేట్ కొండలా పెరిగిపోయి ఒత్తిడికి గురిచేసింది. చివరికి లూయిస్ (2), స్టాయినిస్ (9) స్కోర్లతో జట్టు వైఫల్యంలో భాగమయ్యారు.
- ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM