Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
Cameron Green IPL: బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్ మీద కాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన గ్రీన్పై ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా?
డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలం. (IPL 2024) ఈ నేపథ్యంలో హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్వుడ్, వేన్ పార్నెల్, డేవిడ్ విల్లీ లాంటి బౌలర్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వదులుకుంది. తీరా చూస్తే జట్టులో ఆడగలిగే పేసర్ సిరాజ్ ఒక్కడే ఉన్నాడు. దీంతో బౌలింగ్ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఆర్సీబీ (Royal Challengers Bangalore) సిద్ధమైందని అనిపించింది. ఖాతాలోనూ రూ.40.75 కోట్లు ఉండటంతో వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుందనిపించింది. కానీ, రెండు గంటలు గడిచాయో లేదో ముంబయి ఇండియన్స్ నుంచి కామెరూన్ గ్రీన్ను (Australian all-rounder Cameron Green) ఏకంగా రూ.17.5 కోట్లు చెల్లించి తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి గ్రీన్ కోసం అంత మొత్తం ఖర్చు చేసేందుకు ఆర్సీబీ ఎందుకు సిద్ధమైంది? ఆ జట్టు వ్యూహమేంటీ?
అంతలోనే..
2024 ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో వచ్చే ఏడాది 19న మినీ వేలం జరగబోతోంది. దీనికి ముందు లీగ్లోని పది ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే, వదులుకునే, మార్పిడి చేసుకునే ఆటగాళ్ల వివరాలను గడువుకు చివరి తేదీ అయిన ఆదివారం ప్రకటించాయి. మొదట ఆర్సీబీ హసరంగ, హేజిల్వుడ్, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకెల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్తో కలిపి 11 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇందులో బౌలర్లే ఎక్కువగా ఉన్నారు. పేసర్లు సిరాజ్, టాప్లీ మాత్రమే మిగిలారు. టాప్లీ ఏమో గాయాలతో బాధపడుతున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ను సన్రైజర్స్కు ఇచ్చేసి బదులుగా స్పిన్నర్ మయాంక్ దాగర్ను జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో వేలంలో బౌలర్లపై ఆర్సీబీ (Royal Challengers Bangalore) ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని అనిపించింది. ఉత్తమ బౌలర్లను కొనుగోలు చేసి బౌలింగ్ దళాన్ని పటిష్ఠం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అనూహ్యంగా ముంబయి నుంచి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్రీన్ను ఆర్సీబీ తీసుకుందనే విషయం బయటపడింది. గతేడాది వేలంలో రూ.17.5 కోట్లు పెట్టి గ్రీన్ను ముంబయి దక్కించుకుంది. ఇప్పుడు అంతే మొత్తాన్ని చెల్లించి గ్రీన్ను ఆర్సీబీ తీసుకుంది. అంతే కాకుండా ఆటగాడి మార్పిడి ఫీజు కింద కూడా ఆర్సీబీ మరికొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్రీన్ కోసం భారీ మొత్తం ఖర్చు పెట్టేందుకు ఆర్సీబీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. గ్రీన్ మంచి ఆటగాడే. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను ముంబయి తరపున 16 మ్యాచ్ల్లో 50.22 సగటుతో 452 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్రేట్ 160.28 ఉండటం విశేషం. ఓ సెంచరీ కూడా చేశాడు. తన ఫాస్ట్బౌలింగ్తో ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగడమే కాకుండా, ఉపయుక్తమైన బౌలింగ్తోనూ ఆకట్టుకున్నాడు. ఆల్రౌండర్గా అతను ఆర్సీబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్ మీద కాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ మీద ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడేం చేయాలి?
హార్దిక్ పాండ్యను గుజరాత్ నుంచి తీసుకోవాలంటే ముంబయికి డబ్బు కావాలి. అందుకే గ్రీన్ను ఇచ్చేస్తామని అన్ని జట్లతోనూ బేరసారాలు జరిపింది. చివరకు ఆర్సీబీ తీసుకుంది. ఇప్పటికే డుప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్వెల్, రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్తో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఇప్పుడు గ్రీన్ కూడా జతకావడంతో మరింత పటిష్ఠంగా మారుతుంది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ ఎప్పుడూ అత్యుత్తమంగానే ఉంటోంది. బౌలింగ్ మాత్రమే బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. మినీ వేలంలో సరైన బౌలర్లను ఎంచుకోవడం ఇప్పుడు ఆర్సీబీకి సవాలేనని చెప్పాలి. పైగా ఖాతాలో రూ.23.50 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వేలంలో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల ప్రపంచకప్లో సత్తాచాటిన దక్షిణాఫ్రికా పేసర్ కొయెట్జీని దక్కించుకోవడానికి ఆర్సీబీ ప్రయత్నించే అవకాశముంది. అలాగే 2014, 2015 సీజన్లలో ఆర్సీబీతోనే ఆడిన మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)నూ తిరిగి సొంతం చేసుకోవచ్చు. వీళ్లతో పాటు స్పిన్నర్లు దునిత్ వెల్లలాగె (శ్రీలంక), మెహిదీ హసన్ (బంగ్లాదేశ్), ముజీబుర్ రెహ్మాన్ (అఫ్గానిస్థాన్)పైనా ఆర్సీబీ కన్నేసి ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వదులుకున్న వాళ్లలో హసరంగ, హేజిల్వుడ్నూ తిరిగి తీసుకునే అవకాశాలను కొట్టేయలేం. గ్రీన్ రాకతో బ్యాటింగ్ బలపడింది. ఓ బౌలర్ అవసరమూ తగ్గింది. ఈ నేపథ్యంలో బౌలింగ్ను మరింత పటిష్ఠం చేసుకుంటే.. ఆర్సీబీకి తిరుగుండదనే చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు