Cameron Green: గ్రీన్ కోసం రూ.17.5 కోట్లా?.. ఆర్సీబీ వ్యూహమేంటీ?
Cameron Green IPL: బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్ మీద కాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ అయిన గ్రీన్పై ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా?
డిసెంబర్ 19న ఐపీఎల్ మినీ వేలం. (IPL 2024) ఈ నేపథ్యంలో హసరంగ, హర్షల్ పటేల్, హేజిల్వుడ్, వేన్ పార్నెల్, డేవిడ్ విల్లీ లాంటి బౌలర్లను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వదులుకుంది. తీరా చూస్తే జట్టులో ఆడగలిగే పేసర్ సిరాజ్ ఒక్కడే ఉన్నాడు. దీంతో బౌలింగ్ను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఆర్సీబీ (Royal Challengers Bangalore) సిద్ధమైందని అనిపించింది. ఖాతాలోనూ రూ.40.75 కోట్లు ఉండటంతో వేలంలో మంచి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుందనిపించింది. కానీ, రెండు గంటలు గడిచాయో లేదో ముంబయి ఇండియన్స్ నుంచి కామెరూన్ గ్రీన్ను (Australian all-rounder Cameron Green) ఏకంగా రూ.17.5 కోట్లు చెల్లించి తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి గ్రీన్ కోసం అంత మొత్తం ఖర్చు చేసేందుకు ఆర్సీబీ ఎందుకు సిద్ధమైంది? ఆ జట్టు వ్యూహమేంటీ?
అంతలోనే..
2024 ఐపీఎల్ సీజన్ నేపథ్యంలో వచ్చే ఏడాది 19న మినీ వేలం జరగబోతోంది. దీనికి ముందు లీగ్లోని పది ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే, వదులుకునే, మార్పిడి చేసుకునే ఆటగాళ్ల వివరాలను గడువుకు చివరి తేదీ అయిన ఆదివారం ప్రకటించాయి. మొదట ఆర్సీబీ హసరంగ, హేజిల్వుడ్, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, మైకెల్ బ్రేస్వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్తో కలిపి 11 మంది ఆటగాళ్లను వదులుకుంది. ఇందులో బౌలర్లే ఎక్కువగా ఉన్నారు. పేసర్లు సిరాజ్, టాప్లీ మాత్రమే మిగిలారు. టాప్లీ ఏమో గాయాలతో బాధపడుతున్నాడు. స్పిన్ ఆల్రౌండర్ షాబాజ్ అహ్మద్ను సన్రైజర్స్కు ఇచ్చేసి బదులుగా స్పిన్నర్ మయాంక్ దాగర్ను జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో వేలంలో బౌలర్లపై ఆర్సీబీ (Royal Challengers Bangalore) ప్రత్యేకంగా దృష్టి పెడుతుందని అనిపించింది. ఉత్తమ బౌలర్లను కొనుగోలు చేసి బౌలింగ్ దళాన్ని పటిష్ఠం చేసుకుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ అనూహ్యంగా ముంబయి నుంచి ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్రీన్ను ఆర్సీబీ తీసుకుందనే విషయం బయటపడింది. గతేడాది వేలంలో రూ.17.5 కోట్లు పెట్టి గ్రీన్ను ముంబయి దక్కించుకుంది. ఇప్పుడు అంతే మొత్తాన్ని చెల్లించి గ్రీన్ను ఆర్సీబీ తీసుకుంది. అంతే కాకుండా ఆటగాడి మార్పిడి ఫీజు కింద కూడా ఆర్సీబీ మరికొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. అయితే గ్రీన్ కోసం భారీ మొత్తం ఖర్చు పెట్టేందుకు ఆర్సీబీ ముందుకు రావడం ఆశ్చర్యాన్ని కలిగించేదే. గ్రీన్ మంచి ఆటగాడే. ఈ ఏడాదే ఐపీఎల్ అరంగేట్రం చేసిన అతను ముంబయి తరపున 16 మ్యాచ్ల్లో 50.22 సగటుతో 452 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్రేట్ 160.28 ఉండటం విశేషం. ఓ సెంచరీ కూడా చేశాడు. తన ఫాస్ట్బౌలింగ్తో ఆరు వికెట్లు కూడా పడగొట్టాడు. ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగడమే కాకుండా, ఉపయుక్తమైన బౌలింగ్తోనూ ఆకట్టుకున్నాడు. ఆల్రౌండర్గా అతను ఆర్సీబీకి కలిసొచ్చే అవకాశం ఉంది. కానీ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉన్న ఆర్సీబీ.. పేసర్ మీద కాకుండా బ్యాటింగ్ ఆల్రౌండర్ మీద ఇంతలా ఖర్చు పెట్టడం సరైందేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడేం చేయాలి?
హార్దిక్ పాండ్యను గుజరాత్ నుంచి తీసుకోవాలంటే ముంబయికి డబ్బు కావాలి. అందుకే గ్రీన్ను ఇచ్చేస్తామని అన్ని జట్లతోనూ బేరసారాలు జరిపింది. చివరకు ఆర్సీబీ తీసుకుంది. ఇప్పటికే డుప్లెసిస్, కోహ్లి, మ్యాక్స్వెల్, రజత్ పటీదార్, దినేశ్ కార్తీక్తో బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ఇప్పుడు గ్రీన్ కూడా జతకావడంతో మరింత పటిష్ఠంగా మారుతుంది. అయితే ఆర్సీబీ బ్యాటింగ్ ఎప్పుడూ అత్యుత్తమంగానే ఉంటోంది. బౌలింగ్ మాత్రమే బలహీనంగా కనిపిస్తోంది. ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే ఉంది. మినీ వేలంలో సరైన బౌలర్లను ఎంచుకోవడం ఇప్పుడు ఆర్సీబీకి సవాలేనని చెప్పాలి. పైగా ఖాతాలో రూ.23.50 కోట్లు మాత్రమే ఉన్నాయి. దీంతో వేలంలో తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇటీవల ప్రపంచకప్లో సత్తాచాటిన దక్షిణాఫ్రికా పేసర్ కొయెట్జీని దక్కించుకోవడానికి ఆర్సీబీ ప్రయత్నించే అవకాశముంది. అలాగే 2014, 2015 సీజన్లలో ఆర్సీబీతోనే ఆడిన మిచెల్ స్టార్క్ (ఆస్ట్రేలియా)నూ తిరిగి సొంతం చేసుకోవచ్చు. వీళ్లతో పాటు స్పిన్నర్లు దునిత్ వెల్లలాగె (శ్రీలంక), మెహిదీ హసన్ (బంగ్లాదేశ్), ముజీబుర్ రెహ్మాన్ (అఫ్గానిస్థాన్)పైనా ఆర్సీబీ కన్నేసి ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వదులుకున్న వాళ్లలో హసరంగ, హేజిల్వుడ్నూ తిరిగి తీసుకునే అవకాశాలను కొట్టేయలేం. గ్రీన్ రాకతో బ్యాటింగ్ బలపడింది. ఓ బౌలర్ అవసరమూ తగ్గింది. ఈ నేపథ్యంలో బౌలింగ్ను మరింత పటిష్ఠం చేసుకుంటే.. ఆర్సీబీకి తిరుగుండదనే చెప్పాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!