IND vs ENG: రాజ్కోట్.. టీమ్ఇండియా కోట... మూడో టెస్టులో రికార్డులు ఇవే!
Rajkot Test Match Records: భారత్, ఇంగ్లాండ్ మధ్య రాజ్కోట్లో జరిగిన మూడో టెస్టులో నమోదైన రికార్డులు ఇవే...
ఇంటర్నెట్ డెస్క్: రాజ్కోట్ వేదికగా జరిగిన మూడో టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ 434 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సర్ఫరాజ్ రాణించడంతో ఒక రోజు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఈ మ్యాచ్లో నమోదైన రికార్డులు ఇవే...
జైస్వాల్ రికార్డులు ఇవీ...
- యశస్వి జైస్వాల్ (214) డబుల్ సెంచరీలో మొత్తంగా 12 సిక్స్లు బాదాడు. ఒక ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్ల జాబితాలో వసీం అక్రమ్ రికార్డును సమం చేశాడు.
- కొట్టిన తొలి మూడు సెంచరీలూ 150+ స్కోర్లుగా మలిచిన తొలి భారత బ్యాటర్. ప్రపంచవ్యాప్తంగా అయితే ఏడోవాడు.
- చిన్న వయసులో రెండు డబుల్ సెంచరీలు సాధించిన మూడో బ్యాటర్. రాజ్కోట్లో డబుల్ కొట్టే సమయానికి జైస్వాల్ వయసు 22 ఏళ్ల 49 రోజులు. తొలి స్థానంలో వినోద్ కాంబ్లీ (21 ఏళ్ల 54 రోజులు). రెండో స్థానంలో డాన్ బ్రాడ్మన్ (21 ఏళ్లు 318 రోజులు).
- ఒక సిరీస్లో రెండు డబుల్ సెంచరీలు చేసిన మూడో బ్యాటర్. ఇప్పటివరకు ఈ ఫీట్ వినోద్ కాంబ్లీ, విరాట్ కోహ్లీ చేశారు.
- 2019లో ఓ సిరీస్లో రోహిత్ శర్మ 19 సిక్స్లు బాది రికార్డు నెలకొల్పాడు. ఈ సిరీస్లో 22 సిక్స్లతో ఆ రికార్డును జైస్వాల్ బద్దలు కొట్టాడు.
- ఓ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన ఎడమచేతి వాటం బ్యాటర్లలో జైస్వాల్ (545)ది తొలి స్థానం. గంగూలీ (534) ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్నాడు.
- 23 ఏళ్ల కంటే తక్కువ వయసులో ఓ టెస్టు సిరీస్లో 500+ పరుగులు చేసిన బ్యాటర్ రికార్డు ఇప్పటివరకు సునీల్ గావస్కర్ (774) పేరున ఉంది. సుమారు 53 ఏళ్ల తర్వాత జైస్వాల్ (545) ఆ ఘనత సాధించాడు.
- అతి తక్కువ వయసు (22 ఏళ్ల 52 రోజులు)లో రెండో ఇన్నింగ్స్లో ద్విశతకం బాదిన మూడో బ్యాటర్. అతని కంటే ముందు జార్జ్ హెడ్లీ (20 ఏళ్ల 315 రోజులు), సునీల్ గావస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) ఉన్నారు.
- వేగంగా డబుల్ సెంచరీ చేసిన భారత ప్లేయర్ల జాబితాలో జైస్వాల్ స్థానం ఆరు. 231 బంతుల్లో ద్విశతకం బాదిన జైస్వాల్ ధోనీ సరసన చేరాడు. తొలి ఐదు స్థానాలు వీరేంద్ర సెహ్వాగ్వే.
టీమ్ రికార్డులు ఇవీ...
- ఈ టెస్టులో భారత్ మొత్తంగా 28 సిక్స్లు బాదింది. ఓ టెస్టులో ఇన్ని సిక్స్లు నమోదవడం ఇదే తొలిసారి. తన పేరునే ఉన్న రికార్డు (దక్షిణాఫ్రికాపై 27)ను భారత్ ఈ మ్యాచ్తో తిరగరాసింది.
- సెకండ్ ఇన్నింగ్స్లోనే 18 సిక్స్లు నమోదయ్యాయి. రెండో ఇన్నింగ్స్ అత్యధిక సిక్స్ల జాబితాలో మన స్థానం రెండు. 22 సిక్స్లతో పాకిస్థాన్ తొలి స్థానంలో ఉంది.
- ఓ టీమ్ ఒక సిరీస్లో అత్యధిక సిక్స్లు బాదిన రికార్డు భారత్పైనే ఉండేది. 2019లో దక్షిణాఫ్రికాపై 47 సిక్స్లతో సాధించిన రికార్డును ఈ సిరీస్లో 48 సిక్స్లతో తిరగరాసింది.
- అరంగేట్ర టెస్టులో రెండు అర్ధశతకాలు సాధించిన నాలుగో బ్యాటర్గా సర్ఫరాజ్ ఖాన్ (62, 68*) నిలిచాడు. అతనికి ముందు దిలావర్ హుస్సేన్, సునీల్ గావస్కర్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు.
- ఆడుతున్న తొలి టెస్టులో అత్యధిక స్ట్రైక్ రేటు (94.2)తో రెండు అర్ధశతకాలు బాదిన బ్యాటర్ల జాబితాలో సర్ఫరాజ్ ఖాన్ది తొలి స్థానం.
- ఓ జట్టు రెండు ఇన్నింగ్స్ల్లోనూ 400కుపై పరుగులు సాధించడం సుమారు 15 ఏళ్ల తర్వాత జరిగింది. 2009లో భారత్.. శ్రీలంకపై ఈ ఫీట్ సాధించింది. ఇప్పుడు రాజ్కోట్లో మళ్లీ సాధ్యమైంది.
- సర్ఫరాజ్, జైస్వాల్ బ్యాటింగ్ సమయంలో నమోదైన రన్రేట్ 6.53. ఓ బ్యాటింగ్ జోడీ 150కిపైగా బంతులు ఆడిన పార్ట్నర్ షిప్ల జాబితాలో జైస్వాల్ - సర్ఫరాజ్ జోడీది ఏడో స్థానం.
- భారత్ విధించిన అత్యధిక టార్గెట్ల జాబితాలో ఈ మ్యాచ్ లక్ష్యానిది (557) రెండో స్థానం. తొలి స్థానంలో 617 ఉంది. 2009లో న్యూజిలాండ్కు భారత్ ఈ లక్ష్యం విధించింది.
- ఒక టెస్టులో సెంచరీ, 5 వికెట్ల ఫీట్ సాధించడం జడేజాకు ఇది రెండోసారి. ఇలా ఇప్పటివరకు ఏడు సార్లు భారత ప్లేయర్లు చేశారు. వాళ్లే వినూ మన్కడ్, పాలీ ఉమ్రిగర్, రవిచంద్రన్ అశ్విన్ (మూడు సార్లు).
- ఇంగ్లాండ్కు ఇది రెండో భారీ పరాజయం. ఇప్పుడు 434 పరుగుల తేడాతో ఓడిపోగా... 1934లో 562 పరుగుల తేడాతో ఓడిపోయింది.
- బజ్బాల్ ఎరా (స్టోక్స్ - మెక్కలమ్ కాంబో) వచ్చాక ఇంగ్లాండ్ వరుస టెస్టుల్లో ఓడిపోవడం ఇది రెండోసారి. 2023 యాషెస్ ఇలా వరుసగా రెండు టెస్టుల్లో ఓడిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
వ్యక్తుల ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టుకు రాష్ర్ట ప్రభుత్వమా ?
-
సీఎం రేవంత్ రెడ్డికి దిల్లీ పోలీసుల సమన్లు
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 900+, నిఫ్టీ 220+
-
దేవుడు న్యాయం పక్షానే ఉంటాడు: బ్రదర్ అనిల్
-
వీధి వ్యాపారిని కలిసిన మోదీ.. ఈ మోహిని గౌడ గురించి తెలుసా?
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి