Ranji Trophy: రంజీ ట్రోఫీ స్క్వాడ్లోనూ బంధుప్రీతి..? దిల్లీ జట్టులో ఆయుష్కు దక్కని చోటు
రంజీ ట్రోఫీలో (Ranji Trophy) రికార్డులతో పాటు ఓ అంశం క్రికెట్ వర్గాలను ఆందోళన పరుస్తోంది. బంధుప్రీతి కారణంగా ఓ ఆటగాడికి అన్యాయం జరిగిందనే వార్తలు వస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: రంజీ ట్రోఫీ బరిలోకి దిగిన దిల్లీ జట్టు ఎంపికపై ‘బంధుప్రీతి’ ఆరోపణలు వచ్చాయి. ఈ సీజన్లో ఆ జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో రెండింట్లో ఓటమి పాలైంది. గత ఐదు ఇన్నింగ్స్ల్లో మూడు సార్లు ఆ జట్టు కనీసం 200 పరుగులు కూడా చేయలేకపోయింది. ఈ జట్టులో కాస్త పేరున్న ఆటగాడు ఆయుష్ బదోని. గత మ్యాచ్లో మధ్యప్రదేశ్పై 41 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. కానీ, ఇప్పుడు ఉత్తరాఖండ్తో జరుగుతున్న మ్యాచ్లో ఈ ఐపీఎల్ స్టార్కు చోటు దక్కలేదు. మరోసారి దిల్లీ తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులకే ఆలౌటైంది. యశ్ ధుల్ (47) మాత్రమే చేశాడు.
దిల్లీ జట్టులోకి తమకు అనుకూలమైన ఆటగాడు క్షితిజ్ శర్మను తీసుకొనేందుకే బదోనికి చోటు కల్పించలేదనే ఆరోపణలు దిల్లీ జట్టుపై వస్తున్నాయి. క్షితిజ్ శర్మకు బీసీసీఐ మాజీ ఆఫీస్ బేరర్తో సత్సంబంధాలు ఉన్నాయని.. 15 మంది స్క్వాడ్లో ఉన్న ఆటగాడికే బీసీసీఐ మ్యాచ్ ఫీజులు వస్తాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కామెంట్లు వచ్చాయి. చివరికి మ్యాచ్ను చూసేందుకు కూడా అధికారులు, ఆటగాళ్లు ఉండే ప్రదేశానికి వచ్చేందుకు అనుమతి లేదు. దీంతో అతడిని హోటల్ గదికే పరిమితం చేయడం గమనార్హం.
‘‘క్షితిజ్ శర్మను ఆడించేందుకు ఒత్తిడి ఉన్నమాట వాస్తవమే. అందుకే, బదోనికి 15 మందిలోనూ అవకాశం లేకుండాపోయింది. కాబట్టి, బీసీసీఐ ఇచ్చే మ్యాచ్ ఫీజులు కూడా బదోనికి అందవు. మ్యాచ్ను చూడాలంటే వీఐపీ గ్యాలరీలో నుంచి మాత్రమే చూసే అవకాశం ఇచ్చారు. టీమ్ మేనేజర్స్ అతడికి భోజన ఏర్పాట్లు చేశారు. అందుకోసం బీసీసీఐ నుంచి ఎలాంటి చెల్లింపులు ఉండవు. నెట్స్లోనూ ప్రాక్టీస్ చేయడానికి వీలులేదు. తదుపరి మ్యాచ్లో అవకాశం వచ్చి బదోని సెంచరీ సాధిస్తే.. అతడిని పక్కన పెట్టినవారి నోళ్లు మూయించినట్లవుతుంది’’ అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని దిల్లీ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు వెల్లడించినట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం