Team India: ‘ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నారా?’.. రంజీల్లో ఆడని ప్లేయర్లపై బీసీసీఐ అసంతృప్తి..!
ఫిట్గా ఉండి దేశవాళీ క్రికెట్లో ఆడకుండా వచ్చే ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్న వారిపై బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: జాతీయ జట్టుకు ఎంపిక కానివారు, రంజీల్లో ఆడని ఆటగాళ్లపై బీసీసీఐ కన్నెర్ర చేసేందుకు సిద్ధమైంది. గాయాలు, విరామం పేరుతో విశ్రాంతి తీసుకున్న క్రికెటర్లు ఫిట్గా ఉంటే తప్పకుండా రంజీల్లో ఆడాలని హెచ్చరిస్తోంది. ఒకవైపు సీనియర్లు ఛెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె మళ్లీ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటే.. ఇషాన్ కిషన్తోపాటు హార్దిక్ పాండ్య మాత్రం దేశవాళీ క్రికెట్ ఆడకపోవడంతోనే బీసీసీఐ ఈ నిర్ణయానికొచ్చినట్లు క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయాన్ని ఆటగాళ్లకే చెప్పాలని బోర్డు అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
‘‘జాతీయ జట్టుకు సెలక్ట్ కానివారు ఫిట్గా ఉంటే.. రంజీల్లో తమ రాష్ట్రాల జట్లకు ఆడాలి. ఫిట్నెస్కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జాతీయ క్రికెట్ అకాడమీని సంప్రదించాలి. రాబోయే కొన్ని రోజుల్లో ఈ నిబంధనను బీసీసీఐ ఆటగాళ్లకు చెప్పనుంది. కేవలం ఎన్సీఏ మినహాయింపు ఇచ్చిన ప్లేయర్లు మాత్రమే రంజీల్లో ఆడకుండా ఉండే అవకాశం ఉంది. కొందరు జనవరి నుంచి వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నవారిని ఉద్దేశించే ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోంది’’ అని బీసీసీఐ అధికారిక వర్గాలు తెలిపాయి.
మానసికంగా అలసటకు గురి కావడంతో విరామం కావాలని తీసుకున్న ఇషాన్ కిషన్ ఇప్పటికీ రంజీల్లో ఆడటం లేదు. రాహుల్ ద్రవిడ్ కూడా ఇంగ్లాండ్తో రెండో టెస్టుకు ముందు ఇషాన్ మళ్లీ జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీలో ఆడాల్సిందేనని స్పష్టంచేశాడు. కానీ, ఇషాన్ మాత్రం ఇంకా తన రాష్ట్ర క్రికెట్ సంఘాన్ని సంప్రదించలేదు. మరోవైపు ముంబయి ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్తో కలిసి ఇషాన్ కిషన్ ప్రాక్టీస్ చేస్తున్నాడని బీసీసీఐ దృష్టికి వచ్చినట్లు సమాచారం. కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బోర్డు పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?