Delhi Capitals: వారిద్దరు ఉంటారు.. మరి సహాయక సిబ్బంది కొనసాగింపుపైనే అనిశ్చితి?
దారుణ ప్రదర్శనతో దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2023 సీజన్ను (IPL 2023) ముగించిన విషయం తెలిసిందే. కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిలకడగా ఆడితే.. ఫిల్ సాల్ట్ అప్పుడప్పుడు మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. కోచింగ్ స్టాఫ్పై వేటు పడుతుందనే వార్తల నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ సహయజమాని ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఘోర ప్రదర్శనతో ఐపీఎల్ 2023 సీజన్ను (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానంతో ముగించింది. జట్టులో డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్, పృథ్వీ షా, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక కోచింగ్ స్టాఫ్లో మాస్టర్ మైండ్స్ రికీ పాంటింగ్ ప్రధాన కోచ్ కాగా.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మెంటార్గా వ్యవహరించాడు. అయినా, ఫలితాలు మాత్రం దారుణంగా ఉండటంతో విమర్శలు వచ్చాయి. రిషభ్ పంత్ జట్టులో లేకపోవడం కూడా దిల్లీపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టామని దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పేర్కొంది.
ప్రధాన కోచ్గా రికీ పాంటింగ్ను కొనసాగిస్తారా.. లేదా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రికీ కొనసాగింపుపై దిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ సూచనాప్రాయంగా కీలక విషయాలను వెల్లడించారు. గంగూలీ, రికీ నేతృత్వంలో వచ్చే ఏడాది దిల్లీ క్యాపిటల్స్ బలంగా ముందుకొస్తుందని పేర్కొన్నారు. ‘‘వచ్చేఏడాది ఐపీఎల్ సన్నద్ధత కొనసాగుతోంది. గంగూలీ, రికీ పాంటింగ్ మాకు మద్దతుగా ఉంటారు. నేను, కిరణ్ గ్రంధి ఫ్రాంచైజీని ముందుకు తీసుకుపోవడానికి కష్టపడుతున్నాం. తప్పకుండా వచ్చే సీజన్లో టాప్లో నిలబడతాం’’ అని జిందాల్ ట్విటర్ వేదికగా తెలిపారు.
మెంటార్గా సౌరభ్ గంగూలీ, ప్రధాన కోచ్గా రికీ పాంటింగ్ ఉంటాడనే విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ.. సహాయక కోచ్పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. షేన్ వాట్సన్, జేమ్స్ హోప్స్ కొనసాగింపు కష్టమేననే దిల్లీ క్యాపిటల్స్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఫీల్డింగ్ కోచ్ బిజు జార్జ్ కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ప్రవీన్ ఆమ్రే, అజిత్ అగర్కార్ మాత్రం జట్టుతోపాటు ఉంటారని సమాచారం. అయితే, దిల్లీ క్యాపిటల్స్ నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
-
ఏటీఎంలో కార్డు ఇరుక్కుపోయిందా?.. ఇదో కొత్త స్కామ్!
-
ఆంధ్ర వర్సిటీలో పోస్టల్ ఓటు కోల్పోయిన 150 మంది
-
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,652
-
విశాఖ నుంచి భువనేశ్వర్కు తరలిపోతున్న ఎన్ఆర్డీసీ!
-
ట్రావెల్స్ బస్సులో రూ.2.40కోట్లు.. సీజ్ చేసిన పోలీసులు