Delhi Capitals: వారిద్దరు ఉంటారు.. మరి సహాయక సిబ్బంది కొనసాగింపుపైనే అనిశ్చితి?
దారుణ ప్రదర్శనతో దిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2023 సీజన్ను (IPL 2023) ముగించిన విషయం తెలిసిందే. కెప్టెన్ డేవిడ్ వార్నర్ నిలకడగా ఆడితే.. ఫిల్ సాల్ట్ అప్పుడప్పుడు మెరుపు ఇన్నింగ్స్లు ఆడాడు. కోచింగ్ స్టాఫ్పై వేటు పడుతుందనే వార్తల నేపథ్యంలో దిల్లీ క్యాపిటల్స్ సహయజమాని ట్వీట్ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఘోర ప్రదర్శనతో ఐపీఎల్ 2023 సీజన్ను (IPL 2023) దిల్లీ క్యాపిటల్స్ తొమ్మిదో స్థానంతో ముగించింది. జట్టులో డేవిడ్ వార్నర్, ఫిల్ సాల్ట్, పృథ్వీ షా, మనీశ్ పాండే, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇక కోచింగ్ స్టాఫ్లో మాస్టర్ మైండ్స్ రికీ పాంటింగ్ ప్రధాన కోచ్ కాగా.. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ మెంటార్గా వ్యవహరించాడు. అయినా, ఫలితాలు మాత్రం దారుణంగా ఉండటంతో విమర్శలు వచ్చాయి. రిషభ్ పంత్ జట్టులో లేకపోవడం కూడా దిల్లీపై ప్రభావం చూపింది. ఈ క్రమంలో వచ్చే సీజన్ కోసం ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలు పెట్టామని దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం పేర్కొంది.
ప్రధాన కోచ్గా రికీ పాంటింగ్ను కొనసాగిస్తారా.. లేదా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రికీ కొనసాగింపుపై దిల్లీ ఫ్రాంచైజీ సహ యజమాని పార్థ్ జిందాల్ సూచనాప్రాయంగా కీలక విషయాలను వెల్లడించారు. గంగూలీ, రికీ నేతృత్వంలో వచ్చే ఏడాది దిల్లీ క్యాపిటల్స్ బలంగా ముందుకొస్తుందని పేర్కొన్నారు. ‘‘వచ్చేఏడాది ఐపీఎల్ సన్నద్ధత కొనసాగుతోంది. గంగూలీ, రికీ పాంటింగ్ మాకు మద్దతుగా ఉంటారు. నేను, కిరణ్ గ్రంధి ఫ్రాంచైజీని ముందుకు తీసుకుపోవడానికి కష్టపడుతున్నాం. తప్పకుండా వచ్చే సీజన్లో టాప్లో నిలబడతాం’’ అని జిందాల్ ట్విటర్ వేదికగా తెలిపారు.
మెంటార్గా సౌరభ్ గంగూలీ, ప్రధాన కోచ్గా రికీ పాంటింగ్ ఉంటాడనే విషయంలో స్పష్టత ఉన్నప్పటికీ.. సహాయక కోచ్పై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. షేన్ వాట్సన్, జేమ్స్ హోప్స్ కొనసాగింపు కష్టమేననే దిల్లీ క్యాపిటల్స్ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే ఫీల్డింగ్ కోచ్ బిజు జార్జ్ కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. అయితే, ప్రవీన్ ఆమ్రే, అజిత్ అగర్కార్ మాత్రం జట్టుతోపాటు ఉంటారని సమాచారం. అయితే, దిల్లీ క్యాపిటల్స్ నుంచి మాత్రం అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే