Shubham Dubey: గ్లవ్స్ కొనలేని స్థాయి నుంచి.. ఐపీఎల్ వేలంతో కోటీశ్వరుడయ్యాడు..
క్రికెట్ అంటే ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ.. గ్లవ్స్ కొనేందుకు కూడా డబ్బుల్లేని పరిస్థితి. కానీ, మాజీ క్రికెటర్ సాయంతో ఆటలో రాణించి.. ఐపీఎల్ వేలంలో కోట్ల రూపాయల ధర పలికాడు.
తండ్రి నడుపుతోంది పాన్షాప్.. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు.. అసలు క్రికెటర్గా ఎదిగే పరిస్థితే లేదక్కడ. కానీ ఆ కుర్రాడు మాత్రం ఆశలను చంపుకోలేదు. ఓ సీనియర్ సాయంతో ముందుకెళ్లాడు. క్రికెట్లో పేరు తెచ్చుకున్నాడు. ఈ పట్టుదలే అతడిని కోటీశ్వరుడిని చేసింది. ఐపీఎల్లో ఏకంగా రూ.5 కోట్లకుపైనే పలికే అవకాశాన్ని కల్పించింది. ఈ కుర్రాడే శుభమ్ దూబె (Shubham Dubey). తాజాగా ఐపీఎల్ (IPL) వేలంలో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) అతడిని రూ. 5.8 కోట్లు పెట్టి సొంతం చేసుకుంది.
సుదీప్ సాయంతో
నాగ్పుర్కు చెందిన శుభమ్.. దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు. తండ్రి బద్రీప్రసాద్ దూబె పాన్ షాప్ను నిర్వహించేవాడు. కుటుంబం పెద్దది కావడంతో ఆ సంపాదన ఏమాత్రం సరిపోయేది కాదు. చిన్నప్పటి నుంచి క్రికెట్ను ఎంతో ప్రేమించే శుభమ్ మాత్రం ఎప్పటికైనా ఈ ఆటలో ఓ స్థాయికి వెళ్లాలని కలలు కన్నాడు. ఇది అంత తేలిక కాదని అతడికి బాగా తెలుసు. డబ్బులు ఉంటేనే ఈ ఆటలో ముందుకెళ్లగలడని కూడా అర్థం చేసుకున్నాడు.
విదర్భ మాజీ ఆటగాడు సుదీప్ జైస్వాల్ పరిచయం కావడం దూబె కెరీర్ను మలుపు తిప్పింది. శుభమ్ను ఎంతో ప్రోత్సహించిన సుదీప్.. అతడి పరిస్థితిని చూసి కిట్ అందించాడు. ఆరంభంలో టోర్నీలకు వెళ్లేందుకు డబ్బులు సాయం చేశాడు. దీంతో విదర్భ అండర్-19, అండర్-23 జట్లలో చోటు దక్కించుకున్న శుభమ్.. సత్తా చాటి సీనియర్ జట్టులోకి వచ్చాడు. సీనియర్ జట్టు తరఫున స్థిరంగా రాణిస్తున్నా ఇన్నాళ్లూ అతడికి గుర్తింపు మాత్రం రాలేదు. వయసు కూడా 29 ఏళ్లు వచ్చేయడంతో ఇక అవకాశాలు కూడా కష్టమే అనిపించిన దశ అది. కానీ అతడికి అదృష్టం కలిసొచ్చింది.
ముస్తాక్అలీ టోర్నీలో సత్తా చాటి
ఈ ఏడాది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్లో 7 మ్యాచ్ల్లో 222 పరుగులు చూసి ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా 180పైన స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించడం దూబెకు కలిసొచ్చింది. బెంగాల్పై 20 బంతుల్లో 58 పరుగుల ఇన్నింగ్స్ హైలైట్. లోయర్ ఆర్డర్లో వచ్చి పవర్ హిట్టింగ్తో పరుగులు వరద పారించగల సత్తా ఉన్న శుభమ్ ఇటీవల గువహాటి లీగ్లోనూ అదరగొట్టాడు. దూకుడుగా ఆడే శుభమ్ కోసం వేలంలో ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. రూ.20 లక్షలు కనీస ధరగా ఉన్న తన కోసం ఫ్రాంఛైజీలు పోటీపడుతుంటే శుభమ్ కూడా నమ్మలేకపోయాడట. అలా ధర పెరుగుతూ పోయి చివరికి రాజస్థాన్ ఏకంగా రూ.5.8 కోట్లతో దూబెను ఎగరేసుకుపోయింది. కనీస ధరకైనా తనను తీసుకుంటారని ఊహించని శుభమ్కు ఇది నిజంగా ఇది పెద్ద జాక్పాటే.
రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్, రవిచంద్రన్ అశ్విన్ కంటే శుభమ్ దూబె సంపాదనే ఎక్కువ కావడం విశేషం. ‘‘ఒకప్పుడు గ్లవ్స్ కొనడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. కానీ సుదీప్ సార్ వల్లే ఈ స్థితిలో ఉన్నా.. వేలంలో ఇంత డబ్బులు వస్తాయని కలలో కూడా అనుకోలేదు. చాలా ఆనందంగా ఉంది’’ అని శుభమ్ ఉబ్బితబ్బిబ్బయ్యాడు. బట్లర్, సంజు శాంసన్ లాంటి స్టార్లతో డ్రెస్సింగ్రూమ్ పంచుకునేందుకు అతడు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాడు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
-
అరుదైన ఘనత సాధించిన ‘పొలిమేర2’.. ఆనందంతో దర్శకుడి పోస్ట్
-
మోదీజీ.. ఇంకా మౌనమేనా?: ప్రజ్వల్ అభ్యంతరకర వీడియోలపై ప్రియాంకగాంధీ
-
శంషాబాద్ ఎయిర్పోర్టు పరిసరాల్లో చిరుత కోసం కొనసాగుతున్న గాలింపు
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్