Roger Federer: కఠిన ప్రత్యర్థులను ఎదుర్కొని.. తొలి ప్లేయర్గా నిలిచి..!
టెన్నిస్ కెరీర్లో 310 వారాలపాటు నంబర్వన్ స్థానం.. వరుసగా 237 వారాలపాటు టాప్-ర్యాంకర్..
ప్రొఫెషనల్ టెన్నిస్కు వీడ్కోలు పలికిన రోజర్ ఫెదరర్
ఇంటర్నెట్ డెస్క్: టెన్నిస్ కెరీర్లో 310 వారాలపాటు నంబర్ వన్ స్థానం.. వరుసగా 237 వారాలపాటు టాప్-ర్యాంకర్.. కెరీర్లో 20 గ్రాండ్స్లామ్లు.. మరి ఇలాంటివన్నీ సాధించినప్పుడూ వివాదాలూ ఉండాలిగా.. కానీ స్విస్ దిగ్గజం మాత్రం వాటికి అతీతుడు. ఓడిపోయినా.. గెలిచినా ప్రవర్తించే తీరు ఒకేలా ఉంటుంది. ప్రత్యర్థి ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా అరుదు.. ఈ ఉపోద్ఘాతమంతా స్విట్జర్లాండ్ దిగ్గజ టెన్నిస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ గురించే. ఇవాళ తన ప్రొఫెషనల్ ఆటకు వీడ్కోలు పలికాడు ఈ దిగ్గజ ఆటగాడు. ఈ సందర్భంగా ఫెదరర్ గురించి ప్రత్యేక కథనం..
1981 ఆగస్ట్ 8న స్విస్లోని బసేల్లో జన్మించిన రోజర్ ఫెదరర్.. 17 ఏళ్లకు (1998) ప్రొఫెషనల్ ప్లేయర్గా మారాడు. అయితే స్విస్ ఓపెన్లో తొలి రౌండ్లోనే పరాజయం పాలయ్యాడు. 2001 వింబుల్డెన్లో టాప్ ఆటగాడు పీట్ సంప్రాస్ను ఓడించి క్వార్టర్ ఫైనల్కు చేరాడు. అయితే అక్కడ ఓటమిపాలై వెనుదిరిగాడు. ఈ క్రమంలో ప్రొఫెషనల్ ప్లేయర్గా మారిన ఐదేళ్లకు తొలి గ్రాండ్స్లామ్ (2003)ను ఫెదరర్ సొంతం చేసుకున్నాడు. ఇక 2004లో అయితే ఏకంగా మూడు గ్రాండ్స్లామ్ను గెలుచుకొని రికార్డు సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్, వింబుల్డెన్, యూఎస్ ఓపెన్ టైటిళ్లను సాధించాడు. అలాగే 2006లోనూ మూడు గ్రాండ్స్లామ్లను గెలుచుకోవడం విశేషం. తన కెరీర్లో ఒకే ఒక్కసారి మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్ను అందుకున్నాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ డబుల్స్ విభాగంలో (ఫెదరర్-స్టానిస్లాస్) స్విస్కు స్వర్ణం పతకం అదించాడు. అదీనూ 2009లో రాబిన్ సోడర్లింగ్పై విజయం సాధించాడు. చివరిసారిగా 2018లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్స్లామ్ను సాధించిన ఫెదరర్ అప్పటి నుంచి గాయాలతో సహవాసం చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కెరీర్లో 20 గ్రాండ్స్లామ్లు.. ఆస్ట్రేలియన్ ఓపెన్ (6), ఫ్రెంచ్ ఓపెన్ (1), వింబుల్డెన్ (8), యూఎస్ ఓపెన్ (5) గెలుచుకున్నాడు.
అందరూ భీకర ప్రత్యర్థులే..
రోజర్ ఫెదరర్ తన కెరీర్ను ప్రారంభించిన సమయంలో ఆండ్రూ అగస్సీ, సఫిన్, నల్బందీయన్, హెవిట్, ఆండీ రాండిక్, ఆండీ ముర్రే, రఫేల్ నాదల్, నొవాక్ జకోవిచ్.. ఇలా ప్రతి ఒక్కరూ కఠిన ప్రత్యర్థులే. అయితేనేం వారందరినీ దాటుకొని 20 గ్రాండ్స్లామ్లు నెగ్గడం సాధారణ విషయమేమీ కాదు. జకోవిచ్తో 50 సార్లు, రఫేల్ నాదల్తో 40 సార్లు, హెవిట్తో 27 సార్లు, ఆండీ ముర్రేతో 25 సార్లు, రాడిక్తో 24, నల్బందీయన్తో 19 సార్లు తలపడ్డాడు. అయితే జకోవిచ్, నాదల్పై కాస్త వెనుకంజ వేసినప్పటికీ.. ఇతర టాప్ ఆటగాళ్లపై పైచేయి సాధించాడు. జకోవిచ్, రఫేల్ నాదల్ కంటే ముందే 20 గ్రాండ్స్లామ్లను గెలిచిన ఆటగాడిగా ఫెదరర్ రికార్డు సృష్టించాడు.
ఫెదరర్కు అరుదైన గౌరవం
ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకొన్న ఫెదరర్ దాదాపు పదేళ్లపాటు టాప్ ఆటగాడిగా పేరొందాడు. స్విట్జర్లాండ్లో రోజర్ పేరిట కాయిన్ విడుదలైంది. జీవించి ఉన్న వ్యక్తికి కాయిన్ విడుదల చేయడం ఫెదరర్ విషయంలోనే చోటు చేసుకోవడం విశేషం. అత్యధికంగా సంపాదించే అథ్లెట్లలో 2012 నుంచి 2021వరకు టాప్-10లో ఫెదరర్ నిలిచాడు. 2020లో ఫోర్బ్స్ విడుదల చేసిన లెక్కల ప్రకారం.. దాదాపు 106 మిలియన్ డాలర్ల ఆదాయం పొందినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు