Rohit - Shikhar : 5 వేల పరుగులు చేసిన నాలుగో జోడీ.. టాప్ ప్లేస్లో ఎవరంటే?
క్రికెట్లో ఏ జట్టుకైనా ప్లస్ పాయింట్ ఓపెనింగ్ జోడీనే.. ఆరంభంలో శుభారంభం దక్కితే మిగతా బ్యాటర్లు చెలరేగేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రపంచ క్రికెట్లో..
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ఏ జట్టుకైనా ప్లస్ పాయింట్ ఓపెనింగ్ జోడీనే.. ఆరంభంలో మంచి పరుగులు రాబడితే మిగతా బ్యాటర్లు చెలరేగేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రపంచ క్రికెట్లో దిగ్గజ క్రికెటర్లు సచిన్-సౌరభ్ గంగూలీ ఓపెనింగ్ జోడీని మించిన మరొక భాగస్వామ్యం లేదంటే అతిశయోక్తి కాదేమో. ఇప్పుడు రోహిత్ శర్మ - శిఖర్ ధావన్ జోడీ కూడా అద్భుతంగా ఆడుతోంది. వీరిద్దరూ కలిసి ఐదు వేల పరుగులను జోడించారు. వీరి కంటే ముందు మరో మూడు జోడీలు మాత్రమే ఆ మార్క్ను దాటాయి. అదేవిధంగా టాప్ -5 పార్టనర్షిప్ల గురించి తెలుసుకొందాం..
సచిన్ - గంగూలీ
ఓపెనింగ్లో అత్యధిక పరుగులను జోడించిన బ్యాటర్లుగా టీమ్ఇండియా దిగ్గజాలు సచిన్ తెందూల్కర్ - సౌరభ్ గంగూలీ చిరస్థాయిగా నిలిచారు. వీరిద్దరూ కలిసి 136 ఇన్నింగ్స్ల్లో 6,609 పరుగులు చేశారు. ఒక మ్యాచ్లో అత్యధికంగా 258 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ రికార్డును టచ్ చేయడం భవిష్యత్తులోనూ కష్టమే.
గిల్క్రిస్ట్ - మ్యాథ్యూ హేడెన్
మొన్నటి వరకూ క్రికెట్ను శాసించిన దేశాల్లో విండీస్ తర్వాత ఆసీస్ ఆ స్థానాన్ని ఆక్రమించింది. దీనికి ప్రధాన కారణం ఓపెనింగ్ జోడీ. గిల్క్రిస్ట్-హేడెన్ కలిసి ఎన్నో మ్యాచుల్లో జట్టుకు విజయాలను అందించారు. వీరిద్దరూ కలిసి 114 ఇన్నింగ్స్ల్లో తొలి వికెట్కు 5,372 పరుగులను జోడించారు.
గార్డన్ గ్రీనిడ్జ్ - డెస్మాండ్ హైన్స్
90వ దశకం వరకు క్రికెట్లో విండీస్కు తిరుగులేని రికార్డు ఉంది. ఆ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ పరంగా హేమాహేమీలతో ఉండేది. గ్రీనిడ్జ్, హైన్స్, వివ్ రిచర్డ్స్, హోల్డింగ్స్, ఆండీ రాబర్ట్స్, లారీ గోమ్స్ వంటి ఆటగాళ్లు ఉండేవారు. మరీ ముఖ్యంగా గ్రీనిడ్జ్ - డెస్మాండ్ హైన్స్ జోడీ పరుగుల వరద పారించేది. వీరిద్దరూ కలిసి 102 ఇన్నింగ్స్ల్లోనే 5,150 పరుగులను జోడించారు.
రోహిత్ శర్మ - శిఖర్ ధావన్
ప్రస్తుతం టీమ్ఇండియా తరఫున అత్యుత్తమ భాగస్వామ్యాలను నిర్మిస్తున్న జోడీ రోహిత్ శర్మ - శిఖర్ ధావన్. వీరిద్దరూ ఇంగ్లాండ్పై శతక (114) భాగస్వామ్యం నిర్మించారు. పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ఇదే క్రమంలో ఇప్పటి వరకు 112 ఇన్నింగ్స్ల్లో 5,108 పరుగులను జోడించారు. సచిన్-గంగూలీ రికార్డును బ్రేక్ చేయడం కష్టం కావొచ్చేమో కానీ.. రెండో స్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
హషీమ్ ఆమ్లా - ఏబీ డివిలియర్స్
(ఫొటో సోర్స్: హషీమ్ ఆమ్లా ఇన్స్టాగ్రామ్)
మిస్టర్ 360 ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఓపెనింగ్ నుంచి ఏడో స్థానం వరకు బ్యాటింగ్ చేయగల సమర్థుడు. ఇక హషీమ్ ఆమ్లా క్రీజ్లో పాతుకుపోయి పరుగులు రాబడతాడు. వీరిద్దరి కాంబినేషన్లో దక్షిణాఫ్రికా అనేక విజయాలను నమోదు చేసింది. హషీమ్ - ఏబీ కలిసి తొలి వికెట్కు 93 ఇన్నింగ్స్ల్లో 4,198 పరుగులు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
తాజా వార్తలు (Latest News)
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM