IND vs NZ: ఒత్తిడి లేదని చెప్పను.. రిలాక్స్ అవ్వకూడదు..: రోహిత్
భారీ స్కోరు చేసినా ఇద్దరు కివీస్ బ్యాటర్లు క్రీజ్లో పాతుకుపోవడంతో టీమ్ఇండియా (IND vs NZ) అభిమానులు కాస్త ఆందోళన చెందారు. కానీ, షమీ కీలక సమయంలో వికెట్లు తీసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో భారత్ వన్డే ప్రపంచకప్ ఫైనల్కు వెళ్లిపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచ కప్ ఫైనల్కు (ODI World Cup 2023) టీమ్ఇండియా చేరుకుంది. లీగ్ స్టేజ్లో అప్రతిహత విజయాలతో సెమీస్కు దూసుకొచ్చిన భారత్.. నాకౌట్లోనూ అదరగొట్టేసింది. తొలి సెమీస్లో న్యూజిలాండ్ను (IND vs NZ) చిత్తు చేసి టైటిల్ పోరుకు సిద్ధమైంది. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 397 పరుగులు చేసినా.. ఒకానొక దశలో కివీస్ లక్ష్య ఛేదన దిశగా సాగడంతో భారత అభిమానుల్లో కాస్త కలవరం రేగింది. కానీ, భారత బౌలర్లు పుంజుకుని కివీస్ను కట్టడి చేయడంతో 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై స్పందించాడు.
‘‘వాంఖడే మైదానంలో చాలా మ్యాచ్లు ఆడా. అలాగని రిలాక్స్గా ఉండకూడదు. వీలైనంత త్వరగా మన బాధ్యతలను ముగించాలి. సెమీస్ వంటి మ్యాచుల్లో ఒత్తిడి సహజం. అయినా నిశ్శబ్దంగా మా బాధ్యతలను నిర్వర్తించాం. ఎప్పుడైతే లక్ష్య ఛేదనలో రన్రేట్ 9కి కంటే ఎక్కువగా ఉందో.. అప్పుడు విజయం సాధించడానికి ఎక్కువ అవకాశాలు వస్తాయి. అయితే, డారిల్ మిచెల్-కేన్ విలియమ్సన్ అద్భుతంగా ఆడారు. ఒకదశలో స్టేడియంలోని ప్రేక్షకులంతా నిశ్శబ్దంగా మారిపోయారు. క్రికెట్ మ్యాచ్ అంటేనే ఇలా ఉంటుంది. అలాంటప్పుడు ఏం చేయాలనే దానిపై మాకు అవగాహన ఉంది. షమీ అద్భుతం చేశాడు. అతడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.
ఇక బ్యాటింగ్లో టాప్ 6 ఆటగాళ్లు రాణించడం మరింత సంతోషంగా ఉంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ అద్భుత ఫామ్ కొనసాగిస్తున్నాడు. కోహ్లీ తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో సరికొత్త మైలురాయిని చేరుకున్నాడు. మా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సూపర్బ్. ఇదే ఉత్సాహంతో టైటిల్ పోరు బరిలోకి దిగుతాం. ఇంగ్లాండ్పై 230 పరుగులు చేసినా మా బౌలర్లు కాపాడారు. ముందుండి జట్టును గెలిపించారు. ఇవాళ మ్యాచ్లో దాదాపు 400 కొట్టినా ఒత్తిడి లేదని చెప్పలేను. కానీ, మా ఆటగాళ్లు రాణించడంతోనే విజయం ఖాయమైంది. లీగ్ దశలో 9 మ్యాచుల్లో మేం ఏం చేశామో.. దానినే కొనసాగించాం’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
కంగ్రాట్స్ భారత్: కేన్ విలియమ్సన్
‘‘మొదట టీమ్ఇండియాకు శుభాకాంక్షలు. టోర్నీ ఆసాంతం అద్భుతమైన క్రికెట్ ఆడుతూ వచ్చింది. ఈ మ్యాచ్లోనూ వారి అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించడం అభినందనీయం. మా ఆటగాళ్లూ అద్భుతంగా పోరాడారు. అయితే, నాకౌట్ స్టేజ్లో ఓటమి చెందడం బాధగా ఉంది. ప్రపంచంలోనే అత్యున్నత స్థాయి బ్యాటర్లు భారత్ జట్టులో ఉన్నారు. దాదాపుగా 400 పరుగుల లక్ష్యం మాకు నిర్దేశించారు. అయినా మేం గట్టిపోటీనిచ్చాం. భారీగా వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. భారత్ అతిథ్యం బాగుంది. రచిన్, మిచెల్ టోర్నీలో మంచి ప్రదర్శన చేశారు. బౌలర్లు కాస్త ఇబ్బంది పడ్డారు. జట్టుగా వీటన్నింటినీ దాటుకుని ముందుకు సాగుతాం’’ అని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత