T20 World Cup: టీ20 ప్రపంచకప్లో రో‘హిట్’ కొట్టాలంతే..
ఎప్పుడో పదిహేనేళ్ల కిందట తొలిసారి నిర్వహించిన టీ20 ప్రపంచకప్ టైటిల్ను టీమ్ఇండియా సొంతం చేసుకొంది. ఆ జట్టులో యువకుడిగా ఉన్న రోహిత్ శర్మ... ఇప్పుడు ఆసీస్ వేదికగా జరుగుతోన్న పొట్టి కప్లో బరిలోకి దిగిన భారత్కు సారథి. ఈసారి ఎలాగైనా కప్ కలను నెరవేర్చాలని రోహిత్ బలంగా ఉన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: 2007 టీ20 ప్రపంచకప్ను టీమ్ఇండియా గెలిచింది. 2011 వన్డే వరల్డ్కప్ను ఖాతాలో వేసుకొంది. ఇవి రెండూ ధోనీ నాయకత్వంలోనే సాధించింది. తర్వాత 2014లో పొట్టి కప్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచిపోయింది. ప్రతి సారి ఫేవరేట్గా బరిలోకి దిగడం.. నిరుత్సాహపరచడం కామన్గా మారిపోయింది. గత టీ20 ప్రపంచకప్లో ఘోరంగా గ్రూప్ స్టేజ్కే పరిమితమై ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో కొత్త సారథిగా రోహిత్ శర్మ వచ్చాడు. అలాగే కోచ్గా రాహుల్ ద్రవిడ్ను బీసీసీఐ నియమించింది. మరి ఆస్ట్రేలియా వేదికగా జరుగుతోన్న పొట్టి కప్లో భారత్ను విజేతగా నిలపాలంటే రోహిత్-రాహుల్ కింకర్తవ్యం ఏంటి..?
అప్పటి నుంచి ఉన్నాడు..
తొలిసారి భారత్ టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడు రోహిత్ శర్మ. ఇప్పుడు కెప్టెన్గా బరిలోకి దిగాడు. గత ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ స్థానంలో హిట్మ్యాన్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. అప్పటి నుంచి వరుసగా ద్వైపాక్షిక సిరీస్లను గెలుచుకుంటూ వచ్చాడు. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇప్పుడు టీమ్ఇండియా తరఫున అత్యధిక టీ20లను గెలిపించిన రెండో సారథి రోహిత్ శర్మనే. మొదటి స్థానం కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ సొంతం. పొట్టి ఫార్మాట్కు కెప్టెన్గా రోహిత్ న్యూజిలాండ్పై తొలి సిరీస్ను కైవసం చేసుకొన్నాడు. 31 మ్యాచుల్లో 26 విజయాలు సాధించి 83.87 శాతంతో భారత సారథుల్లో టాప్గా నిలిచాడు.
ఇప్పటి వరకు రెగ్యులర్ సారథిగా రోహిత్ సొంతమైన టీ20 సిరీస్లు ఇవే..
* కివీస్పై 3-0
* వెస్టిండీస్పై స్వదేశంలో 3-0
* శ్రీలంక మీద 3-0
* ఇంగ్లాండ్లో ఇంగ్లాండ్పై 2-1
* వెస్టిండీస్పై వెస్టిండీస్ వేదికగా 4-1
* స్వదేశంలో ఆస్ట్రేలియాపై 2-1
* దక్షిణాఫ్రికాపై 2-1
ప్రధాన టోర్నీలో తేలిపోయి..
సిరీసుల్లో అదరగొట్టిన రోహిత్ - రాహుల్ కాంబినేషన్.. ఆసియా కప్ వంటి టోర్నమెంట్లో మాత్రం తేలిపోయింది. సూపర్-4 స్టేజ్లో శ్రీలంక, పాక్ చేతిలో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. ఆటగాడిగా ఎంతో అనుభవం ఉన్న రోహిత్ శర్మ మెగా టోర్నీలో జట్టును సరైన దిశలో నడిపించాలి. బౌలర్లను సరిగ్గా వినియోగించుకోలేపోయాడనే విమర్శలు వచ్చాయి. డెత్ ఓవర్లను ఇప్పటికీ సెట్ చేయలేదు. ఓపెనర్గానూ భారీ ఇన్నింగ్స్లు ఆడటం లేదు. దూకుడుగా బ్యాటింగ్ ఆరంభిస్తున్నా.. అదే ఒరవడిని ఆసాంతం కొనసాగించలేక ఇబ్బంది పడ్డాడు.
తొలుత బ్యాటర్గా రాణించాలి..
ఓపెనింగ్ బ్యాటర్ కెప్టెన్ అయి ఉండి సరిగా ప్రదర్శన చేయకపోతే ఆ ప్రభావం మిగతా జట్టుపై కచ్చితంగా పడుతుంది. నాయకుడంటే కేవలం నిర్ణయాలు తీసుకోవడమే కాదు.. ముందుండి నడిపించాలి. బ్యాటర్ అయితే బ్యాటింగ్లో రాణించాలి. బౌలర్ అయితే అద్భుత ప్రదర్శన చేయాలి. అలా కాకుండా కెప్టెన్గా జట్టును అద్భుతంగా నడిపినా.. ఏదొక రోజు విమర్శలపాలు కాక తప్పదు. ఇలాగే ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్తోపాటు టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే రోహిత్ మొదట బ్యాటింగ్పైనా దృష్టి పెట్టాలి. గత పది ఇన్నింగ్స్ల్లో రోహిత్ గణాంకాలను చూస్తే గొప్పగా ఏమీ లేవు. అతడి కంటే విరాట్ కోహ్లీ మెరుగైన ప్రదర్శన చేసినా.. సెంచరీ సాధించలేదనే కారణంతో విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు రోహిత్ మెగా టోర్నీలో రాణించకపోతే అతడి కెప్టెన్సీ కెరీర్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదు.
కాస్త ఓపిక ఉండాలి భాయ్..
ఇటీవల ఆసియా కప్, ఆస్ట్రేలియా సిరీసుల్లో మ్యాచ్లను చూసిన పలువురు విశ్లేషకులు, మాజీలు చెబుతున్న మాట.. రోహిత్ కాస్త ఓపిక వహించు.. ఎందుకంటే ఫలితం అనుకున్నట్లుగా రాకపోతే మైదానంలోనే తీవ్ర అసంతృప్తి గురైన సందర్భాలు ఉన్నాయి. అది అతడి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపించింది. అయితే రోహిత్ను కోపమొచ్చినా.. ఆనందమొచ్చినా ఆపలేమని అభిమానులు అంటుంటారు. ఇటీవల ఆసీస్తో సిరీస్ సందర్భంగా సీనియర్ ప్లేయర్ దినేశ్ కార్తిక్ను ఆటపట్టించిన వైనం వైరల్గా మారిన విషయం తెలిసిందే. అలాగే ఆసియా కప్లో పాక్తో మ్యాచ్ సందర్భంగా యువ ఆటగాడు అర్ష్దీప్ సింగ్ క్యాచ్ చేజార్చడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన వీడియో కూడా నెట్టిట్లో ట్రోలింగ్కు గురైంది.
‘‘కెప్టెన్గా తొలిసారి మెగా టోర్నీకి రావడం ఉత్సాహంగా ఉంది. వరల్డ్ కప్ను గెలవడమే ప్రధాన ధ్యేయం. అందుకోసం చాలా కష్టపడాలని తెలుసు’’ ఇదీ రోహిత్ శర్మ వార్మప్ మ్యాచ్ల తర్వాత చెప్పిన మాటలు.. ఐసీసీ ఈవెంట్లో మొదటిసారి సారథిగా జట్టును నడిపిస్తున్నాడు. సహచరుల్లోని టాలెంట్ను బయటకు తెచ్చేలా మద్దతు ఇవ్వాలి. ఏదైనా పొరపాటు జరిగితే మందలించే సమయంలో సంయమనం పాటించాలి. మ్యాచ్ ముగిశాక మీడియా సమావేశాల్లో చెప్పడమే కాకుండా.. మైదానంలోనూ దూకుడు తగ్గించుకోవాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు.
‘19’ ఫోబియాను తరిమేయాలి..
భారత బౌలర్లకు ఉన్న ఫోబియా.. 19వ ఓవర్ అని ఇప్పటికే చాలాసార్లు అనుకొన్నాం. అయితే టీ20 ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో మాత్రం ప్రతి ఓవర్ కీలకం. ఏమాత్రం అలసత్వం ప్రదర్శించి పరుగులు సమర్పించినా ఫలితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. బుమ్రా లేకపోవడంతో డెత్ ఓవర్లలో భారత్ కాస్త బలహీనంగా మారిందనే వాదనను రోహిత్ అధిగమించాలి. అందుకు తగ్గట్లుగా షమీ, హర్షల్ పటేల్, అర్ష్దీప్తో బౌలింగ్ చేయిస్తే మంచిదనే సూచనలు సీనియర్లు చేశారు. ఆరంభ ఓవర్లలో అదరగొట్టే భువనేశ్వర్తో ప్రయోగాలు చేయకపోవడం మంచిది. పవర్ప్లేలో భువీ నిలకడగా.. కట్టుదిట్టంగా బంతులను సంధించిన మ్యాచ్లను అనేకం చూశాం. ఆరంభంలో బంతిని వికెట్కు ఇరువైపులా స్వింగ్ చేయగల సమర్థుడు. అందుకే భువీ ఓవర్ల కోటాను త్వరగా పూర్తి చేయించాలని మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా చెప్పాడు. ప్రత్యర్థి బ్యాటర్నుబట్టి బౌలర్ను బరిలోకి దించితేనే ఫలితం అనుకూలంగా రాబట్టే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు