RCBw Vs DCw: దంచికొట్టిన షఫాలీ వర్మ, మెగ్ లానింగ్.. ముంబయి రికార్డును బద్దలు కొట్టిన దిల్లీ
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) తొలి సీజన్లో పురుషుల ఐపీఎల్ మాదిరిగానే పరుగుల వరద పారుతోంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 207 పరుగుల స్కోరు నమోదు చేయగా.. రెండో మ్యాచ్లోనే ఆ రికార్డును దిల్లీ బద్దలుకొట్టింది.
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2023) తొలి సీజన్లో పురుషుల ఐపీఎల్ మాదిరిగానే పరుగుల వరద పారుతోంది. లీగ్ ఆరంభ మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ 207 పరుగుల స్కోరు నమోదు చేయగా.. రెండో మ్యాచ్లోనే ఆ రికార్డును దిల్లీ బద్దలుకొట్టింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw)తో జరుగుతున్న మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన దిల్లీ క్యాపిటల్స్ (DCw) నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (72; 43 బంతుల్లో 14 ఫోర్లు), షఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ శతకాలతో విరుచుకుపడ్డారు. షఫాలీ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. లానింగ్ 30 బంతుల్లోనే ఈ మార్క్ను అందుకుంది. బెంగళూరు బౌలర్లలో హీథర్ నైట్ రెండు వికెట్లు పడగొట్టింది. మిగతా బౌలర్లకు వికెట్లు దక్కలేదు.
పోటాపోటీగా బౌండరీలు.. ఒకే ఓవర్లో ఔట్
ఇన్నింగ్స్ ఆరంభం నుంచి షఫాలీ, మెగ్ లానింగ్ పోటాపోటీగా బౌండరీలు బాదారు. మెగన్ స్కట్ వేసిన రెండో ఓవర్లో లానింగ్ వరుసగా రెండు ఫోర్లు కొట్టగా.. ప్రీతి బోస్ వేసిన నాలుగో ఓవర్లో షఫాలీ ఓ సిక్సర్ బాదింది. సోఫీ డివైన్ వేసిన ఆరో ఓవర్లో చెరో రెండు బౌండరీలు బాదారు. ఆషా శోభన వేసిన తొమ్మిదో ఓవర్లో షఫాలీ రెండు సిక్స్లు, ఓ ఫోర్.. లానింగ్ ఓ ఫోర్ రాబట్టడంతో ఈ ఓవర్లో ఏకంగా 22 పరుగులొచ్చాయి. హీథర్ నైట్ వేసిన 11 ఓవర్లో మరో సిక్సర్ బాదిన షఫాలీ.. రేణుకా సింగ్ వేసిన తర్వాతి ఓవర్లో బంతిని మూడు సార్లు బౌండరీకి పంపింది.
వరుస బౌండరీలతో విరుచుకుపడుతూ శతకాల దిశగా సాగుతున్న ఈ ఇద్దరూ బ్యాటర్లను హీథర్ ఒకే ఓవర్లో ఔట్ చేసి బెంగళూరుకు ఉపశమనం అందించింది. లానింగ్ క్లీన్బౌల్డ్ కాగా.. షఫాలీ.. వికెట్ కీపర్ రిచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. ఆ తర్వాత మెరిజన్నే (39*; 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు), జెమీమా రోడ్రిగ్స్ (22*; 15 బంతుల్లో 3 ఫోర్లు) కూడా రాణించడంతో దిల్లీ రికార్డు స్కోరు సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!