Ruturaj-Jagadeesan: భారత టీ20 లీగ్ సహచరులే.. విజయ్ హజారే ట్రోఫీలోనూ అదరగొట్టేశారు
భారత టీ20 లీగ్లో ఇద్దరూ ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే ఒకరు తుది జట్టులో స్థానం సంపాదించి అదరగొట్టగా.. మరొకరు ఎక్కువగా రిజర్వ్ బెంచ్కే పరిమితం కావడం గమనార్హం. అయితే విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం చెరొక జట్టుకు ఆడి అద్భుత ప్రదర్శన చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: విజయ్ హజారే ట్రోఫీ కోసం దేశీయంగా 32 జట్లు తలపడ్డాయి. చివరికి డిసెంబర్ 2న మహారాష్ట్ర, సౌరాష్ట్ర మాత్రమే ఫైనల్లో ఢీకొనబోతున్నాయి. అయితే టోర్నీలో ఇద్దరు పేర్లు మారుమోగిపోతున్నాయి. ఒకరేమో శతకాల నారాయణ్ జగదీశన్ కాగా.. మరొకరు సిక్సర్ల రుతురాజ్ గైక్వాడ్. విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ.. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోని చెన్నై ఫ్రాంచైజీకి వీరు ఆడటం విశేషం. విజయ్ హజారే ట్రోఫీలో రుతురాజ్, జగదీశన్ ఏ టీమ్లకు ఆడుతున్నారు.. ఏం ఘనత సాధించారు..? అనే విషయాలను తెలుసుకొందాం...
యువీ గుర్తుకొచ్చి..
ఆరు బంతుల్లో ఆరు సిక్స్లు కొట్టడం అరుదైన ఘనత. అలాంటిది అదనంగా వేసిన బంతిని కూడా సిక్స్గా మలచడం విశేషం. ఈ రికార్డును కొట్టిందెవరో కాదు క్రికెట్ అభిమానులకు సుపరిచితుడైన రుతురాజ్ గైక్వాడ్. ఉత్తర్ప్రదేశ్ మీద ఏడు సిక్స్లు కొట్టాడు. ఐదో సిక్స్ కొట్టిన తర్వాత రుతురాజ్ తనకు యువరాజ్ గుర్తుకొచ్చాడని చెప్పాడు. మొత్తం ఆ ఓవర్లో 43 పరుగులు వచ్చాయి. మహారాష్ట్ర తరఫున ఆడుతున్న రుతురాజ్.. తన జట్టును ఫైనల్కు తీసుకెళ్లడంలోనూ కీలక పాత్ర పోషించాడు. సెమీస్లో అసోంపై శతకం (168) సాధించాడు. సౌరాష్ట్రపైనా ఫైనల్లో అదరగొట్టాలని అతడి అభిమానులు ఆశిస్తున్నారు. ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు శతకాలతో 443 పరుగులు సాధించాడు.
టీ20 లీగ్లో..
భారత టీ20 లీగ్ 2021 సీజన్లో టాప్ స్కోరర్ జాబితాలో చేరాడు. 16 మ్యాచుల్లో ఒక సెంచరీ, నాలుగు అర్ధశతకాలతో 635 పరుగులు సాధించాడు. ఇందులో ఓపెనర్గా డుప్లెసిస్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మించాడు. అయితే గత సీజన్లో మాత్రం పెద్దగా రాణించలేదు. ఆడిన 14 మ్యాచుల్లో కేవలం 368 పరుగులు మాత్రమే చేశాడు.
శతకాలతో విజృంభణ..
కేవలం ఏడు మ్యాచుల్లో వరుసగా ఐదు శతకాలు సాధించడం సాధారణ విషయం కాదు. అయితే ఆ ఘనతను తమిళనాడు క్రికెటర్ నారాయణ్ జగదీశన్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గోవా, హరియాణా, అరుణాచల్ ప్రదేశ్పై సెంచరీలు బాదాడు. ఇందులో అసోంపై కేవలం 141 బంతుల్లోనే 277 పరుగులు చేసిన ఇన్నింగ్స్ ఓ రికార్డునే తెచ్చిపెట్టింది. లిస్ట్ - ఏ క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ సాధించిన ఆటగాడిగా జగదీశన్ నిలిచాడు. అయితే కీలకమైన క్వార్టర్ ఫైనల్లో విఫలం కావడంతో తమిళనాడు కథ అక్కడికే పరిమితమైంది. కానీ టోర్నీ టాప్ స్కోరర్ మాత్రం జగదీశనే కావడం విశేషం. 8 మ్యాచుల్లో 138.33 సగటుతో 830 పరుగులు చేశాడు.
టీ20 లీగ్లో..
జగదీశన్కు మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదనే చెప్పాలి. ఎక్కువగా బెంచ్కే పరిమితమయ్యాడు. గత సీజన్లో కేవలం రెండు మ్యాచులు, 2020 ఎడిషన్లో 5 మ్యాచ్లను మాత్రమే ఆడాడు. అన్ని మ్యాచుల్లో కలిపి కేవలం 73 పరుగులు చేశాడు. మరి జగదీశన్ ప్రదర్శనతో ఈసారైనా చెన్నై రిజర్వ్ బెంచ్కే పరిమితం చేయకుండా తుది జట్టులో స్థానం కల్పిస్తుందో లేదో చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్