Sachin- ODI Cricket: కొన్ని మార్పులు చేస్తే.. వన్డే క్రికెట్కు జీవం వస్తుంది: సచిన్
వన్డే క్రికెట్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సచిన్ తెందూల్కర్ (Sachin) చెప్పాడు. అప్పుడే వన్డే ఫార్మాట్పై అభిమానుల్లో ఆసక్తి పెంచేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో టెస్టు ఫార్మాట్ది ప్రత్యేక స్థానం. ఆ తర్వాత వన్డేలను (ODI Cricket) విపరీతంగా అభిమానులు వీక్షించేవారు. టీ20లు ఎప్పుడైతే వచ్చాయో.. వన్డే ప్రాభవం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు మినహా ద్వైపాక్షిక సిరీసుల్లో ఈ ఫార్మాట్ మ్యాచ్లకు చోటు దక్కడం కూడా గగనంగా మారింది. దీంతో వన్డేలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఐసీసీ, క్రికెట్ బోర్డులపై ఉందనేది కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్పై అభిమానుల్లో ఆసక్తి పెరగాలంటే కచ్చితంగా కీలక మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు ఘంటాపథంగా చెప్పారు. ఇప్పుడున్న 50 ఓవర్ల ఫార్మాట్ను 40కు కుదించాలని టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా రవిశాస్త్రి అభిప్రాయానికి మద్దతు పలికాడు. వన్డే మ్యాచ్లు బోర్ కొడుతున్నాయని చెప్పిన సచిన్ (Sachin).. ఆసక్తి పెంచడానికి పలు కీలక సూచనలనూ అందించాడు.
‘‘గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్ ఫార్మాట్లో ఎలాంటి మార్పులు లేవు. తప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రకారం రెండు కొత్త బంతులను ఇవ్వడం వల్ల బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయింది. గతంలో మాదిరిగా రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లభించడంలేదు. దాంతో 15వ ఓవర్ నుంచి 40వ ఓవర్ వరకు మ్యాచ్ బోర్ కొడుతోంది. అందుకే టెస్టు తరహాలో 50 ఓవర్ల క్రికెట్నూ రెండు ఇన్నింగ్స్లుగా విడదీసి ఆడించాలి. అప్పుడు మ్యాచ్ రసవత్తరంగా మారడంతోపాటు వాణిజ్యపరంగానూ కలిసొస్తుంది. టాస్, మంచు ప్రభావం, పిచ్ పరిస్థితులు ఇరు జట్లకూ అనుకూలంగా ఉండాలి’’ అని సచిన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్