Sachin- ODI Cricket: కొన్ని మార్పులు చేస్తే.. వన్డే క్రికెట్కు జీవం వస్తుంది: సచిన్
వన్డే క్రికెట్లో సమూల మార్పులు చేయాల్సిన అవసరం ఉందని సచిన్ తెందూల్కర్ (Sachin) చెప్పాడు. అప్పుడే వన్డే ఫార్మాట్పై అభిమానుల్లో ఆసక్తి పెంచేందుకు ఆస్కారం ఉంటుందని తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ క్రికెట్లో టెస్టు ఫార్మాట్ది ప్రత్యేక స్థానం. ఆ తర్వాత వన్డేలను (ODI Cricket) విపరీతంగా అభిమానులు వీక్షించేవారు. టీ20లు ఎప్పుడైతే వచ్చాయో.. వన్డే ప్రాభవం క్రమంగా తగ్గుముఖం పడుతోంది. వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు మినహా ద్వైపాక్షిక సిరీసుల్లో ఈ ఫార్మాట్ మ్యాచ్లకు చోటు దక్కడం కూడా గగనంగా మారింది. దీంతో వన్డేలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఐసీసీ, క్రికెట్ బోర్డులపై ఉందనేది కాదనలేని సత్యం. ఈ ఫార్మాట్పై అభిమానుల్లో ఆసక్తి పెరగాలంటే కచ్చితంగా కీలక మార్పులు చేయాలని మాజీ క్రికెటర్లు ఘంటాపథంగా చెప్పారు. ఇప్పుడున్న 50 ఓవర్ల ఫార్మాట్ను 40కు కుదించాలని టీమ్ఇండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి కీలక సూచన చేశాడు. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ కూడా రవిశాస్త్రి అభిప్రాయానికి మద్దతు పలికాడు. వన్డే మ్యాచ్లు బోర్ కొడుతున్నాయని చెప్పిన సచిన్ (Sachin).. ఆసక్తి పెంచడానికి పలు కీలక సూచనలనూ అందించాడు.
‘‘గత కొన్నేళ్లుగా వన్డే క్రికెట్ ఫార్మాట్లో ఎలాంటి మార్పులు లేవు. తప్పకుండా కీలక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడున్న ప్రకారం రెండు కొత్త బంతులను ఇవ్వడం వల్ల బ్యాటర్లకు అనుకూలంగా మారిపోయింది. గతంలో మాదిరిగా రివర్స్ స్వింగ్ చేసే అవకాశం బౌలర్లకు లభించడంలేదు. దాంతో 15వ ఓవర్ నుంచి 40వ ఓవర్ వరకు మ్యాచ్ బోర్ కొడుతోంది. అందుకే టెస్టు తరహాలో 50 ఓవర్ల క్రికెట్నూ రెండు ఇన్నింగ్స్లుగా విడదీసి ఆడించాలి. అప్పుడు మ్యాచ్ రసవత్తరంగా మారడంతోపాటు వాణిజ్యపరంగానూ కలిసొస్తుంది. టాస్, మంచు ప్రభావం, పిచ్ పరిస్థితులు ఇరు జట్లకూ అనుకూలంగా ఉండాలి’’ అని సచిన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం