World Para Athletics: సచిన్ రికార్డు స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాల పంట పండిస్తున్నారు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్
కోబె: పారిస్ పారాలింపిక్స్కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం పురుషుల ఎఫ్46 షాట్పుట్లో సచిన్ ఖిలారి బంగారు పతకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఇనుప గుండును 16.30 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న ఆసియా రికార్డు (16.21మీ)నూ మెరుగుపర్చాడు. మరోవైపు పురుషుల ఎఫ్51 క్లబ్ త్రోలో ధరంవీర్ కాంస్యం నెగ్గాడు. 33.61మీ. దూరం క్లబ్ను విసిరి అతను మూడో స్థానంలో నిలిచాడు. అతను కేవలం 1 సెంటీమీటర్ తేడాతో వెండి పతకాన్ని కోల్పోయాడు. దిమిత్రిజెవిచ్ (సెర్బియా- 34.20మీ) మీట్ రికార్డుతో పసిడి, హెర్నాండెజ్ (మెక్సికో- 33.62మీ) రజతం గెలిచారు. ఇప్పటికే 12 (5 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) పతకాలతో ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2023లో సాధించిన 10 (3 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) పతకాల రికార్డును ఇప్పుడు అధిగమించింది. ఇంకో మూడు రోజుల పాటు పోటీలు జరగనుండటంతో భారత్ మరిన్ని పతకాలు సాధించే అవకాశముంది. ప్రస్తుతానికి చైనా (18 స్వర్ణాలు), బ్రెజిల్ (17 స్వర్ణాలు) తర్వాత భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర సాంగ్లి జిల్లాకు చెందిన 34 ఏళ్ల సచిన్కు పాఠశాలలో ఉన్న సమయంలో ఓ దుర్ఘటన కారణంగా ఎడమ చేతిలో వైకల్యం ఏర్పడింది. మోచేతి నుంచి అతని కండరాలు దెబ్బతిన్నాయి. ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా అతని చేయి మునుపటి స్థితికి చేరలేదు. అయినా నిరాశపడకుండా షాట్పుట్ను ఎంచుకుని గొప్పగా రాణిస్తున్నాడు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో మహిళల టీ20 విభాగం 400మీ.పరుగులో ప్రపంచ రికార్డుతో పసిడి గెలిచిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ జీవాంజి దీప్తికి ఘన స్వాగతం లభించింది. జపాన్లో జరిగిన ఈ పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన ఆమె మంగళవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది. సాయ్ ఎస్టీసీ గచ్చిబౌలి కేంద్రం సహాయక డైరెక్టర్, తెలంగాణ పారా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి తదితరులు దీప్తికి స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆగస్టు 1 నుంచి భూముల మార్కెట్ విలువ పెంపు
-
స్వీయ తప్పిదాలతోనే పాస్పోర్టు జారీలో ఆలస్యం
-
ప్రజలకు ఉపశమనం కలిగించే నిర్ణయం.. త్వరలో చెత్త పన్నుకు చెల్లు చీటీ!
-
అక్రమాలకు అడ్డాగా జగనన్న కాలనీలు.. అడ్డగోలుగా బిల్లులు విడుదల
-
వితంతువైన వదినతో పెళ్లి.. కాల్చిచంపిన ఇతర సోదరులు
-
నొక్కేద్దాం.. దొరికితే చూద్దాం.. జేబులు నింపేసుకున్న ఇంటి దొంగలు