World Para Athletics: సచిన్ రికార్డు స్వర్ణం
పారిస్ పారాలింపిక్స్కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాల పంట పండిస్తున్నారు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్
కోబె: పారిస్ పారాలింపిక్స్కు ముందు భారత అథ్లెట్లు ఆశాజనక ప్రదర్శన చేస్తున్నారు. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో పతకాల పంట పండిస్తున్నారు. బుధవారం పురుషుల ఎఫ్46 షాట్పుట్లో సచిన్ ఖిలారి బంగారు పతకాన్ని నిలబెట్టుకున్నాడు. అతను ఇనుప గుండును 16.30 మీటర్ల దూరం విసిరి తన పేరిటే ఉన్న ఆసియా రికార్డు (16.21మీ)నూ మెరుగుపర్చాడు. మరోవైపు పురుషుల ఎఫ్51 క్లబ్ త్రోలో ధరంవీర్ కాంస్యం నెగ్గాడు. 33.61మీ. దూరం క్లబ్ను విసిరి అతను మూడో స్థానంలో నిలిచాడు. అతను కేవలం 1 సెంటీమీటర్ తేడాతో వెండి పతకాన్ని కోల్పోయాడు. దిమిత్రిజెవిచ్ (సెర్బియా- 34.20మీ) మీట్ రికార్డుతో పసిడి, హెర్నాండెజ్ (మెక్సికో- 33.62మీ) రజతం గెలిచారు. ఇప్పటికే 12 (5 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) పతకాలతో ప్రపంచ పారా అథ్లెటిక్స్లో భారత్ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. 2023లో సాధించిన 10 (3 స్వర్ణాలు, 4 రజతాలు, 3 కాంస్యాలు) పతకాల రికార్డును ఇప్పుడు అధిగమించింది. ఇంకో మూడు రోజుల పాటు పోటీలు జరగనుండటంతో భారత్ మరిన్ని పతకాలు సాధించే అవకాశముంది. ప్రస్తుతానికి చైనా (18 స్వర్ణాలు), బ్రెజిల్ (17 స్వర్ణాలు) తర్వాత భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర సాంగ్లి జిల్లాకు చెందిన 34 ఏళ్ల సచిన్కు పాఠశాలలో ఉన్న సమయంలో ఓ దుర్ఘటన కారణంగా ఎడమ చేతిలో వైకల్యం ఏర్పడింది. మోచేతి నుంచి అతని కండరాలు దెబ్బతిన్నాయి. ఎన్ని శస్త్రచికిత్సలు చేసినా అతని చేయి మునుపటి స్థితికి చేరలేదు. అయినా నిరాశపడకుండా షాట్పుట్ను ఎంచుకుని గొప్పగా రాణిస్తున్నాడు.
ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో మహిళల టీ20 విభాగం 400మీ.పరుగులో ప్రపంచ రికార్డుతో పసిడి గెలిచిన ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ జీవాంజి దీప్తికి ఘన స్వాగతం లభించింది. జపాన్లో జరిగిన ఈ పోటీల్లో ఛాంపియన్గా నిలిచిన ఆమె మంగళవారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంది. సాయ్ ఎస్టీసీ గచ్చిబౌలి కేంద్రం సహాయక డైరెక్టర్, తెలంగాణ పారా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి తదితరులు దీప్తికి స్వాగతం పలికారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్